Indian Envoy: ఆపరేషన్ సింధూర్ ముగియలేదు.. ఉగ్రవాది హఫీజ్ సయీద్ను అప్పగించాల్సిందే!
- ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతు కూడగడుతున్న భారత్..
- ఆపరేషన్ సింధూర్కు విరామం ఇచ్చాం.. ముగియలేదు: ఇజ్రాయెల్లోని భారత రాయబారి
- పాకిస్తాన్ లోని ఉగ్రవాది హఫీజ్ సయీద్ను అప్పగించాల్సిందే: రాయబారి జేపీ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Envoy: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల దేశాన్ని ఏకాకిని చేసేందుకు ఇండియా అనేక వ్యూహాలు రచిస్తుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతు కూడగట్టడానికి భారత్ ప్లాన్ చేసింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్లోని భారత రాయబారి జేపీ సింగ్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్కు “విరామం” ఇచ్చాం అంతే “ముగియలేదని” తేల్చి చెప్పారు. 26/11 ముంబై ఉగ్ర దాడి ప్రధాన సూత్రధారులలో ఒకరైన తహవూర్ హుస్సేన్ రాణాను అమెరికా భారత్ కు అప్పగించినట్లుగానే.. ఇస్లామాబాద్ లోని కీలక ఉగ్రవాదులు హఫీజ్ సయీద్, సాజిద్ మీర్, జకీర్ రెహ్మాన్ లఖ్వీలను అప్పగించాలని భారత రాయబారి జేపీ సింగ్ డిమాండ్ చేశారు.
Read Also: Thapsee : ఆ సమయం కోసం ఎదురు చూస్తున్న..
Also Read
అయితే, పాకిస్తాన్ లోని ఉగ్రవాద గ్రూపులను మాత్రమే భారత్ టార్గెట్ చేసింది.. కానీ, పాక్ మాత్రం మా దేశ సైనిక స్థావరాలపై దాడి చేసేందుకు ట్రై చేసిందని ఇజ్రాయెల్లోని భారత రాయబారి జేపీ సింగ్ వెల్లడించారు. కాగా, ఉగ్రవాదంపై మా పోరాటం కొనసాగుతుంది.. ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా.. వారిని హతమార్చే వరకు ఈ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. మే 10వ తేదీన తెల్లవారుజామున నూర్ ఖాన్ స్థావరంపై భారతదేశం చేసిన దాడిని గేమ్ ఛేంజర్గా అతడు అభివర్ణించారు. దీంతో పాకిస్తాన్లో భయాందోళనలు స్టార్ట్ కావడంతో.. DGMO కాల్పుల విరమణ కోసం భారత ప్రతినిధులను సంప్రదించిందని రాయబారి జేపీ సింగ్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
-
India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
-
Lenin Success Meet: ‘లెనిన్’ సక్సెస్ మీట్లో భావోద్వేగానికి గురైన భాగ్యశ్రీ.. ‘వాళ్ల ప్రేమే నా అతిపెద్ద అవార్డు’!
-
HYD BOY MISSING: మిస్టరీ డెత్.. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడా.?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!