PCB Decision: భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై అనిశ్చితి ఇంకా కుదుటపడలేదు. ఫిబ్రవరి 15న జరగాల్సిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్ను బహిష్కరించాలన్న ప్రతిపాదనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి ఓ సంచలన విషయం బయటకు వచ్చింది. పీసీబీ తన నిర్ణయాన్ని వచ్చే 24 గంటల్లో స్పష్టం చెప్పబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. లాహోర్లో ఐసీసీ పెద్దలతో జరిగిన దీర్ఘ సమావేశం తర్వాత ఈ అంశం మరింత హాట్ టాపిక్గా మారింది. లాహోర్ గద్దాఫీ స్టేడియంలో జరిగిన ఈ సమావేశం ఐదు…
T20 World Cup 2026: ఫిబ్రవరి 15వ తేదీన జరగాల్సిన భారత్- పాకిస్థాన్ టీ20 వరల్డ్కప్ 2026 మ్యాచ్ జరుగుతుందా? అన్న ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం దొరకలేదు. టోర్నమెంట్ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా ప్రారంభమైనప్పటికీ, ఈ మ్యాచ్కు సంబంధించిన ఆఫ్-ఫీల్డ్ డ్రామా మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.
IND vs PAK: భారత్ -పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలు ఇటీవలి కాలంలో తీవ్రంగా దిగజారాయి. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.
Ajinkya Rahane: టీ20 వరల్డ్ కప్ వివాదాలు ఇంకా ముగియడం లేదు. భద్రతా కారణాల వల్ల తాము భారత్లో ఆడమని చెప్పిన బంగ్లాదేశ్, చివరకు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక, బంగ్లాదేశ్కు సంఘీభావంగా మేము కూడా టోర్నీని బహిష్కరించే ఆలోచన చేస్తామని చెప్పిన పాకిస్తాన్, ఇంకా టోర్నీ ఆడుతుందా లేదా అనే క్లారిటీ ఇవ్వలేదు.
Anurag Thakur: ఆసియా కప్ 2025లో భాగంగా సెప్టెంబర్ 14న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. కానీ ఈ మ్యాచ్ను బ్యాన్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ మ్యాచ్పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మాజీ క్రీడా మంత్రి స్పందించారు. క్రికెట్ కౌన్సిల్ (ACC) లేదా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్వహించే టోర్నమెంట్లలో ఇటువంటి మ్యాచ్లను ఆపలేమని మాజీ క్రీడా మంత్రి, ప్రస్తుత…
IIT Baba: మహా కుంభమేళాలో అందరి దృష్టిని ఆకర్షించిన ‘‘ఐఐటీ బాబా’’ గురించి అందరికి తెలిసిందే. అభయ్ సింగ్ అనే ఐఐటియన్ బాబాగా మారడంపై మీడియా ప్రత్యేక కథనాలను కూడా ప్రచురించింది. ఇటీవల, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ గెలుస్తుందని జోస్యం చెప్పడంతో మరోసారి ఈ బాబా వైరల్ అయ్యారు. అయితే, ఈ మ్యాచ్లో భారత్ చిరకాల ప్రత్యర్థిని చిత్తుగా ఓడించడంతో, ఐఐటీ బాబాపై ట్రోల్స్ వచ్చాయి.
విరాట్ కోహ్లీపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారులు ప్రశంసల జల్లు కురిపించారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో మాజీ బీసీసీఐ చైర్మన్, మాజీ క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్, బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ ప్రశంసించారు.
Udaynidhi Stalin: సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు పాలైన ఉదయనిధి స్టాలిన్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. శనివారం అహ్మదాబాద్ వేదికగా ఇండియా-పాకిస్తాన్ వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో పాకిస్తాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఔటై వెళ్తున్న క్రమంలో స్టేడియంలోని ప్రేక్షకులు ఒక్కసారిగా ‘జైశ్రీరాం’ నినాదాలు చేశారు. అయితే దీనిపై మాట్లాడిన డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్.. జైశ్రీరాం నినాదాలను ఖండించారు.