GHMC : 2024-25 ఆర్థిక సంవత్సరంలో, జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను వసూలు అయ్యింది. ఈ ఏడాది 2,038 కోట్లు, 48 లక్షల రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయడం జరిగింది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 121 కోట్లు ఎక్కువ. గత ఆర్థిక సంవత్సరంలో 1,917 కోట్లు ఆస్తి పన్ను వసూలు చేయబడింది. ఈ సంవత్సరంలో 19 లక్షల 50 వేల ఆస్తులున్నా, 14 లక్షల 8 వేల మంది…
Physical Harassment: హైదరాబాద్ నగరంలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జర్మన్ యువతిపై అత్యాచారయత్నం చేసిన అస్లాం అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మార్చి మొదటి వారంలో హైదరాబాద్ వచ్చి, నగరాన్ని సందర్శిస్తున్న జర్మన్ యువతి, యువకుడు ఇద్దరూ స్నేహితుల వద్ద ఉండి అక్కడి ప్రదేశాలను చూస్తూ తిరుగుతున్నారు. అయితే.. నిన్న మార్కెట్ చూసేందుకు జర్మన్ యువతి, యువకుడు బయటకు వచ్చారు. మీర్పేట్ సమీపంలో జర్మన్ యువతి, యువకుడిని అస్లాం, అతడి స్నేహితులు చూశారు. నగరాన్ని…
Payal Shankar : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వ భూ విక్రయ విధానంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన ముఖ్యంగా యూనివర్శిటీ భూముల అమ్మకంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిపాలన పరిస్థితులను చూస్తుంటే, కేసీఆర్ అహంకారం ఇప్పుడు రేవంత్ రెడ్డిలో కనిపిస్తోందని పాయల్ శంకర్ అన్నారు. నాడు ఎంపీగా ఉన్నప్పుడు ‘ప్రభుత్వ భూములు అమ్మకూడదు’ అని చెప్పిన రేవంత్ రెడ్డి, నేడు ఏ అధికారంతో భూములను…
హైదరాబాద్లో మరో దారుణ సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పహాడీ షరీఫ్ ప్రాంతంలో ఓ విదేశీ యువతిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో నిందితుడు క్యాబ్ డ్రైవర్గా పోలీసులు గుర్తించారు. సెలవుల కోసం ఇండియాకు వచ్చిన ఈ విదేశీ యువతి షాపింగ్ చేసేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది. మీర్పేట్ పరిధిలోని ఫ్రెండ్ ఇంట్లో తాత్కాలికంగా ఉంటున్న ఆమె, తన ఫ్రెండ్ అయిన మరో విదేశీ యువకుడు, పిల్లలతో కలిసి…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. మీర్పేట్ వద్ద ఓ విదేశీ యువతిని లిఫ్ట్ ఇస్తామని నమ్మించి, ఆమెను తీసుకెళ్లిన ముగ్గురు యువకులు పహాడీ షరీఫ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశానికి తరలించారు. అక్కడ ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధిత యువతి జరిగిన ఘటనపై పోలీసులను ఆశ్రయించగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు జర్మనీకి చెందినవారని పోలీసులు గుర్తించారు. ఆమె ఫిర్యాదులో తనపై ముగ్గురు యువకులు దాడి చేశారని వివరించారు.…
గోల్డ్ లవర్స్కి షాకింగ్ న్యూస్. బంగారం ధరలు కొండెక్కాయి. గత వారం షాకిచ్చిన ధరలు.. ఈ వారం మరింతగా గూబ గుయిమనేలా షాకిస్తున్నాయి. సోమవారం రికార్డ్ స్థాయిలోకి బంగారం ధరలు చేరుకున్నాయి.
ఇప్పుడు పైలట్ అవతారం ఎత్తారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. ఛాపర్ నడిపి ఔరా..! అనిపించి మరోసారి వార్తల్లో నిలిచారు.. ఛాపర్ లో హైదరాబాద్ పరిసరాల్లో చక్కర్లు కొట్టారు.. సోషల్ మీడియాలో కేతిరెడ్డి షేర్ చేసిన వీడియోలు.. హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలను కూడా గమనించవచ్చు..
ఈ రోజు మాజీ మంత్రి కాకాణి గోవర్దన్రెడ్డికి నోటీసులు జారీ చేసేందుకు హైదరాబాద్కు వెళ్లారు నెల్లూరు పోలీసులు.. నిన్న సాయంత్రం నెల్లూరులోని ఇంట్లో కాకాణి లేకపోవడంతో గేట్కు నోటీసులు అంటించారు పోలీసులు.. ఇక, హైదరాబాద్లోని ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉగాది జరుపుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పెట్టారు కాకాణి గోవర్ధన్రెడ్డి.. దీంతో, కాకాణి.. హైదరాబాద్ లో ఉన్నారనే సమాచారంతో అక్కడికే బయల్దేరి వెళ్లారు..
వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో గత వారం రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు ఇంటికి చేరుకున్నారు. గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా కొడాలి నాని మొదట ఆసుపత్రిలో చేరగా, పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మూడు వాల్స్ క్లోజ్ అయ్యాయని నిర్ధారణ అయ్యింది. దీంతో స్టంట్ లేదా…
Toll Charges: హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు గుడ్ న్యూస్. ఈ రూట్ లో వెళ్లే వాహనాలకు టోల్ ఛార్జీలను తగ్గిస్తూ ఎన్హెచ్ఏఐ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తగ్గిన టోల్ చార్జీలు సోమవారం అర్ధరాత్రి ( మార్చ్ 31) నుంచి అమలులోకి రాబోతున్నాయి.