చైనా మరోసారి ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చింది. అణ్వస్త్ర సామర్థ్యమున్న ఓ సరికోత్త హైపర్సోనిక్ క్షిపణిని పరీక్షించింది. ఈ క్షిపణి భూకక్ష్యకు దిగువున భూమి మొత్తాన్ని చుట్టేసి లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అయితే, చైనా ప్రయోగించిన ఈ క్షిపణి కొద్దిలో గురితప్పినప్పటికీ, అమెరికా కన్నుగప్పి ఈ క్షిపణిని ప్రయోగించింది. భూకక్ష్యకు దిగువున భూమి మొత్తం చుట్టేసి రావడం అంటే మాములు విషయం కాదు. ఈ హైపర్ సోనిక్ క్షిపణి అమెరికా మీద నుంచి కూడా ప్రయాణం చేసి ఉండవచ్చు.…
ఇండియా చైనా దేశాల మధ్య 13 వ విడత చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. భారత్ ప్రతిపాదించిన ప్రతిపాదనలను చైనా తోసిపుచ్చింది. ఇక ఇదిలా ఉంటే చైనా మరో కొత్త కుట్రకు తెరలేపింది. భూటాన్ దేశంతో ఉన్న సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు ముడు ప్రతిపాదనలు చేసింది. ఈ మూడు ప్రతి పాదనలకు భూటాన్ అంగీకారం తెలపడం భారత్కు ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పవచ్చు. గత 37 ఏళ్లుగా భూటాన్, చైనా…
భారత్, పాకిస్థాన్ అనేవి చిరాకు ప్రత్యర్ధులు ఎం విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ నెలలో యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో ఈ రేంజు జట్లు పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో వచ్చిన యాడ్ అలరిస్తోంది. ఈ నెల 24న రెండు జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ జరగనుంది. చాలా కాలం తర్వాత ఇరుదేశాలు తలపడుతున్న సమయంలో బయ్ వన్, బ్రేక్ వన్ అంటూ వచ్చిన యాడ్ కు భారత…
భారత్లో మరోసారి కరోనా పాజిటివ్ రోజువారి కేసులు పెరిగాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 14,146 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 144 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇక, ఇదే సమయంలో 19,788 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కొలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది కేంద్రం.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,40,67,719 కు పెరగగా.. రికవరీ కేసులు 3,34,19,749కు…
వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను భారతదేశంలో జరుపగలుతామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే నిన్న ఐపీఎల్ 2021 లో విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గంగూలీ టైటిల్ ను అందించాడు. అయితే ఈ ఏడాది ఇండియాలో ప్రారంభమైన ఐపీఎల్ 2021 కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పది యూఏఈ లో జరిగింది. కానీ వచ్చే ఏడాది ఐపీఎల్ 2022 ను భారత్ లోనే జరపాలని…
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది.. కొన్ని దేశాలు కోలుకోలేని స్థాయిలో దెబ్బతిన్నాయి… అయితే, భారత్పై ప్రశంసలు కురిపించింది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్).. కరోనా సమయంలో భారత ప్రభుత్వం వేగంగా, చెప్పుకోదగ్గ రీతిలో స్పందించిందని పేర్కొంది ఐఎంఎఫ్.. కోవిడ్ సమయంలో సైతం కార్మిక సంస్కరణలు, ప్రైవేటీకరణను కొనసాగించిందని తెలిపింది.. కానీ, ఆర్థిక పరిస్థితులు ఇంకా అస్పష్టంగానే ఉన్నాయి.. అయితే, ఊహించిన దాని కంటే వేగంగా కోలుకునే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు.. పెట్టుబడులు,…
పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు కొనసాగుతూనే ఉంది.. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ఇప్పటికే రూ.105ను క్రాస్ చేయగా.. డీజిల్ ధర రూ.94ను దాటేసింది… చమురు సంస్థలు ఇవాళ మరోసారి పెట్రో ధరలను పెంచాయి.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్పై 35 పైసలు పెరగగా.. డీజిల్ ధర కూడా 35 పైజలు పెరిగింది.. దీంతో హస్తినలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.49కు చేరగా.. డీజిల్ ధర రూ. 94.22కు ఎగిసింది.. ఇక, ముంబైలో లీటర్…
భారత్లో రోజువారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది… ఇక, యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తున్నాయి.. అయితే, శుక్రవారం దసరా పండగ కావడంతో.. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య కూడా తగ్గిపోయింది.. అది కూడా కేసుల సంఖ్య తగ్గడానికి కారణంగా చెప్పవచ్చు.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశ్యాప్తంగా 9,23,003 శాంపిల్స్ పరీక్షించగా.. 15,981 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. మరో 116 మంది…
భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. రెండు దేశాల్లోని ప్రజలంతా టీవీలకు అతుక్కుపోతారు. ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్లలో ఇండియాను పాక్ ఓడించలేకపోయింది. అయితే, ఈసారి జరిగే టి 20 వరల్డ్ కప్ మ్యాచ్లో ఎలాగైనా చరిత్రను తిరగరాయాలని అనుకుంటోంది. ఈనెల 24 వ తేదీన ఇండియా పాక్ మధ్య టీ 20 మ్యాచ్ జరుగుతంది. ఈ మ్యాచ్పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ మెగా…
ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో 16,862 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,40,37,592కి చేరింది. ఇందులో 3,33,82,100 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 2,03,678 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 379 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైనమొత్తం కరోనా మరణాల సంఖ్య 4,51,814కి చేరింది. ఇక ఉదిలా ఉంటే, గడిచిన…