హైదరాబాద్ లోని హైదర్ గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు జీహెచ్ఎంసి పారిశుధ్య కార్మికులు ఆందోళన చేశారు. సూపర్ వైజర్ శ్రీనివాస్ తమను మానసికంగా, లైగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ పారిశుధ్య కార్మికులు ధర్నాకు దిగారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో.. వారికి శిక్ష పడుతుంది. భవిష్యత్ లో టీఎస్పీఎస్సీ నిర్వహించే పరీక్షలు రాయకుండా 13 మందిని డిబార్ చేయాలని కమిషన్ నిర్ణయించింది. వేటుకు గురైన అభ్యర్థులు రెండు రోజుల్లో వివరణ ఇవ్వొచ్చని తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్, సైబర్ నేరాలు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. దాన్ని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యువత అటువైపు అడుగులు వేయకుండా జాగ్రత్తలను తీసుకుంటోంది. విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ సరఫరా కాకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం రెండు కొత్త వింగ్ లను రాష్ట్ర హోం శాఖ స్టార్ట్ చేసింది.
ఉప్పల్ భగాయత్ లేఔట్ లో మిగిలి పోయిన 63 ప్లాట్లను వేలానికి హెచ్ఎండీఏ ( HMDA ) పెట్టింది. ఉప్పల్ భగాయత్ లో 464 గజాల నుండి 11,374 గజాల వరకు ప్లాట్లు ఉన్నాయి. జూన్ 27 వరకు రిజిస్ట్రేషన్ గడువు ఇచ్చింది హెచ్ఎండీఏ, 28 వరకు ఈఎండీ చెల్లించడానికి అవకాశం ఇచ్చింది.
హైదరాబాద్ లో వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. వాహనాలను వేగంగా నడపవద్దని అధికారులు చెప్తున్నా జనాలు లెక్కచెయ్యడం లేదు.. ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది..తాజాగా ఓ కారు బీభత్సాన్ని సృష్టించింది.. మితిమీరిన వేగంతో ఒక్కసారిగా కారు దూసుకొచ్చింది. పాతబస్తీ రెయిన్ బజార్లో మైనర్ల ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదం జరిగింది.అతివేగంతో వాహనదారుడిపైకి కారు దూసుకెళ్లింది.. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు మైనర్లకు కూడా గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు..…
తాగొచ్చి రోజు కొడుతూ, వేదిస్తున్నాడని భర్తను భార్య అతి కిరాతకంగా నరికి చంపింది.. ఈ ఘటన పదిహేను రోజుల క్రితం జరిగింది.. శంషాబాద్ పరిధి జూకల్ గ్రామంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు.. తాగొచ్చి వేధిస్తున్నడని భర్తను భార్యే చంపినట్లు తేల్చి ఆమెను అరెస్ట్ చేశారు.. వివరాలిలా.. కర్ణాటకకు చెందిన గడ్డిరాజు వెంకట నాగరాజు(60), నాగమణి(55) దంపతులు బతుకుదెరువు కోసం సిటీకి వచ్చి శంషాబాద్ మండలంలోని జుకల్ గ్రామంలో ఉంటున్నారు. ఆ గ్రామంలోని చందర్…