ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ను ఓడించి టైటిల్ కైవస చేసుకుంది. దీంతో టీమిండియా రికార్డు స్థాయిలో మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను కైవసం చేసుకుంది. టీమిండియా విజయం సాధించిన తర్వాత, స్టేడియం లోపల, వెలుపల సంబరాలు అంబరాన్నంటాయి. క్రికెట్ ఫ్యాన్స్ ర్యాలీలు తీస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. క్రికెట్ దిగ్గజాలు కూడా సెలబ్రేషన్స్ లో భాగమయ్యారు. వీరిలో భారత క్రికెట్ దిగ్గజం, టీం ఇండియా మాజీ లెజెండరీ బ్యాట్స్మన్ సునీల్ గవాస్కర్ వీడియో…
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ తర్వాత టీమిండియా కీలక ఆటగాళ్లు రిటైర్ మెంట్ ప్రకటించబోతున్నారంటూ చర్చలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేలకు వీడ్కోలు పలుకుతాడని ఊహాగానాలు వెల్లువెత్తాయి. గత సంవత్సరం ప్రపంచ కప్ గెలిచిన తర్వాత అతను T20 అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినట్లుగానే ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీ అనంతరం వన్డేలకు రిటైర్ మెంట్ పలుకుతాడని అంతా భావించారు. అయితే ఈ పుకార్లకు రోహిత్ స్వయంగా ఫుల్ స్టాప్ పెట్టాడు. రిటైర్మెంట్ ఊహాగానాలపై…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో భారత్–న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ క్రమంలో.. న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా మొదట బౌలింగ్ చేయనుంది. కాసేపట్లో భారత్–న్యూజిలాండ్ మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో రోహిత్ శర్మ..? ఉన్నట్లు సమాచారం. తన భవిష్యత్పై సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్తో చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఖైరతాబాద్ గణేష్ టెంపుల్ లో పూజలు నిర్వహించారు. ఛాంపియన్ ట్రోఫీలో భారత్ విజయం సాధించాలని పూజలు చేశారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఛాంపియన్ ట్రోఫీ గెలవాలని పూజలు, ప్రత్యేక హోమం చేశారు గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు.
ఛాంపియన్స్ ట్రోఫీలో రసవత్తర సమరానికి సమయం అసన్నమైంది. అన్ని లీగ్ మ్యాచ్ల్లోనూ నెగ్గి అద్భుతమైన ఫామ్లో ఉన్న భారత్.. ఈరోజు జరిగే ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడబోతుంది. ట్రోఫీని దక్కించుకునేందుకు రోహిత్ సేనకు ఇదో మంచి అవకాశం అని చెప్పాలి.
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో భాగంగా.. ఈరోజు భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2.30 గం.కు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా ఇరు జట్లు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ మ్యాచ్లో టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును సాధించే అవకాశం ఉంది.
భారత్, న్యూజిలాండ్ రెండు జట్లు గతంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నాయి. 2002, 2013లో టీమిండియా రెండుసార్లు టైటిల్ కైవసం చేసుకుంది. 2000లో జరిగిన రెండవ ఎడిషన్ టోర్నమెంట్లో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. ఇప్పుడు భారత జట్టు మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకునే దిశగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఏ జట్టు కూడా మూడుసార్లు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను గెలుచుకోలేదు. ఆదివారం జరిగే ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్తో తలపడనుంది. Also Read:Madhya Pradesh: మత మార్పిడులు చేసే వారిని…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో భారత్-న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈనెల 9న (ఆదివారం) దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్సాహంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
దుబాయ్ వేదికగా ఆదివారం నాడు న్యూజిలాండ్తో మ్యాచ్లో రోహిత్ సేన తలపడబోతుంది. కాగా, ఈ మెగా వన్డే టోర్నమెంట్ తర్వాత భారత జట్టులో కీలక మార్పు జరగబోతున్నాయని సమాచారం. రోహిత్ శర్మ వన్డే, టెస్టు జట్ల కెప్టెన్సీకి గుడ్ బై పలికి కేవలం ప్లేయర్ గా కొనసాగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అంశం గురించి ఇప్పటికే చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య చర్చలు కూడా కొనసాగినట్లు తెలుస్తుంది.