దొంగిలించిన విగ్రహం వందేళ్ల తర్వాత భారత్కు.. యూపీకి అప్పగించిన కిషన్రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వందేళ్ల క్రితం దొగిలించబడిన అన్నపూర్ణ దేవి విగ్రహం తిరిగి భారత్కు రప్పించింది కేంద్ర ప్రభుత్వం.. 18వ శతాబ్దానికి చెందిన అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించారు. వదేళ్ల క్రితం చోరీకి గురైన ఈ విగ్రహాన్ని కెనడాలో గుర్తించారు. కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన కేంద్రం.. చివరకు అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని వెనక్కి తీసుకువచ్చింది. ఇక, మాత అన్నపూర్ణా దేవి యాత్ర పేరుతో 4 రోజులపాటు విగ్రహంతో శోభాయాత్ర నిర్వహించనున్నారు.. ఈనెల 15న కాశీ విశ్వేశ్వర ఆలయంలో అన్నపూర్ణా దేవి విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. యూపీ సీఎం యోగి చేతుల మీదుగా ఈ విగ్రహం పునఃప్రతిష్ట చేయనున్నారు..
Read Also: చిత్తూరు, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
- UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
ఇక, 100 ఏళ్ల క్రితం దొగిలించబడిన అన్నపూర్ణ దేవి విగ్రహం తిరిగి యూపీ ప్రభుత్వానికి అందించడం సంతోషంగా ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. కెనడా ప్రభుత్వంతో అనేక సంవత్సరాలు సంప్రదింపులు జరిపి అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని వెనక్కి తీసుకొచ్చామని వెల్లడించారు.. మరికొద్ది రోజుల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలకు సైతం విదేశాల్లో ఉన్న విగ్రహాలు అందజేయనున్నట్టు తెలిపారు.. భారత సాంస్కృతికి చెందిన విగ్రహాలు వివిధ దేశాల్లో ఉన్నాయన్న కిషన్రెడ్డి.. సాధు, సంతుల దీవెనలతో, విదేశాల్లోని విగ్రహాలు, చిహ్నాలు, చిత్రపటాలు ప్రధాని నరేంద్ర మోడీ వెనక్కి తీసుకువస్తున్నారని పేర్కొన్నారు.. విదేశాల్లోని విగ్రహాలు వెనక్కి తీసుకువచ్చిన ప్రధాని మోడీకి దేశ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు కిషన్రెడ్డి.. వారణాసి “సిటీ అప్ టెంపుల్స్”… మాతా అన్నపూర్ణ దేవి విగ్రహాన్నీ వెనక్కి తీసుకురావడం పట్ల యూపీ ప్రజలు సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా వెల్లడించారు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!