తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల కూడా నిరాశ తప్పేలా లేదు.. పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా.. కొన్ని రోజులు ఎన్నికల కోడు.. ఆ తర్వాత జాప్యం.. ఇలా అమలుకు నోచుకోవడం లేదు.. ఈ నెల కూడా పీఆర్సీ అమలు లేనట్టే కనిపిస్తోంది.. ఉద్యోగులకు మే నెల కూడా పాత జీతాలే రానున్నాయని చెబుతున్నారు.. ఏప్రిల్ ఒకటి నుండి కొత్త పీఆర్సీ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినా.. కరోనా వైరస్ విజృంభణ, ఇతర కారణాలతో…
వ్యాక్సినేషన్పై కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు… కాసేపట్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.. ఈ సమావేశంలో.. వ్యాక్సినేషన్ ఎప్పటి నుంచి తిరిగి ప్రారంభించాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.. కాగా, వ్యాక్సిన్ల కొరత కారణంగా.. వ్యాక్సినేషన్ నిలిపివేసింది సర్కార్.. టీకాలు వేయడం నిలిచిపోయి కూడా పది రోజులు గడిచింది… అయినా.. తిరిగి ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందన్న దానిపై క్లారిటీ లేదు.. కానీ, ఇవాళ ఆ తేదీని ఫైనల్ చేసే అవకాశంఉంది… మొదటగా ఫ్రంట్ లైన్…
కరోనావైరస్ మహమ్మారి యావత్ దేశాన్ని వణికిస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి తీవ్రత ఊహకు అందని విధంగా ఉంది. యావత్ దేశం విలవిలలాడిపోతోంది. ఇక హైదరాబాద్ నగరంలోను కోవిడ్ మరణాలు పెరిగిపోతున్నాయి. ఒక్కో స్మశానంలో రోజుకు 10 కి పైగా మృతదేహాలు వస్తున్నాయని నిర్వాహకులు చెప్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అంతిమ సంస్కారాలు చేస్తున్నారు. కోవిడ్-నాన్ కోవిడ్ మృతదేహాలను వేర్వేరుగా దహనాలు చేస్తున్నామని చెప్తున్నారు.…
హైదరాబాద్ లోని నాచారంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఐస్ క్రీమ్ తిని సంపత్ అనే యువకుడు మృతి చెందాడు. స్విగ్గీలో స్కూబ్స్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసిన సంపత్.. కేజీ ఐస్ క్రీమ్ లో కొద్దిగా ఉంచి మిగతాది మొత్తం తినేశాడు సంపత్. అయితే ఆ ఐస్ క్రీమ్ తిన్న కాసేపటికే వాంతులు, విరోచనాలు అయ్యాయి. ఇక పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు సంపత్. దీంతో సంపత్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. సంపత్ బంధువుల సమాచారంతో..…
హైదరాబాద్ లో లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తుండటంతో, రోడ్లపైకి ఎవర్ని అనుమతించడం లేదు. రోడ్లపైకి అనవసరంగా వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వాహనాలను సీజ్ చేస్తామని పోలీసులు కఠినంగా హెచ్చరించారు. పోలీసులు రూల్స్ ను స్ట్రిక్ట్ గా ఫాలో అవుతుండటంతో వాహనదారులు రోడ్లపైకి వచ్చేందుకు భయపడుతున్నారు. అనవసరంగా రోడ్లమీదకు వచ్చి ఇబ్బందులు పడేకంటే ఇంట్లోనే ఉండటం మంచిది అని చెప్పి బయటకు రావడం లేదు. దీంతో రోడ్లు బోసిపోయాయి.
హైదరాబాద్కు చెందిన దీప్తీ నార్కుటి అనే విద్యార్థి అమెరికన్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్లో ఏడాదికి 2 కోట్ల ప్యాకేజీ కొట్టేసింది. దీప్తీ సీటెల్లోని మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో గ్రేడ్ -2 లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్గా పని చేయనుంది. దీప్తీ ఇటీవల ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో తన ఎంఎస్ పూర్తి చేసింది. కాలేజీ ప్లేస్మెంట్ సమయంలో, ఆమెకు గోల్డ్మన్ సాచ్స్ మరియు అమెజాన్ నుండి ఆఫర్స్ కూడా వచ్చాయి. అయితే ఈ మైక్రోసాఫ్ట్ నుండి జాబ్ ఆఫర్ అందుకున్న…
కొన్ని రోజులుగా బంగారం ధరలు దిగివచ్చాయి. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టడం విశేషం. దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. అయితే, నిన్న ఇవాళ మాత్రం బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు కిందికి కదలడంతో… బులియన్ మార్కెట్లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,000 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర…
కరోనా క్లిష్ట సమయంలో సేవలు అందించాల్సిన జూనియర్ డాక్టర్లు మళ్లీ ఆందోళనకు సిద్ధం అవుతున్నారు.. ఈ నెల 26వ తేదీ నుంచి విధులు బహిష్కరిస్తామని ప్రకటించారు జూడాలు.. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 15 శాతం స్టై ఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తున్న జూనియర్ వైద్యులు.. ప్రకటించిన విధంగా 10 శాతం ఇన్సెంటివ్స్ వెంటనే చెల్లించాలని కోరుతున్నారు.. ఇక, కోవిడ్ డ్యూటీలు చేసే హెల్త్ కేర్ వర్కర్స్ వైరస్ బారిన పడితే… నిమ్స్ లో వైద్యం…
హైదరాబాద్ లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. జూబ్లీహిల్స్ రోడ్డు నం. 41 లోని ఓ హోటల్ ఓయో రూంపై దాడులు చేసి ముగ్గులు సెక్స్ వర్కర్లను, ఇద్దరు విటులు, ఒక నిర్వహకుడిని పొలీసులు అరెస్ట్ చేశారు. అందిన సమాచారంతో పోలీసులు పక్కా ప్లాన్ వేసి..ఓయో రూంపై దాడులు చేశారు. వ్యభిచార గృహ నిర్వహకుడిని అశ్విన్ గా గుర్తించారు. విటులను అల్వాల్ కు చెందిన వ్యాపారి రాహుల్ సురాన, కూకట్ పల్లి నిజాంపేటకు చెందిన…
తెలంగాణలో లాక్డౌన్ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయబోతున్నారు.. ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు రాష్ట్ర సరిహద్దులను పూర్తిగా మూసివేయబోతున్నారు.. సరిహద్దు దాటి ఒక్కరు కూడా రాష్ట్రంలోకి రాకుండా.. బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించనున్నట్టు తెలిపారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి.. రాష్ట్రంలో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకే గూడ్స్ వాహనాలకు అనుమతి ఇస్తారు. అయితే, పోలీసులు సీజ్ చేసిన వాహనాలు లాక్డౌన్…