IND vs PAK: పాకిస్థాన్ టీమ్లో ఆ ముగ్గురు డేంజర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ లవర్స్ కు పండగే. ఎందుకంటే ఈ జట్లు తలపడుతున్నప్పుడు చూడటమంటే ఆ కిక్కే వేరని అంటున్నారు. ఇప్పటికే రేపు జరగబోయే మ్యాచ్ కోసం అభిమానులు అహ్మదాబాద్ కు చేరుకున్నారు. డబ్బులు ఎంత ఖర్చైనా పర్వాలేదు.. కానీ స్టేడియంలో లైవ్ చూడాల్సిందేనంటూ ఎక్కడెక్కడి నుంచో అక్కడికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. ఇరు జట్లు ఆడిన రెండు మ్యాచ్ ల్లో గెలిచి మంచి ఊపు మీదున్నాయి. ఎలాగైనా ప్రత్యర్థి టీంను ఓడించాలనే కసితో ఇరు జట్లు చూస్తున్నాయి. అయితే పాక్ జట్టులో ఆ ముగ్గురు ఉన్నంత వరకు ప్రమాదకరమని.. వారితో టీమిండియా జాగ్రత్తగా ఉండాలని పలువురు తెలుపుతున్నారు. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరో చూద్దాం.
Read Also: TS DSC Exam: తెలంగాణలో డీఎస్సీ నియామక పరీక్ష వాయిదా
Also Read
- Empty Medicine Packets Reuse: ఖాళీ టాబ్లెట్ స్ట్రిప్స్తో ఎన్నో లాభాలు.. ఈ విషయం తెలిస్తే పొరపాటున కూడా చెత్తబుట్టలో వేయరు..
- Israel: అమెరికా-ఇరాన్ ఒప్పందంతో ఇజ్రాయెల్కు నష్టమే.. రాయబారి రూవెన్ అజార్ కీలక వ్యాఖ్యలు
- Sajjad Nomani: హిందువులు దేశంలో మెజారిటీ కాదు.. మౌలానా వివాదాస్పద వ్యాఖ్యలు..
- Vijayawada: రౌడీషీటర్ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన సెల్ఫీ వీడియో
బాబర్ ఆజం
పాకిస్థాన్ కెప్టెన్, ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో ఒకరు. ఈ ప్రపంచకప్లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్ ల్లో పెద్దగా ఏమీ రాణించలేదు. నెదర్లాండ్స్, శ్రీలంకతో ఆడిన మ్యాచ్ ల్లో పేలవ ప్రదర్శన చూపించినప్పటికీ.. ఇండియాతో మాత్రం చెలరేగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అందుకే బాబర్ ఆజంను ఎంత తొందరగా ఔట్ చేస్తే ఇండియాకు అంత మంచిది. ఈ బ్యాట్స్ మెన్ క్రీజులో ఉన్నంతసేపు ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించగల సత్తా ఉంది.
షాహీన్ షా ఆఫ్రిది
పాకిస్థాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది.. తొలి ఓవర్లోనే వికెట్లు తీయడంలో నిపుణుడు. తొలి ఓవర్లనే వికెట్లు తీసిన సందర్భాలు చాలా ఉన్నాయి. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ షాహీన్కు బౌలింగ్ పట్ల ఆచితూచి ఆడాలి. స్పీడ్తో స్వింగ్ చేయడంలో నిష్ణాతుడైన షాహీన్.. 2023 ఆసియాకప్లో లీగ్ మ్యాచ్లో భారత్పై విధ్వంసం సృష్టించాడు. ఇక రేపు జరగబోయే మ్యాచ్ లో కూడా అద్భుతాలు చేయగలడు.
మహ్మద్ రిజ్వాన్
శ్రీలంకపై 131 పరుగుల అజేయ ఇన్నింగ్స్ని ఆడి పాకిస్థాన్ను చారిత్రాత్మక విజయానికి దారితీసిన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మహ్మద్ రిజ్వాన్.. భారత్పై కూడా రిజ్వాన్ కు మంచిపట్టు ఉంది. రిజ్వాన్ ప్రతి బంతికి పరుగులు చేయడంలో పేరుగాంచాడు. రిజ్వాన్ క్రీజులో ఉన్నంత సేపు బౌలర్లకు కష్టమే. ఇప్పటివరకు ప్రపంచకప్లో జరిగిన రెండు మ్యాచ్ ల్లో రిజ్వాన్.. 199 పరుగులు చేశాడు. అందుకే రిజ్వాన్ కూడా ఎంతతొందర పెవిలియన్ కు పంపితే అంత మంచిదని క్రికెట్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.
తాజావార్తలు
-
Empty Medicine Packets Reuse: ఖాళీ టాబ్లెట్ స్ట్రిప్స్తో ఎన్నో లాభాలు.. ఈ విషయం తెలిస్తే పొరపాటున కూడా చెత్తబుట్టలో వేయరు..
-
Israel: అమెరికా-ఇరాన్ ఒప్పందంతో ఇజ్రాయెల్కు నష్టమే.. రాయబారి రూవెన్ అజార్ కీలక వ్యాఖ్యలు
-
Sajjad Nomani: హిందువులు దేశంలో మెజారిటీ కాదు.. మౌలానా వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Mahendragiri Varahi: మైండ్ బ్లాక్ చేస్తున్న సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’!
-
Vijayawada: రౌడీషీటర్ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన సెల్ఫీ వీడియో
ట్రెండింగ్
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!