World Cup 2023: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం స్టేడియంకు వెళ్లాలనుకుంటున్నారా.. ముందు వెనక చూస్కోండి..!
World Cup 2023: అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఎల్లుండి భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ చూసేందుకు అహ్మదాబాద్ వెళ్తున్నారా? అయితే… జాగ్రత్త. మీరు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ని స్టేడియంలో వీక్షించాలంటే ఐఫోన్ కొన్న దానికంటే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పండగే. ఈ కారణం చేత విమాన టిక్కెట్లు, హోటళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అహ్మదాబాద్లోని హోటల్స్ భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నాయి. కేవలం 2 రాత్రులకు రూ. 43 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
మీరు మ్యాచ్ కోసం ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వెళ్లాలనుకుంటే 10,000 రూపాయల వరకు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఢిల్లీ-అహ్మదాబాద్ల మధ్య సాధారణంగా విమాన ఛార్జీలు రూ.3 వేలు వసూలు చేస్తారు. కానీ ఈ సమయంలో మీ పర్సు ఖాళీ అవ్వడం ఖాయం. అంతేకాకుండా.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా జోరుగా సాగుతోంది. సాధారణ ఛార్జీల కంటే క్రికెట్ అభిమానులు టిక్కెట్ల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. అయినా సరే ఎలాగైనా టిక్కెట్లు దక్కించుకోవాలనే ఆతృతతో ఉన్నారు.
ఇదిలా ఉంటే.. ఇరు జట్లు వరుసగా మూడో విజయంపై కన్నేసాయి. దాయాదులతో వన్డే ప్రపంచకప్ లో పోరు అంటే హైఓల్టేజీ ఉంటుంది. అందుకోసమని ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. చూడాలి మరీ ఎల్లుండి జరిగే మ్యాచ్ లో ఎవరిది పై చేయి అవుతుందో.
తాజావార్తలు
-
MI vs GT : ముంబై ఈజ్ బ్యాక్.. తిలక్ వర్మ మెరుపు శతకం.. గుజరాత్ టైటాన్స్ ఘోర పరాజయం..
-
Off The Record: ఆ జిల్లాలో టీడీపీ వర్సెస్ జనసేన..? ఆ పార్టీ నేతల్ని లైట్ తీసుకుంటున్నారా..?
-
Farmers: ఎట్టి పరిస్థితుల్లో రైతులు పంటలు సాగు చేయొద్దు.. ఆ 4 గ్రామాల ప్రజలకు కలెక్టర్ ఆదేశాలు…
-
Tilak Varma: అరుదైన రికార్డ్ సాధించిన తిలక్ వర్మ.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్..
-
CM Revanth Reddy : కేసీఆర్ పగటి కలలు మానుకోవాలి.. కల్వకుంట్ల కుటుంబానికి ఇక రాజకీయ నూకలు చెల్లినట్టే
ట్రెండింగ్
-
Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
-
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!
-
8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?