IND vs SA Tickets: భారత్- సౌతాఫ్రికా మధ్య మ్యాచ్.. టికెట్ల కోసం ఫ్యాన్స్ తిప్పలు.. రాత్రంతా రోడ్లపైనే!
- భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్..
- డిసెంబర్ 9వ తేదీన కటక్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్..
- బారాబతి స్టేడియం వద్ద ఆఫ్లైన్ టికెట్ల కోసం పెద్ద ఎత్తన ఫ్యాన్స్ క్యూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs SA Tickets: భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ డిసెంబర్ 9వ తేదీన కటక్ వేదికగా జరగనుంది. దీంతో ఒడిశా క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ తక్కువ సంఖ్యలో టికెట్లను కౌంటర్లలో విక్రయానికి (ఆఫ్లైన్) పెట్టింది. ఇక, టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. ఇక, టికెట్ కౌంటర్లు తెరుచుకోక ముందే ఉదయం నుంచి స్టేడియం బయట వేల సంఖ్యలో ఫ్యాన్స్ క్యూలైన్లలో వేచి ఉన్నారు. కౌంటర్లు ఓపెన్ కాగానే టికెట్ల కోసం ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Read Also: Rajamouli Avatar 3: సర్ప్రైజ్కు ప్లాన్ చేసిన జక్కన్న.. ‘అవతార్ 3’లో వారణాసి ఆట!
Also Read
- Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
- BCCI Selection Rule: బీసీసీఐ కీలక మార్పు.. ఇకపై 100 కాదు 200 శాతం.. టీమిండియా ఆటగాళ్లకు చుక్కలే!
- Team India Squad: ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
- Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్బై
అయితే, ఒడిశా క్రికెట్ అసోసియేషన్ ఎక్కువ సంఖ్యలో టికెట్లను వారి సభ్యులు, వీఐపీలకు కేటాయించి.. తక్కువ టికెట్లను మాత్రమే కౌంటర్లలో విక్రయానికి పెట్టడం వల్లే ఈ సమస్య తలెత్తిందని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. కాగా, టికెట్ల ధరలు రూ.700 నుంచి రూ.20 వేల మధ్య ఉన్నాయి. ఇక, ఈ క్రమంలో ఆఫ్లైన్ టికెట్ల కోసం శుక్రవారం బారాబతి స్టేడియం వద్ద ఉదయం ఆరు గంటలకు టికెట్ల విక్రయం జరగాల్సి ఉండగా.. ముందు రోజు రాత్రి 11. 30 గంటలకే కొంత మంది మైదానం దగ్గరే పడిగాపులు కావడం గమనార్హం.
అలాగే, టికెట్ ధర రూ. 1100 ఉండగా.. దానిని 6 వేల రూపాయలకు అమ్మినట్లు తెలుస్తోంది. ఇంకొన్ని చోట్ల ఏకంగా రూ. 11 వేలకు కూడా టికెట్లను విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇలా ఓవైపు బ్లాక్ మార్కెట్ దందా కొనసాగుతున్నప్పటికీ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పట్టించుకోకపోవడం దారుణం అని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఇక, సఫారీతో టీమిండియా టీ20 మ్యాచ్లు కటక్, ముల్లాన్పుర్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి. ఫిబ్రవరి, మార్చిలో జరిగే టీ20 వరల్డ్ కప్ 2026 సన్నాహకాల్లో భాగంగా ఈ సిరీస్ ఇరు జట్లకు కీలకం కానుంది.
తాజావార్తలు
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
-
Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్..!
-
YS Jagan: ‘నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను’.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
-
Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
-
BRB First Look: కిచ్చా సుదీప్ బర్త్డేకు అదిరిపోయే ట్రీట్.. మంచు ప్రపంచంలో మాస్ అవతార్!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!