Rurban Panchayats: గ్రామపంచాయతీల పునర్ వ్యవస్థీకరణ.. కొత్తగా రూర్బన్ పంచాయతీలు!
- ఏపీలో గ్రామపంచాయతీల పునర్ వ్యవస్థీకరణ
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో సరికొత్త సంస్కరణలు
- జనాభా 10 వేలకు పైగా ఉంటే రూర్బన్ పంచాయతీగా గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government Introduces New Rurban Panchayats: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. గ్రామ పంచాయతీల పునర్ వ్యవస్థీకరణకు చర్యలు ప్రారంభించింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో సరికొత్త సంస్కరణలను తీసుకువస్తూ.. గ్రామ పంచాయతీలను జనాభా, ఆదాయం ఆధారంగా కొత్తగా వర్గీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ మార్పులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణాల తరహా సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా రూర్బన్ పంచాయతీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జనాభా 10 వేల కంటే ఎక్కువగా ఉండే గ్రామ పంచాయతీలు లేదా గ్రామ వార్షిక ఆదాయం రూ.1 కోటి కంటే ఎక్కువగా ఉండే పంచాయతీలను రూర్బన్ పంచాయతీలుగా గుర్తించనున్నారు. అదేవిధంగా జనాభా 3 వేల నుంచి 10 వేల మధ్య ఉండే గ్రామాలను గ్రేడ్-1 పంచాయతీలుగా గుర్తించనున్నారు. గ్రామ వార్షిక ఆదాయం రూ.30 లక్షల కంటే ఎక్కువగా ఉండి.. రూ.1 కోటి లోపు ఉంటే కూడా ఆ పంచాయతీలను గ్రేడ్-1గా వర్గీకరించనున్నారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు కావడమే ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.
Also Read
- India-Pakistan: "పాకిస్తాన్తో ఆడేది లేదు".. కేంద్రం సంచలన నిర్ణయం..
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి ప్లాన్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
ఇక జనాభా 2 వేల కంటే తక్కువగా ఉండే గ్రామ పంచాయతీలను గ్రేడ్-2 పంచాయతీలుగా నిర్ణయించారు. జనాభా 1500 కంటే తక్కువగా ఉన్న పంచాయతీలను గ్రేడ్-3 పంచాయతీలుగా వర్గీకరించనున్నారు. ఈ కొత్త విధానం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ పునర్ వ్యవస్థీకరణతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు గ్రామాల అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. రూర్బన్ పంచాయతీల ద్వారా గ్రామాల్లోనూ పట్టణాల తరహా సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Nithiin : ఎట్టకేలకు సినిమా మొదలెట్టిన నితిన్
-
India-Pakistan: “పాకిస్తాన్తో ఆడేది లేదు”.. కేంద్రం సంచలన నిర్ణయం..
-
Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి ప్లాన్ అమలు.. చివరికిలా..!
-
SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం…
-
Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!