ఇప్పుడంటే ఎన్నో ఛానళ్లు ఉన్నాయి. ప్రతిరోజూ 24 గంటలపాటు ప్రసారాలు ప్రసారమౌతూనే ఉన్నాయి. మనదేశంలో తొలిసారిగా టీవీ ప్రసారాలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయో తెలుసా.. అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. మనకు స్వాతంత్య్రం రాకముందు నుంచే రేడియో ప్రసారాలు అందుబాటులో ఉండేవి. రేడియో ద్వారానే చాలా వరకు విషయాలు తెసుకునేవారు. 1959 నుంచి దేశంలో టీవీ ప్రసారాలు ప్రారంభం అయ్యాయి. అప్పట్లో టీవీ మాధ్యమం రేడియోతో కలిసి ఉండేది. 1965 వ సంవత్సరంలో దూరదర్శన్ను ఏర్పాటు చేశారు.…
ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూ…తగ్గుతూ వస్తున్నాయి. నిన్న పెరిగిన కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 12,830 మంది కోవిడ్బారిన పడ్డారు.. మరో 446 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 14,667 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది. దీంతో.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,42,73,300 కు…
కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్న వారికి…వైరస్ సోకుతోంది. రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నాం కదా.. ఇక నిశ్చితంగా ఉండొచ్చన్న భావన వీడాలని నిపుణులు సూచిస్తున్నారు. సింగపూర్లో 84 శాతం ప్రజలు రెండు డోసులు తీసుకున్నప్పటికీ…రోజు రోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయ్. ఇందులో 14శాతం మంది బూస్టర్ టీకాలు కూడా వేయించుకున్నారు. ఊహించని విధంగా కేసులు నమోదవుతుండటంతో…ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్తగా నాలుగువేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 16 మంది కొవిడ్తో మృత్యువాత పడ్డారు. చనిపోయినవాళ్లలో 44…
సూపర్ సండేకు టీమిండియా రెడీ అయ్యింది. సాయంత్రం న్యూజిలాండ్తో తలపడనుంది. తొలి మ్యాచ్లో విఫలమైన కోహ్లీసేన… ఈసారి సత్తాచాటాలనే పట్టుదలతో ఉంది. టీ20 వరల్డ్కప్లో పాకిస్థాన్ చేతిలో ఓడిన టీమిండియా, న్యూజిలాండ్..ఇవాళ తలపడనున్నాయి. ఈ గ్రూప్ నుంచి సెమీస్కు చేరాలంటే.. ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఒక రకంగా చెప్పాలంటే..ఇది డూ ఆర్ డై లాంటిది. ఈ మ్యాచ్లో గెలిచిన టీమ్.. దాదాపు సెమీస్ చేరే అవకాశం ఉంటుంది. తొలి మ్యాచ్లోని తప్పులను…
భారత ప్రధాని మోదీ ఇటలీ పర్యటనలో ఉన్నారు. రోమ్లో జరిగే 16వ జీ20 దేశాల సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఇటలీ వెళ్లారు. ఈ సందర్భంగా వాటికన్ సిటీలోనూ మోదీ పర్యటించారు. అక్కడ పోప్ ఫ్రాన్సిస్తో మోదీ సమావేశమయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఈ సమావేశం 20 నిమిషాల పాటు కొనసాగాల్సి ఉన్నా.. గంట పాటు కొనసాగిందని పీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో వాతావరణ మార్పులు, కాలుష్యంపై పోరాటం, దారిద్ర్య నిర్మూలన వంటి అనేక అంశాల గురించి చర్చకు…
టీ20 ప్రపంచకప్ రంజుగా సాగుతోంది. గ్రూప్-1లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు విజయాలతో దూసుకెళ్తున్నాయి. గ్రూప్ ఆఫ్ డెత్గా భావించిన గ్రూప్-1లో సెమీస్కు చేరే జట్లపై స్పష్టత వస్తున్నప్పటికీ గ్రూప్-2లోని జట్ల పరిస్థితి అయోమయంగా మారింది. దీనికి భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కారణంగా కనిపిస్తోంది. భారత్ ఈ మ్యాచ్లో పరాజయం కావడంతో సమీకరణాలు సంక్లిష్టంగా మారాయి. ఇప్పటికే వరుసగా మూడు విజయాలతో పాకిస్థాన్ జట్టు సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. పటిష్టమైన భారత్, న్యూజిలాండ్ జట్లపై గెలిచిన పాకిస్థాన్…
పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు ఇప్పట్లో బ్రేక్ పడే దాఖలాలు కనిపించడం లేదు. వరుసగా నాలుగో రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఎలా ఉన్నా… దేశీయ మార్కెట్లో మాత్రం పరుగులు పెడుతున్నాయి. రోజూవారీ ధరల పెంపు కారణంగా పెట్రోల్ ధరలు అడ్డూ, అదుపు లేకుండా పెరిగి సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. శనివారం పెట్రోల్ ధర 36 పైసలు పెరగడంతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.113.36కి చేరింది. అటు…
కరోనా మహమ్మారి ప్రభావం అంతర్జాతీయ ప్రయాణలపై తీవ్ర ప్రభావాన్నే చూపాయి.. కరోనా ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోవడంతో.. అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలపై నిషేధాన్ని భారత్ మరోమారు పొడిగించింది. నవంబర్ 30వ తేదీ వరకు నిషేధాన్ని పొడిగించినట్టు… డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. అయితే, ఈ నిషేధం అంతర్జాతీయ కార్గో విమానాలు, డీజీసీఏ ఆమోదించిన ప్రత్యేక విమానాలకు వర్తించదని తెలిపింది. కరోనా మహమ్మారితో అంతర్జాతీయ విమానాలపై నిషేధం కొనసాగుతోంది. గతంలో ఈ నిషేధాన్ని ఈ నెల…
మన దేశంలో ఇవాళ కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 14,313 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 549 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఇదే సమయలో 13,543 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,61,555 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. మరోవైపు.. రికవరీ కేసుల…
మొన్న లద్దాక్..నేడు తవాంగ్ ప్రాంతాల్లో చైనా సైన్యాన్ని మోహరిస్తుంది. దీంతో చైనా దూకుడుకు చెక్ పెట్టేందుకు చైనా సరిహద్దుల్లో భారీ బందోబస్త్ను భారత్ ఏర్పాటు చేస్తోంది. గత ఏడాది కాలంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో భారత్ భూటాన్, టిబెట్లకు ఆనుకుని ఉన్న తవాంగ్ ప్రాంతం పై చైనా కన్ను పడింది. ఎలాగైనా ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని దురుద్దేశపూర్వకంగా అక్కడి ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరిస్తుంది. దీంతో చైనాకు ధీటుగా జవాబు చెప్పేందుకు అమెరికా తయారు చేసినా…