India- Bangladesh: భారత్తో ఉన్న వాణిజ్య సమస్యలను త్వరలోనే పరిష్కరించుకుంటాం..
- బంగ్లాదేశ్ను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం కఠిన ఆంక్షలు..
- భారత్తో నెలకొన్న వాణిజ్య సమస్యలను పరిష్కరించుకుంటాం..
- వాణిజ్య ప్రక్రియలో సమస్యలు ఉండటం సహజం: మహమ్మద్ యూనస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India- Bangladesh: బంగ్లాదేశ్ను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ఆ దేశ దిగుమతులపై అనేక పరిమితులను విధిస్తున్నట్లు పేర్కొనింది. ఈ నేపథ్యంలో భారత్తో నెలకొన్న వాణిజ్య సమస్యలను త్వరలోనే పరిష్కరించుకుంటామని తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ చెప్పుకొచ్చారు. ఈ మేరకు బంగ్లాదేశ్ వాణిజ్య సలహాదారు షేక్ బషీరుద్దీన్ మీడియాతో వెల్లడించారు.
Read Also: Gulzar House: గుల్జార్హౌస్ అగ్నిప్రమాదం వెనుక అక్రమ కరెంట్ కనెక్షన్..!
Also Read
- NEET Exam: నాగ్పూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ సెంటర్.. అసలు నిజం ఇదే..
- Railway Rules: టికెట్ లేని ప్రయాణంపై రైల్వే రూల్స్ చేంజ్.. ఇకపై డబుల్ పెనాల్టీ..
- Maharashtra Temple Tragedy: పర్భణిలో విషాదం.. హనుమాన్ ఆలయ మండపం కూలి ఆరుగురు మృతి
- PM Kisan: రైతులకు శుభవార్త.. అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. చెక్ చేసుకోండిలా..
అయితే, భారత్ తీసుకున్న చర్యలకు సంబంధించి మాకు ఇంకా అధికారిక సమాచారం రాలేదని బంగ్లా వాణిజ్య సలహాదారు షేక్ బషీరుద్దీన్ తెలిపారు. సమాచారం అందిన తర్వాత చర్యలు తీసుకుంటాం అన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే చర్చలతో వాటిని పరిష్కరించుకునేలా ప్లాన్ చేస్తామన్నారు. అఖౌరా, డాగి పోర్టులతో పాటు కొన్ని సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి పలు నిర్ణయాలను భారత్ తీసుకున్నట్లు తెలుస్తుంది.. ఇది రెండు దేశాలకు మంచి విషయం.. వస్త్ర పరిశ్రమలో భారత్ మొదటి స్థానంలో ఉందని తాము భావిస్తున్నాం.. ఇప్పటికీ, ఆయా ఉత్పత్తులు మా దేశం నుంచి ఎగుమతి అవుతున్నాయని వెల్లడించారు. భారత్- బంగ్లాదేశ్ పొరుగు దేశాలు. సహజంగానే వాణిజ్యం, రవాణా లాంటి వాటిల్లో పోటీ అనేది ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్ని సార్లు మేము ఆంక్షలు విధిస్తాం.. అలాగే భారత్ కూడా చేస్తోంది.. వాణిజ్య ప్రక్రియలో ఇది భాగం మాత్రమేనని తేల్చి చెప్పారు. ఇందులో ఏమైనా సమస్యలు ఉంటే రెండు దేశాలు పరిష్కారం చేసుకుంటాయని బషీరుద్దీన్ చెప్పారు.
Read Also: Gulzar House: గుల్జార్హౌస్ అగ్నిప్రమాదం వెనుక అక్రమ కరెంట్ కనెక్షన్..!
ఇక, గత నెలలో భారత్ నుంచి వచ్చే వస్తువులపై బంగ్లాదేశ్ పరిమితులు విధించింది. దీనికి ప్రతిస్పందనగా.. ఇండియా అక్కడి నుంచి దిగుమతయ్యే రెడీమేడ్ దుస్తులు, శుద్ధి చేసిన ఆహార పదార్థాలు, కార్బొనేటెడ్ డ్రింక్స్, పత్తి, నూలు వ్యర్థాలు, ప్లాస్టిక్, పీవీసీ వస్తువులు, కలప ఫర్నీచర్ తదితర అన్నింటిని ఆపేసింది. ఈ సరకులను కోల్కతా నౌకాశ్రయం, ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ నౌకాశ్రయం నుంచి మాత్రమే భారత దేశంలోకి వస్తాయి. కానీ, బంగ్లా నుంచి దిగుమతి అయ్యే చేపలు, ఎల్పీజీ, వనస్పతి, కంకర లాంటి వాటికి ఈ ఆంక్షలు వర్తించవని భారత్ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
-
Klin Kaara: క్లిం కార చరణ్కి జిరాక్స్ కాపీ.. చూశారా?
-
Arasan: డైరెక్టర్ వెట్రిమారన్ మైండ్ బ్లోయింగ్ లీక్!
-
Kayadu Lohar: సోషల్ మీడియాకు పారడైజ్ హీరోయిన్ గుడ్బై.. కారణం ఇదే!
-
YS Jagan: ‘హలో ఇండియా’ అంటూ జగన్ పోస్ట్.. కూటమి సర్కార్పై సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!