భారత్పై ఐఎంఫ్ ప్రశంసలు.. కరోనాపై స్పందన భేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది.. కొన్ని దేశాలు కోలుకోలేని స్థాయిలో దెబ్బతిన్నాయి… అయితే, భారత్పై ప్రశంసలు కురిపించింది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్).. కరోనా సమయంలో భారత ప్రభుత్వం వేగంగా, చెప్పుకోదగ్గ రీతిలో స్పందించిందని పేర్కొంది ఐఎంఎఫ్.. కోవిడ్ సమయంలో సైతం కార్మిక సంస్కరణలు, ప్రైవేటీకరణను కొనసాగించిందని తెలిపింది.. కానీ, ఆర్థిక పరిస్థితులు ఇంకా అస్పష్టంగానే ఉన్నాయి.. అయితే, ఊహించిన దాని కంటే వేగంగా కోలుకునే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు.. పెట్టుబడులు, ఇతర వృద్ధి కారకాలపై కోవిడ్-19 ప్రతికూల ప్రభావం నిలకడగా కొనసాగుతోందని.. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం మరింత ఆలస్యం కావచ్చునని తెలిపింది.
కరోనా మహమ్మారి పరిస్థితులను భారత ప్రభుత్వం ధీటుగా, వేగంగా ఎదుర్కొందని ప్రశంసించింది ఐఎంఎఫ్.. ప్రజలకు ఆర్థిక మద్దతును అందజేసిందని, బలహీన వర్గాలకు సాయం చేసిందని, ద్రవ్య విధానాన్ని సులభతరం చేసిందని పేర్కొంది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ… లిక్విడిటీ ప్రావిజన్ను పెంచిందని, నియంత్రణ విధానాలను పటిష్టపరిచిందని తెలిపింది.. కరోనా మహమ్మారిపై భారత అధికారుల ప్రతిస్పందనను ఐఎంఎఫ్ డైరెక్టర్లు ప్రశంసించారు. ఆర్టికల్ IV కన్సల్టేషన్స్ అని పిలవబడే నివేదికలో ఐఎంఎఫ్ ఈ విషయాలను వెల్లడించింది.. అయితే, కోవిడ్ -19 మహమ్మారి నుండి వచ్చే ప్రమాదాల గురించి హెచ్చరించింది, ముఖ్యంగా ప్రజల అభివృద్ధిపై హానికరమైన ప్రభావం చూపుతుందని పేర్కొంది. మహమ్మారికి సంబంధించిన అనిశ్చితులు కారణంగా.. భారీ నష్టాలు ఏర్పడుతున్నాయి. పెట్టుబడి, మానవ వనరులు, మూలధనం, ఇతర వృద్ధి డ్రైవర్లపై కోవిడ్ -19 యొక్క నిరంతర ప్రతికూల ప్రభావం ఉందని… వృద్ధిని ప్రభావితం చేస్తుందని తెలిపింది.
Also Read
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
ఇక, ఆరోగ్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి సమీప కాల పాలసీ ప్రాధాన్యత ఉందని డైరెక్టర్లు అంగీకరించారు. ఆ సందర్భంలో, ఇటీవల వ్యాక్సినేషన్ పెరుగుదలను స్వాగతించారు.. మహమ్మారికి ముందు దశాబ్దంలో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటి, మిలియన్ల మందిని పేదరికం నుండి బయటపడేసిందని పేర్కొంది.. కోవిడ్ -19 షాక్కు ముందు ఆర్థిక వ్యవస్థ మోడరేట్ చేస్తున్నప్పుడు, మహమ్మారి అపూర్వమైన సవాళ్లను సూచిస్తుందని తెలిపింది. కోవిడ్ -19 సెకండ్ వేవ్.. ఆరోగ్యం మరియు ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యాయి, అయితే, ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటుందని విరించింది. 2020-21లో మునుపెన్నడూ లేని విధంగా 7.3 శాతం సంకోచించింది. రెండవ వేవ్ మరో పదునైన ఫలితాన్ని ఇచ్చిందని.. దేశ ఆర్థిక వ్యవస్థ 2021-22 ఆర్థిక సంవత్సరంలో 9.5 శాతం వృద్ధి చెందుతుందని.. 2022-23లో 8.5 శాతం వృద్ధి సాధిస్తోందని అంచనా వేసింది ఐఎంఎఫ్.
తాజావార్తలు
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!