Hardeep Singh Nijjar: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తలకు దారి తీసింది. కెనడాలోని సర్రేలో జూన్ నెలలో నిజ్జర్ ని గుర్తు తెలియని వ్యక్తుల కాల్చి చంపారు. అయితే ఈ హత్యలో భారత ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం, భారత్ దౌత్యవేత్తను కెనడా బహిష్కరించడం ఒక్కసారిగా సమస్య తీవ్రతను పెంచింది. ఇటు భారత్ కూడా కెనడియన్ దౌత్యవేత్తను ఇండియా వదిలి వెళ్లాలని ఆదేశించింది.
నేడు నూతన కోర్టు భవనాలు ఆరంభం కానున్నాయి. ముఖ్య అతిథిగా హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ధరజ్ సింగ్ పాల్గొననున్నారు. పలువురు న్యాయమూర్తులు కూడా పాల్గొననున్నారు. నేడు విశాఖలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ పర్యటించనున్నారు. పోర్ట్ సాగరమాల కన్వెన్షన్ సెంటర్లో సమవావేశాని హాజరుకానున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాలలో నేడు ఏడోవ రోజు. ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై భక్తులకు మలయప్పస్వామి దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై భక్తులుకు స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. మంగళవారంతో ముగియనున్న…
మూడు వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయిన ఆస్ట్రేలియా జట్టు.. ప్రధాన మార్పులతో రెండో వన్డే ఆడనుంది. రేపు (ఆదివారం) ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది.
India At UN: దాయాది పాకిస్తాన్ ప్రధాని అన్వరుల్ కాకర్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత్పై ఆరోపణలు చేశారు. మరోసారి పాకిస్తాన్ యూఎన్ లో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. దీనికి ప్రతిగా భారత్ ఘాటుగా రిప్లై ఇచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను ఖాళీ చేయాలని, ఉగ్రవాదాన్ని ఆపాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, ఈ అంశంపై వ్యాఖ్యానించేందుకు ఎలాంటి అధికారం లేదని పేర్కొంది.
మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై భారత్ గెలుపొందింది. 277 టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా.. చివరకు ఆడి గెలిపించారు.
ICC T20 ప్రపంచ కప్ 2024 జూన్ 4న ప్రారంభంకానుంది. ఈ టోర్నీ టైటిల్ మ్యాచ్ జూన్ 20న జరగనుంది. ICC T20 ప్రపంచ కప్ 2024 మ్యాచ్లు అమెరికాలోని ఫ్లోరిడా, డల్లాస్, న్యూయార్క్లలో జరుగనున్నాయి. తొలిసారిగా అమెరికా ఐసీసీ టీ20 ప్రపంచకప్ను నిర్వహిస్తోంది.
రేపటి నుంచి చైనాలోని జాంఘులో జరగనున్న 19వ ఆసియా క్రీడల్లో అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ముగ్గురు ఆటగాళ్లకు అనుమతి చైనా అనుమతి నిరాకరించింది. ఈ చర్యపై భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని చైనా ఎంబసీ, బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం ద్వారా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు భారత కేంద్ర క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు.
Vivek Ramaswamy: చైనా గుత్తాధిపత్యం, సైనిక దూకుడు, విస్తరణవాదాన్ని అడ్డుకోవాలంటే భారతదేశం మాత్రమే సరైందని అమెరికాతో పాటు అన్ని యూరోపియన్ దేశాలు, జపాన్, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా దేశాలు భావిస్తున్నాయి. దీంతో భారతదేశంతో చైనా వ్యతిరేక దేశాలు సఖ్యతతో వ్యవహరిస్తున్నాయి. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ నేత, ఇండో-అమెరికన్ వివేక్ రామస్వామి కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు.
Justin Trudeau: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రమేయం ఉందని వ్యాఖ్యలు చేస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇంటా, బయట వ్యతిరేకత ఎదురుకొంటున్నారు. భారత్ని కాదని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి కెనడా మిత్రదేశాలు వ్యవహరించే పరిస్థితి లేకపోవడంతో కెనడా ప్రభుత్వానికి చుక్కెదురు అవుతోంది. ఇదిలా ఉంటే కెనడాలో జస్టిన్ ట్రూడో తన ప్రజాధరణ కోల్పోతున్నారని తాజాగా ఓ సర్వేలో తేలింది.