IND vs SA Tickets: భారత్- సౌతాఫ్రికా మధ్య మ్యాచ్.. టికెట్ల కోసం ఫ్యాన్స్ తిప్పలు.. రాత్రంతా రోడ్లపైనే!
- భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్..
- డిసెంబర్ 9వ తేదీన కటక్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్..
- బారాబతి స్టేడియం వద్ద ఆఫ్లైన్ టికెట్ల కోసం పెద్ద ఎత్తన ఫ్యాన్స్ క్యూ..
IND vs SA Tickets: భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ డిసెంబర్ 9వ తేదీన కటక్ వేదికగా జరగనుంది. దీంతో ఒడిశా క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ తక్కువ సంఖ్యలో టికెట్లను కౌంటర్లలో విక్రయానికి (ఆఫ్లైన్) పెట్టింది. ఇక, టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. ఇక, టికెట్ కౌంటర్లు తెరుచుకోక ముందే ఉదయం నుంచి స్టేడియం బయట వేల సంఖ్యలో ఫ్యాన్స్ క్యూలైన్లలో వేచి ఉన్నారు. కౌంటర్లు ఓపెన్ కాగానే టికెట్ల కోసం ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Read Also: Rajamouli Avatar 3: సర్ప్రైజ్కు ప్లాన్ చేసిన జక్కన్న.. ‘అవతార్ 3’లో వారణాసి ఆట!
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
- RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
అయితే, ఒడిశా క్రికెట్ అసోసియేషన్ ఎక్కువ సంఖ్యలో టికెట్లను వారి సభ్యులు, వీఐపీలకు కేటాయించి.. తక్కువ టికెట్లను మాత్రమే కౌంటర్లలో విక్రయానికి పెట్టడం వల్లే ఈ సమస్య తలెత్తిందని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. కాగా, టికెట్ల ధరలు రూ.700 నుంచి రూ.20 వేల మధ్య ఉన్నాయి. ఇక, ఈ క్రమంలో ఆఫ్లైన్ టికెట్ల కోసం శుక్రవారం బారాబతి స్టేడియం వద్ద ఉదయం ఆరు గంటలకు టికెట్ల విక్రయం జరగాల్సి ఉండగా.. ముందు రోజు రాత్రి 11. 30 గంటలకే కొంత మంది మైదానం దగ్గరే పడిగాపులు కావడం గమనార్హం.
అలాగే, టికెట్ ధర రూ. 1100 ఉండగా.. దానిని 6 వేల రూపాయలకు అమ్మినట్లు తెలుస్తోంది. ఇంకొన్ని చోట్ల ఏకంగా రూ. 11 వేలకు కూడా టికెట్లను విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇలా ఓవైపు బ్లాక్ మార్కెట్ దందా కొనసాగుతున్నప్పటికీ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పట్టించుకోకపోవడం దారుణం అని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఇక, సఫారీతో టీమిండియా టీ20 మ్యాచ్లు కటక్, ముల్లాన్పుర్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి. ఫిబ్రవరి, మార్చిలో జరిగే టీ20 వరల్డ్ కప్ 2026 సన్నాహకాల్లో భాగంగా ఈ సిరీస్ ఇరు జట్లకు కీలకం కానుంది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!