TS Police: డ్రగ్స్ కంట్రోల్- నార్కోటిక్ బ్యూరోల చీఫ్స్ గా హైదరాబాద్-సైబరాబాద్ సీపీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్, సైబర్ నేరాలు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. దాన్ని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యువత అటువైపు అడుగులు వేయకుండా జాగ్రత్తలను తీసుకుంటోంది. విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ సరఫరా కాకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం రెండు కొత్త వింగ్ లను రాష్ట్ర హోం శాఖ స్టార్ట్ చేసింది. దేశంలో ఎక్కడ లేని విధంగా నాలుగు వేల మందితో నార్కోటిక్స్, సైబర్ బ్యూరోలను ఏర్పాటు చేసింది. డ్రగ్స్ నివారణకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను ఏర్పాటు చేయనున్నారు. అలాగే సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ సెక్యూరిటీ బ్యూరోను నెలకొల్పనున్నారు. ఈ రెండు విభాగాలను హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. హైదరాబాద్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రెండు విభాగాలు ఏర్పాటు చేశారు.
Read Also: Naresh: పవిత్ర అంటే ఎందుకంత పిచ్చి నరేషా..
Also Read
- Shreyas Iyer Record: టీ20ల్లో శ్రేయస్ అయ్యర్ కొత్త రికార్డు.. ధోనీ, కోహ్లీ సరసన చేరిన కెప్టెన్..
- 45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..
- India Unwanted Record: ఇంగ్లండ్ ధాటికి చిత్తైన భారత్.. చరిత్రలో తొలిసారి చెత్త రికార్డు
- 14 నిమిషాల్లో 3 గోల్స్.. మాయ చేసిన Argentina.! ఓటమి అంచుల నుంచి క్వార్టర్స్ బరిలోకి ఛాంపియన్స్.!
టవర్-బి లోని 13వ అంతస్తులో యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను.. టవర్-బిలోని 2,3 అంతస్తుల్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేశారు. నార్కోటిక్ బ్యూరో అదనపు డీజీగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కు అదనపు బాధ్యతలను అప్పగించగా.. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐజీగా స్టీఫెన్ రవీంద్రను నియమించింది. డ్రగ్స్ వల్ల కలిగే నష్టాన్ని యువతకు అందించేందుకు ఈ నార్కోటిక్స్ బ్యూరో ద్వారా అవగాహన కల్పిస్తారు. యువతకే కాదు డ్రగ్స్ యూజ్ చేస్తున్నా.. అందరికీ ఈ బ్యూరోలో కౌన్సిలింగ్ ఇస్తారు. తద్వారా వారిలో సత్ఫవర్తనను రాబట్టే విధంగా చేస్తారు. విదేశాల నుంచి వచ్చే మాదక ద్రవ్యాలను పట్టుకోవడంతో పాటు.. ఆ దేశాల అధికారులతో సమాచారాన్ని షేర్ చేసుకుంటారు. అంతే కాకుండా రాష్ట్రాల్లోనూ ఈ సమాచారాన్ని మార్పిడి చేసుకుంటారు.
Read Also: Vizag Supari Gang: విశాఖలో సుపారీ గ్యాంగ్ గుట్టురట్టు.. ఆరుగురు అరెస్ట్
సైబర్ సెక్యూరిటీ బ్యూరో వల్ల ఆన్లైన్ మోసాలు అనేవి ఎక్కువగా జరగకుండా చూసుకుంటూ.. ఒకవేళ మోసాలు జరిగిన కేసును త్వరితగతిన ఛేదించడానికి ఉపయోగపడతాయి. దేశాన్ని కుదిపోసిన 67 కోట్ల మంది డేటా చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. అంతేకాదు ఆ సమాచారాన్ని చోరీ చేసిన సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు ఎంతో శ్రమించారు. అదే కాకుండా ఇంకా సైబర్ నేరాలు ఎన్ని ఉన్నాయో వాటి అన్నింటికి ఈ బ్యూరో ఎంతో ఉపయోగపడుతోంది.
తాజావార్తలు
-
Lenin : రిజనబుల్ ధరకే ‘లెనిన్’ నైజాం టికెట్ ధరలు
-
R Madhavan: అందమైన హీరోయిన్ల మధ్య ఉన్నా భార్యను ఎందుకు మోసం చేయలేదో చెప్పిన స్టార్ యాక్టర్!
-
Shreyas Iyer Record: టీ20ల్లో శ్రేయస్ అయ్యర్ కొత్త రికార్డు.. ధోనీ, కోహ్లీ సరసన చేరిన కెప్టెన్..
-
OG 2 Update : పవర్ స్టార్ ‘OG -2’ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్కు డేట్ ఫిక్స్
-
Mumbai Airport: ముంబై విమానాశ్రయంలో ఒకే రన్వేపై రెండు విమానాలు.. వందలాది మంది ప్రయాణికులు చావు అంచుల వరకు..
ట్రెండింగ్
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!