IND vs PAK: పాక్తో మ్యాచ్కి ముందు టీమిండియాకు బిగ్ షాక్..
- పాక్తో మ్యాచ్కి ముందు టీమిండియాకు బిగ్ షాక్..
- ఒమన్తో జరిగిన మ్యాచ్ లో గాయపడిన అక్షర్ పటేల్..
- అక్షర్ స్థానంలో తుది జట్టులోకి ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK: ఆసియా కప్ లో రేపు పాకిస్తాన్ తో మ్యాచ్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. భారత స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ తలకు గాయమైంది. ఒమన్తో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తుండగా తల నేలకు గట్టిగా తాకడంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడు మైదానం వీడాడు. ఆ తర్వాత సబ్స్టిట్యూట్గా స్టేడియంలోకి రింకు సింగ్ వచ్చాడు. దీంతో అక్షర్ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే, సూపర్- 4 ముందు స్పిన్ ఆల్రౌండర్కు ఇలా జరిగితే జట్టు తీవ్ర ఇబ్బదులు ఎదుర్కోవల్సి వస్తుందని క్రికెట్ విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. ఇక, అక్షర్కు ఏం కాలేదని టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ తెలిపారు. ప్రస్తుతం బాగానే ఉన్నాడు.. అతడికి స్కానింగ్ చేసే అవకాశం ఉందన్నారు. అందులో ఏ సమస్య లేకపోతే అక్షర్ రేపటి మ్యాచ్ లో ఆడొచ్చు.. లేకపోతే మరొకరిని తుది జట్టులోకి తీసుకుంటామన్నారు.
Read Also: MLC Kavitha: కొత్త పార్టీపై కవిత సంచలన వ్యాఖ్యలు..
Also Read
- India vs Pakistan: ఆసియా కప్లో మరోసారి భారత్-పాక్ పోరు సాధ్యమే.. కానీ, ఓ ట్విస్ట్!
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి భారీ శుభవార్త చెప్పిన బీసీసీఐ.. ఎట్టకేలకు లిస్ట్లో పేరు..
- Tilak Varma: ఆసియా కప్ ట్రోఫీ కాంట్రవర్సరీ.. సంచలన విషయం వెల్లడించిన తిలక్!
- BCCI vs PCB: ఎందుకయ్యా అతి చేస్తావ్.. ట్రోఫీపై నఖ్వీకి షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ రెడీ
అయితే, ఆదివారం సూపర్ -4లో పాకిస్థాన్తో భారత్ మరోసారి పోటీ పడబోతుంది. దీంతో అక్షర్ గైర్హాజరీలో టీమిండియా ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లను బరిలోకి దించాల్సి ఉంటుంది. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఇప్పటికే మంచి ఫాంలో ఉండగా.. అభిషేక్ శర్మ కూడా స్పిన్ వేయగలడు, అవసరమైతే అక్షర్ స్థానాన్ని కూడా భర్తీ చేస్తాడు. అక్షర్ పటేల్ ఉండటం వల్ల ఇటు బ్యాటర్గా, అటు బౌలర్గానూ రాణించేవాడు.. ఇక, రేపటి మ్యాచుకు వాషింగ్టన్ సుందర్ సిద్ధంగా ఉన్నాడు.
Read Also: Siva-Movie : కింగ్ నాగ్ ‘శివ’ రీరిలీజ్ డేట్ ఫిక్స్..!
ఇక, ఒమన్తో మ్యాచ్కు ప్రధాన బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తికి భారత జట్టు రెస్ట్ ఇచ్చింది. హర్షిత్ రాణా, అర్ష్దీప్సింగ్లను తుది జట్టులో ఆడించింది. అయితే, ఒమన్ను తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో టీమిండియా బౌలర్లు ఫెయిల్ అయ్యారు. దీంతో సూపర్-4 మ్యాచులకు మళ్లీ పాత జట్టునే బరిలోకి దింపే ఛాన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు అక్షర్ లేకపోతే అదనంగా మరో బ్యాటర్ను తీసుకొనే అవకాశం ఉంది. రింకు సింగ్ తుది జట్టులో ఉండే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. లోయర్ బెర్త్ వరకు బ్యాటింగ్ ఆర్డర్ ఉండటం అత్యంత కీలకం అని భారత్ భావిస్తుంది..
తాజావార్తలు
-
Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
-
Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
-
Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
-
Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!