హైదరాబాద్: కాచిగూడ ఐనాక్స్కు జిల్లా వినియోగదారుల కమిషన్ షాక్ ఇచ్చింది. సమయానికి సినిమా వేయలేదని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన కమిషన్ ఐనాక్స్ యాజమాన్యానికి రూ.10వేలు జరిమానా విధించింది. అంతేకాకుండా లైసెన్స్ అథారిటీ కింద మరో రూ.లక్ష ఫైన్ కట్టాలని ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. 2019, జూన్ 22న తార్నాకకు చెందిన విజయగోపాల్ అనే వ్యక్తి ‘గేమ్ ఓవర్’ అనే సినిమాను వీక్షించేందుకు కాచిగూడలోని ఐనాక్స్కు వెళ్లాడు. అయితే సినిమా టిక్కెట్పై ఉన్న సమయం…
పర్యాటక సంస్థలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న సుమారు 180 మంది ఉద్యోగుల సర్వీ్సను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్కు వినతిపత్రం అందజేశామని సంఘం ప్రధాన కార్యదర్శి సబ్బు రాజమౌళి ఒక ప్రకటనలో తెలిపారు. పర్యాటక అభివృద్ధి సంస్థలో ప్రస్తుతం కేవలం 80 మంది మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులున్నారని, మిగిలినవారంతా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పని…
హైదరాబాద్ నగరంలో ఆదివారం నాడు ఎయిర్టెల్ ఆధ్వర్యంలో భారీ మారథాన్ జరగనుంది. పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు 42 కిలోమీటర్లు (ఫుల్ మారథాన్), 21 కిలోమీటర్లు (హాఫ్ మారథాన్), 10 కిలోమీటర్ల మారథాన్ను నిర్వహించనున్నారు. ఈ మారథాన్కు ఇప్పటికే 6వేల మందికి పైగా రిజిస్టర్ చేయించుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఎయిర్టెల్ హైదరాబాద్ మారథాన్ 10వ ఎడిషన్ నేపథ్యంలో పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి మధ్య ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల…
ఇండియాలో రోజు రోజు కు బంగారం ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. నిన్నటి రోజున స్థిరంగా ఉన్న బంగారం ధరలు.. ఇవాళ మరోసారి ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 పెరిగి రూ. 45, 700 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 430 పెరిగి రూ. 49, 850 కి చేరింది. ఇక అటు వెండి…
పుష్ప.. పుష్ప రాజ్ మ్యానియా మొదలయ్యింది. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా నేడు విడుదలై హిట్ టాక్ ని అందుకొని ముందుకు దూసుకెళ్తోంది. ఎక్కడ విన్నా.. ఎక్కడా చూసినా పుష్పనే కనిపిస్తున్నాడు. తాజాగా హైదరాబాద్ పోలీసులు సైతం పుష్ప పేరే కలవరిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్తకొత్త పద్దతులతో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమదైన రీతిలో పుష్ప పోస్టర్ ని వాడుకున్నారు.. పుష్ప పోస్టర్ లో బైక్ పై నిలబడిన…
ఇళ్ళ మధ్యలో పబ్ లు, బార్లు ఏర్పాటు చేయడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. శుక్రవారం ఈ పిటీషన్ హైకోర్టు విచారించింది. జూబ్లీహిల్స్ రెసిడెన్షియల్ ఏరియాలో పబ్లు ఏర్పాటు చేయడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పబ్ లు, బార్ అండ్ రెస్టారెంట్లను తొలగించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన జూబ్లీహిల్స్ లోని రెసిడెన్షియల్ అసోసియేషన్స్ సభ్యులు. తదుపరి విచారణ ఈనెల 22కు హైకోర్టు వాయిదా వేసింది. Read Also: ఉపాధి కల్పించే వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది: కేటీఆర్…
హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు ఎల్ఈడీ దీపాల వెలుగులో వెలిగిపోతోంది. ప్రభుత్వం తీసుకున్న భద్రత చర్యల కారణంగా ఔటర్ రింగు రోడ్డు కొత్త రూపు సంతరించుకుంది. హెచ్ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఓఆర్ఆర్పై 136 కిలోమీటర్ల మేర ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. నాలుగు ప్యాకేజీల్లో రూ.100.22 కోట్లతో ఏడేళ్ల వరకు ఆపరేషన్, మెయింటెనెన్స్ ఉంటుంది. జంక్షన్, అండర్ పాస్, రెండు వైపులున్న సర్వీస్ రోడ్లపై కిలోమీటర్ దూరంలో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు…
తెలంగాణలో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తాజా ప్రకటన ప్రకారం రాష్ట్రంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య ఎనిమిదికి చేరింది.. తాజాగా హన్మకొండకు చెందిన ఓ మహిళకు ఒమిక్రాన్ పాజిటివ్గా తేలింది.. అయితే.. మొదట ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన టోలీచౌకీలోని పారామౌంట్ కాలనీలో మాత్రం టెన్షన్ నెలకొంది.. ఆ ప్రాంతంలో ట్రేసింగ్, టెస్టింగ్ విస్తృతంగా నిర్వహిస్తున్నాయి మెడికల్ టీమ్లు… కాంటాక్టుల్లోనూ ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. దీంతో.. ఆ ప్రాంతంలో మరింత…
నామినేటెడ్ పదవుల కోసం చాలా కాలంగా ఆశావహులు ఎదురుచూస్తున్నారు.. అయితే, అందులో కొంతమందికి శుభవార్త చెప్పారు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు.. కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు సీఎం కేసీఆర్.. తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా గజ్జెల నగేష్. తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ చైర్మన్గా పాటిమీది జగన్ మోహన్ రావు.…
పసిడి ప్రేమికులకు భారీగా పెరిగిన ధరలు షాకిస్తున్నాయి.. ఈ మధ్య క్రమంగా పైకి కదులుతోన్న బంగారం ధర.. నిన్న గుడ్న్యూస్ చెబుతూ కిందికి దిగివచ్చింది.. కానీ, మరోసారి పైకి కదిలి మళ్లీ షాకిచ్చింది.. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రేటు పెరుగుదల, దేశీ మార్కెట్లో డిమాండ్తో పసిడి ధర పెరిగిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.. Read Also: సీఎం వైఎస్ జగన్ విశాఖ పర్యటన.. షెడ్యూల్ ఇదే.. ఇక, హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల…