ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. కృష్ణ నది జలాలతో పాటు.. గోదావరి జలాల విషయంలోనూ కొన్ని వివాదాలు ఉండగా… ఈ వివాదాలకు తెరదించాలన్న ఉద్దేశంతో… రెండు బోర్డుల అధికారాలు, పరిధిలను నిర్ణయిస్తూ.. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.. అయితే, దీనిపై భిన్నమైన వాదనలు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో.. ఈనెల 9వ తేదీన గోదావరి నది యాజమాన్య బోర్డు పూర్తిస్థాయి అత్యవసర సమావేశం జరగనుంది… కేంద్ర జనశక్తి మంత్రిత్వ…
ప్రపంచంలో ఉన్న టాప్ బెస్ట్ సిటీల్లో హైదరాబాద్ ఒకటి.. మూడు వేల యాక్టివ్ వైఫై హాట్ స్పాట్స్ హైదరాబాద్ని గ్లోబల్ స్మార్ట్ సిటీగా మార్చడానికి పనిచేస్తున్నాయని తెలిపారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. ప్రభుత్వం ప్రారంభించిన హై-ఫై ప్రాజెక్ట్లో భాగంగా హైదరాబాద్లో 3000కు పైగా పబ్లిక్ వై-ఫై హాట్స్పాట్లు ఏర్పాటు చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఫైబర్ నెట్తో ప్రజలు స్పీడ్ ఇంటర్నెట్ పొందుతున్నారు.. ఫైబర్ నెట్తో ప్రభుత్వం భాగస్వామ్యం…
జీహెచ్ఎంసీ పరిధిలో అక్రమనిర్మాణాలపై హైకోర్టు విచారణ జరిపింది. కోర్టు స్టేలు ఎత్తివేయాలని జీహెచ్ఎంసీ ఎందుకు కోరడం లేదన్న హైకోర్టు… అక్రమ నిర్మాణం పూర్తయ్యే వరకు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. జీహెచ్ఎంసీలోనే సుమారు లక్ష అక్రమ నిర్మాణాలున్నాయన్న హైకోర్టు… రాష్ట్రవ్యాప్తంగా అక్రమ నిర్మాణాల పరిస్థితి ఏమిటని కాగితాల్లో నిబంధనలు బాగున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాలపై తీసుకున్న చర్యలు నివేదించని జోనల్ కమిషనర్లపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నివేదికలు సమర్పించని అధికారులు ఖర్చుల…
ఇండియాలోనే అతిపెద్ద ఫ్రీ పబ్లిక్ వైఫై నెట్వర్క్ గా హైదరాబాద్ ఉంది. లార్జెస్ట్ పబ్లిక్ ఇంటర్నెట్ కనెక్టెడ్ సిటీగా హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది. హై ఫై ప్రోగ్రాంలో భాగంగా ఆక్ట్ ఫైబర్ నెట్ భాగస్వామ్యంతో హైదరాబాద్లో ఫ్రీ వైఫై హాట్ స్పాట్స్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. హై ఫై ప్రోగ్రాం కామెమోరేషన్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, IT ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఆక్ట్ ఫైబర్ నెట్ సీఈఓ బాల మల్లాది, GHMC మేయర్ విజయలక్ష్మి…
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేసి ప్రభుత్వ భూములను గుర్తించాలని ఆదేశించింది హైకోర్టు.. సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ విక్రయాలు జరుగుతున్నట్టు తరచూ మా దృష్టికి వస్తున్నాయని పేర్కొన్న హైకోర్టు… 33 జిల్లాల్లో కలెక్టర్లు వెంటనే సర్వే పనులు చేపట్టి నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని.. ప్రభుత్వ భూములను గుర్తించి, జియో సర్వే వివరాలతో రికార్డుల్లో నమోదు చేయాలని స్పష్టం…
పార్టీ శ్రేణుల సంక్షేమం కోసం.. పార్టీ సభ్యులకు ఇన్సూరెన్స్ తీసుకొచ్చింది టీఆర్ఎస్.. పార్టీ సభ్యత్వం ఉన్నవారు ఎవరైనా మృతిచెందితే వారికి ఇన్సూరెన్స్ అందిస్తూ వస్తున్నారు.. వివిధ కారణలతో మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు ఇవాళ తెలంగాణ భవన్లో ఇన్సూరెన్స్ చెక్కులు అందించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. 80 మందికి రెండు లక్షల రూపాయల చొప్పున ఇన్సూరెన్స్ చెక్కులు అందజేశారు.. ఈ సంవత్సరం పార్టీ మొత్తం కార్యకర్తలకు 18 కోట్ల రూపాయల ప్రీమియం డబ్బులను ఇన్సూరెన్స్…
ఒలింపిక్స్లో మువ్వెన్నెల జెండాను రెపరెపలాడించిన పీవీ సింధు.. ఇవాళ సొంత గడ్డకు రానుంది. హైదరాబాద్లో అడుగుపెట్టనుంది. పతకాల సింధుకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమయ్యారు అభిమానులు. అటు టోక్యో నుంచి ఢిల్లీకి చేరుకున్న సింధుకు మంత్రులు ఘన స్వాగతం పలికారు. దేశానికి వన్నె తెచ్చిన వనితను సాదరంగా సత్కరించారు. ఒలింపిక్లో కెరీర్లో ఒక్క మెడల్ కొడితే గొప్ప అనుకునే సమయంలో.. తెలుగు తేజం పీవీ సింధు వరుసగా రెండు పతకాలు సాధించింది. బ్యాడ్మింటన్లో గత ఒలింపిక్స్లో రజతం..…
తెలంగాణ ఎంసెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విద్యార్థులు పరీక్ష సమయం కన్నా రెండు గంటల ముందే ఎగ్జామ్ సెంటర్స్ కు చేరుకోవాలి. పరీక్ష ప్రారంభం అయ్యాక ఒక్క నిమిషం ఆలస్యం అయినా లోపలికి అనుమతించరు. 105పరీక్ష కేంద్రాల్లో దాదాపు రెండున్నర లక్షల మంది ఎంసెట్ పరీక్షకు హాజరుకానున్నారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్ లు ధరించడంతో పాటు.. సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆగస్ట్ ఇవాళ, రేపు, ఎల్లుండి ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్, 9, 10 తేదీల్లో…
మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ మరేదానికి ఉండదు. మన దేశ మహిళలు బంగారం కొనుగోలు చేయడానికి చాలా ఇష్టపడతారు. అయితే.. బంగారం కొనే వారికి ఓ శుభవార్త. ఇవాళ పసిడి ధరలు భారీగా పడిపోయాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.90 తగ్గి రూ. 44,900 కి చేరగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 తగ్గి రూ.48,980 కు…