భారత్-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయంటే ప్రతి క్రికెట్ అభిమాని టీవీకి అతుక్కుపోవాల్సిందే. ఈ నేపథ్యంలో దాదాపు రెండేళ్ల తర్వాత దాయాది జట్లు సమరానికి దిగాయి. దీంతో టీ20 ప్రపంచకప్లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సరికొత్త రికార్డు సృష్టించింది. అక్టోబర్ 24న జరిగిన ఈ మ్యాచ్ను ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల 70 లక్షల మంది వీక్షించారట. ఈ విషయాన్ని స్వయంగా ఈ మ్యాచ్ ప్రసారం చేసిన స్టార్ నెట్వర్క్ తెలియజేసింది.
Read Also: కెప్టెన్గా రోహిత్ శర్మ గత రికార్డులు
అంతర్జాతీయ టీ 20 మ్యాచ్లకు సంబంధించి అత్యధిక వ్యూస్ వచ్చిన మ్యాచ్ ఇదేనని స్టార్ ఇండియా వెల్లడించింది. 2016 ప్రపంచకప్లో సెమీఫైనల్ సందర్భంగా జరిగిన భారత్-వెస్టిండీస్ మ్యాచ్ను 13.6 కోట్ల మంది వీక్షించగా… ఇప్పటివరకు అదే రికార్డుగా కొనసాగుతోంది. ఇప్పుడు ఈ మ్యాచ్ రికార్డును భారత్-పాకిస్థాన్ మ్యాచ్ బద్దలు కొట్టింది. కాగా ఇప్పటివరకు ప్రస్తుత ప్రపంచకప్లో లీగ్ మ్యాచ్ల వరకు అన్ని మ్యాచ్లను కలిపి 23 కోట్ల 80 లక్షల మంది వీక్షించినట్లు స్టార్ ఇండియా స్పష్టం చేసింది.