ఇండియాలో నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 10,126 కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో 3,37, 75 , 086 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,40,638 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 332 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో…
భారత టీ-20 కెప్టెన్గా విరాట్ కోహ్లీ కథ ముగిసింది. ఎన్నో విజయాలు, మరెన్నో సిరీస్లు భారత్కు అందించి అత్యుత్తమ నాయకుడిగా పేరు తెచ్చుకున్న కోహ్లీ.. తన చిరకాల కోరికైన టీ-20 వరల్డ్ కప్ సాధించకుండానే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. నిన్న నమీబియాతో జరిగిన మ్యాచ్ అనంతరం పొట్టి ఫార్మాట్ సారథ్యానికి గుడ్బై చెప్పాడు. ఈ సమయంలో ఒకింత భావోద్వేగానికి గురయ్యాడు కోహ్లీ. ఏదో సాధించలేకపోయామన్న బాధ, నిర్వేదంలో విరాట్లో కనిపించింది. బ్యాట్స్మన్గా సూపర్ సక్సెస్ అందుకున్న కోహ్లి…
టీ20 ప్రపంచకప్ను టీమిండియా విజయంతో ముగించింది. తొలి రెండు మ్యాచ్లలో ఓడిపోయిన భారత్.. హ్యాట్రిక్ విజయాలతో టోర్నీకి వీడ్కోలు పలికింది. సారథిగా విరాట్ కోహ్లీకి ప్రపంచకప్ అందించలేకపోయిన ఆటగాళ్లు.. కెప్టెన్గా అతడి ఆఖరి మ్యాచ్లో మాత్రం గెలిచి విజయాన్ని కానుకగా అందించారు. నమీబియాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. Read Also: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అదిరే రికార్డు ఈ మ్యాచ్లో కోహ్లీ సేన టాస్ గెలిచి…
ప్రపంచ వాతావరణంలో మార్పులు వేగంగా మారిపోతున్నాయి. పర్యావరణానికి హాని కలిగించే ఉద్గారాలు ఇబ్బడిముబ్బడిగా వాతావరణంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో వేడి పెరిగిపోయింది. ఈ వేడి కారణంగా దృవాల వద్ద మంచు భారీగా కరిగిపోతున్నది. ఫలితంగా నదుల్లో, సముద్రాల్లో నీటిమట్టం పెరిగిపోతున్నది. నీటిమట్టం పెరగడం వలన తీర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఇబ్బందులు ఎదర్కొననున్నాయి. 2030 నాటికి సముద్రాల్లోని నీటిమట్టం భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీటి మట్టం పెరిగితే అనేక నరగాలు…
పాకిస్తాన్ను ఎన్ని సార్లు హెచ్చరించినా తన బుద్ధి మాత్రం మార్చుకోవడం లేదు. మత్స్యకారులపై కాల్పులు జరపొద్దని నిబంధనలు ఉన్న వాటిని పాకిస్తాన్ బేఖాతరు చేస్తుంది. భారత్కు చెందిన చేపల వేట పడవ ‘జల్పరి’ పై పాకిస్థాన్ కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన గుజరాత్లోని ద్వారక వద్ద ఆదివారం ఉదయం జరిగింది. చనిపోయిన మత్స్యకారుడి పేరు శ్రీధర్గా గుర్తించారు. మరో వ్యక్తి కూడా ఈ కాల్పు ల్లో గాయపడ్డారు. పలువురు…
ఇండియా చైనా బోర్డర్లో చైనా రడగ సృష్టిస్తూనే ఉన్నది. సరిహద్దు ప్రాంతాల్లో నిత్యం వివాదాలు చేస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. ప్రశాంతంగా ఉన్న సరిహద్దుప్రాంతాల్లో కూడా చైనా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అరుణాచల్ సరిహద్దుల్లో ఇప్పటికే వంద ఇళ్లతో ఓ గ్రామాన్ని ఏర్పాటు చేసింది. అక్కడికి చేరుకునేందుకు అధునాత రోడ్డు, ఎలక్ట్రిసిటీ సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. చైనా చేస్తున్న పనులను నిశితంగా గమనిస్తున్నామని ఇండియన్ ఆర్మీ అధికారులు చెబుతున్నారు. Read: ఇలా చేస్తే… ఇంటర్నెట్…
ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ప్రస్తుత భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ బాధ్యతల నుండి తప్పుకొనున విషయం తెలిసిందే. దాంతో అతని తర్వాత జట్టుకు ఎవరిని కెప్టెన్ చేయాలి అనే ప్రశ్న పై చాలా పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఎక్కువగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇక తాజాగా భారత మాజీ పేవర్ ఆశిష్ నెహ్రా స్పందిస్తూ ఓ కొత్త పేరును ముందుకు…
మన దేశంలో నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 10,853 కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో 3,37,49, 900 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,44,845 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 260 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో 4,…
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు భారంగా మారాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించగా.. పలు రాష్ట్రాలు వ్యాట్ ట్యాక్స్ తగ్గించాయి. ఈ మేరకు పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త దిగివచ్చాయి. అయితే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే డీజిల్ ధర అధికంగా ఉంది. హైదరాబాద్లో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంటే.. ఏపీలోని విజయవాడలో లీటర్ డీజిల్ ధర రూ.96.25గా ఉంది. దేశవ్యాప్తంగా డీజిల్ ధరలలో ఇదే అత్యధికం. Read Also:…
నేడు ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగంతో ప్రారంభమయ్యే బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంతో ముగియనుంది. పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. కోవిడ్19 నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఈ సమావేశానికి జాతీయ కార్యవర్గ సభ్యులందరినీ ఢిల్లీకి ఆహ్వానించలేదు.…