భారత్పై ఐఎంఫ్ ప్రశంసలు.. కరోనాపై స్పందన భేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది.. కొన్ని దేశాలు కోలుకోలేని స్థాయిలో దెబ్బతిన్నాయి… అయితే, భారత్పై ప్రశంసలు కురిపించింది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్).. కరోనా సమయంలో భారత ప్రభుత్వం వేగంగా, చెప్పుకోదగ్గ రీతిలో స్పందించిందని పేర్కొంది ఐఎంఎఫ్.. కోవిడ్ సమయంలో సైతం కార్మిక సంస్కరణలు, ప్రైవేటీకరణను కొనసాగించిందని తెలిపింది.. కానీ, ఆర్థిక పరిస్థితులు ఇంకా అస్పష్టంగానే ఉన్నాయి.. అయితే, ఊహించిన దాని కంటే వేగంగా కోలుకునే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు.. పెట్టుబడులు, ఇతర వృద్ధి కారకాలపై కోవిడ్-19 ప్రతికూల ప్రభావం నిలకడగా కొనసాగుతోందని.. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం మరింత ఆలస్యం కావచ్చునని తెలిపింది.
కరోనా మహమ్మారి పరిస్థితులను భారత ప్రభుత్వం ధీటుగా, వేగంగా ఎదుర్కొందని ప్రశంసించింది ఐఎంఎఫ్.. ప్రజలకు ఆర్థిక మద్దతును అందజేసిందని, బలహీన వర్గాలకు సాయం చేసిందని, ద్రవ్య విధానాన్ని సులభతరం చేసిందని పేర్కొంది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ… లిక్విడిటీ ప్రావిజన్ను పెంచిందని, నియంత్రణ విధానాలను పటిష్టపరిచిందని తెలిపింది.. కరోనా మహమ్మారిపై భారత అధికారుల ప్రతిస్పందనను ఐఎంఎఫ్ డైరెక్టర్లు ప్రశంసించారు. ఆర్టికల్ IV కన్సల్టేషన్స్ అని పిలవబడే నివేదికలో ఐఎంఎఫ్ ఈ విషయాలను వెల్లడించింది.. అయితే, కోవిడ్ -19 మహమ్మారి నుండి వచ్చే ప్రమాదాల గురించి హెచ్చరించింది, ముఖ్యంగా ప్రజల అభివృద్ధిపై హానికరమైన ప్రభావం చూపుతుందని పేర్కొంది. మహమ్మారికి సంబంధించిన అనిశ్చితులు కారణంగా.. భారీ నష్టాలు ఏర్పడుతున్నాయి. పెట్టుబడి, మానవ వనరులు, మూలధనం, ఇతర వృద్ధి డ్రైవర్లపై కోవిడ్ -19 యొక్క నిరంతర ప్రతికూల ప్రభావం ఉందని… వృద్ధిని ప్రభావితం చేస్తుందని తెలిపింది.
Also Read
- Hantavirus: హంటావైరస్పై ఆందోళన.. వ్యాక్సిన్ లేదు.. మరి చికిత్స ఎలా..?
- Russia: ప్రపంచానికి షాక్ ఇచ్చిన పుతిన్ 'అణు' బాంబ్.. 'సర్మాట్' క్షిపణితో సర్ప్రైజ్!
- Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
- Iran Nuclear Warning: అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. 'మాపై చేయి వేస్తే.. అణు విలయమే!'
ఇక, ఆరోగ్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి సమీప కాల పాలసీ ప్రాధాన్యత ఉందని డైరెక్టర్లు అంగీకరించారు. ఆ సందర్భంలో, ఇటీవల వ్యాక్సినేషన్ పెరుగుదలను స్వాగతించారు.. మహమ్మారికి ముందు దశాబ్దంలో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటి, మిలియన్ల మందిని పేదరికం నుండి బయటపడేసిందని పేర్కొంది.. కోవిడ్ -19 షాక్కు ముందు ఆర్థిక వ్యవస్థ మోడరేట్ చేస్తున్నప్పుడు, మహమ్మారి అపూర్వమైన సవాళ్లను సూచిస్తుందని తెలిపింది. కోవిడ్ -19 సెకండ్ వేవ్.. ఆరోగ్యం మరియు ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యాయి, అయితే, ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటుందని విరించింది. 2020-21లో మునుపెన్నడూ లేని విధంగా 7.3 శాతం సంకోచించింది. రెండవ వేవ్ మరో పదునైన ఫలితాన్ని ఇచ్చిందని.. దేశ ఆర్థిక వ్యవస్థ 2021-22 ఆర్థిక సంవత్సరంలో 9.5 శాతం వృద్ధి చెందుతుందని.. 2022-23లో 8.5 శాతం వృద్ధి సాధిస్తోందని అంచనా వేసింది ఐఎంఎఫ్.
తాజావార్తలు
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
iBomma : ఐబొమ్మ మళ్లీ యాక్టివ్.. కొత్త సినిమాలతో సడెన్ ఎంట్రీ!
-
Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
-
Jailer 2: ‘జైలర్ 2’ ఇప్పట్లో రానట్టేనా?
-
RCB vs KKR: మాపై కోహ్లీ దూకుడుగా ఆడాలని కోరుకుంటున్నా.. కేకేఆర్ కోచ్ వాట్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!