Suryakumar Yadav: మమ్మల్ని మేమే పరీక్షించుకున్నాం.. మా ప్రణాళిక బెడిసికొట్టింది!
- 50 పరుగుల తేడాతో ఓడిపోయిన భారత్
- ఓటమిపై స్పందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
- మమ్మల్ని మేమే పరీక్షించుకున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నం వేదికగా బుధవారం రాత్రి న్యూజిలాండ్తో జరిగిన నాలుగో టీ20లో భారత్ 50 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ అనంతరం స్పందించాడు. సిరీస్ సొంతం చేసుకున్న నేపథ్యంలో నాలుగో టీ20లో తమ్మల్ని తామే పరీక్షించుకున్నాం అని చెప్పాడు. త్వరగా వికెట్స్ పడిపోతే.. ఒత్తిడిలో బ్యాటర్లు ఎలా ఆడుతారో తెలుసుకోవాలనుకున్నాం అని తెలిపాడు. ఫలితం కంటే జట్టు సంసిద్ధతకు ప్రాధాన్యం ఇచ్చామని వెల్లడించాడు. టీ20 వరల్డ్కప్ 2026ను దృష్టిలో పెట్టుకుని ఈ మ్యాచ్ను ఓ పరీక్షగా వాడుకున్నామని సూర్యకుమార్ చెప్పాడు.
‘మ్యాచ్లో ఆరు బ్యాటర్లతో బరిలోకి దిగాం. ఐదుగురు బౌలర్లు ఉండాలన్నది జట్టు వ్యూహం. 180 లేదా 200 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసే సమయంలో రెండు లేదా మూడు వికెట్లు త్వరగా పడితే.. పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలనుకున్నాం. మమ్మల్ని మేమే పరీక్షించుకున్నాం. అలాగేవ రల్డ్కప్ స్క్వాడ్లో ఉన్న ఆటగాళ్లందరికీ అవకాశం ఇవ్వాలనుకున్నాం. మెగా టోర్నీ ముందు ప్రతి ఆటగాడి పాత్ర, సామర్థ్యాన్ని పరీక్షించుకోవడం ఎంతో కీలకం. మొదట బ్యాటింగ్ చేసినప్పుడు జట్టు బాగా ఆడుతోంది. కాబట్టి ఈసారి ఛేదనలో పరీక్షించుకోవాలనుకున్నాం. భారీ లక్ష్యాన్ని ఛేదించే సమయంలో బ్యాటర్లు ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారో చూడాలన్నదే మా ఆలోచన. వచ్చే మ్యాచ్లో ఛేజింగ్ అవకాశం వస్తే తప్పక గెలుస్తాం’ అని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు.
Also Read
- IND Vs AFG: భారత బౌలర్ల ధాటికి ఆఫ్ఘనిస్థాన్ విలవిల.. టార్గెట్ 219 పరుగులు..
- KL Rahul: రాహుల్ను ల్యాబ్లో ఎలుకలా వాడుకుంటున్నారు.. అభిమానుల ఆగ్రహ జ్వాలలు..
- Rohit Sharma: వయసు కేవలం సంఖ్యే.. 39లోనూ రోహిత్ సూపర్ ఫీల్డింగ్.. వరుసగా మూడు క్యాచ్లు!
- Ind Vs Afg: టాప్ ఆర్డర్ను నలిపేసిన ప్రసిద్ధ్.. వన్డేల్లో బెస్ట్ స్పెల్తో రికార్డు..
Also Read: Fastest Fifty Record: శివమ్ దూబే ఊచకోత.. ఫాస్టెస్ట్ ఫిఫ్టీస్ రికార్డ్స్ ఇవే!
మ్యాచ్ పరిస్థితులపై సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. భారీ డ్యూ ప్రభావం ఉన్నా ఒకటి రెండు కీలక భాగస్వామ్యాలు ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. శివమ్ దూబే ఆడిన విధానం ప్రశంసనీయమని, అతనితో పాటు మరో బ్యాటర్ క్రీజులో నిలబడి ఉంటే విజయం సాధించేవాళ్ళం అని చెప్పాడు. ఈ మ్యాచ్ను ఓటమిగా కాకుండా.. ఓ గొప్ప పాఠంగా తీసుకుంటున్నామని సూర్యకుమార్ స్పష్టం చేశాడు. నాలుగో టీ20లో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేయగా.. భారత్ 18.4 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది.
తాజావార్తలు
-
NEET Exam: నాగ్పూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ సెంటర్.. అసలు నిజం ఇదే..
-
Railway Rules: టికెట్ లేని ప్రయాణంపై రైల్వే రూల్స్ చేంజ్.. ఇకపై డబుల్ పెనాల్టీ..
-
Maharashtra Temple Tragedy: పర్భణిలో విషాదం.. హనుమాన్ ఆలయ మండపం కూలి ఆరుగురు మృతి
-
PM Kisan: రైతులకు శుభవార్త.. అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. చెక్ చేసుకోండిలా..
-
Crispy Ridge Gourd Tikki Recipe: బీరకాయతో సూపర్ స్నాక్.. కరకరలాడే టిక్కీలు ఇలా తయారు చేయండి
ట్రెండింగ్
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..