Hyderabad : వేధిస్తున్నాడని భర్తను అతి దారుణంగా నరికి చంపిన భార్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాగొచ్చి రోజు కొడుతూ, వేదిస్తున్నాడని భర్తను భార్య అతి కిరాతకంగా నరికి చంపింది.. ఈ ఘటన పదిహేను రోజుల క్రితం జరిగింది.. శంషాబాద్ పరిధి జూకల్ గ్రామంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు.. తాగొచ్చి వేధిస్తున్నడని భర్తను భార్యే చంపినట్లు తేల్చి ఆమెను అరెస్ట్ చేశారు..
Also Read
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
- TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
వివరాలిలా.. కర్ణాటకకు చెందిన గడ్డిరాజు వెంకట నాగరాజు(60), నాగమణి(55) దంపతులు బతుకుదెరువు కోసం సిటీకి వచ్చి శంషాబాద్ మండలంలోని జుకల్ గ్రామంలో ఉంటున్నారు. ఆ గ్రామంలోని చందర్ రావు అనే వ్యక్తికి చెందిన ఎకరం స్థలంలో మామిడి తోట ఉండగా.. నాగరాజు అక్కడ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు..
ఈ నెల 14న రాత్రి తోటలో నాగరాజు హత్యకు గురయ్యాడు. ఇద్దరు వ్యక్తులు తోటలోకి ప్రవేశించి నాగరాజుపై దాడి చేయగా అతడు చనిపోయాడని తన భార్య పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.. అంతేకాదు తన మొహంపై స్ప్రే కొట్టి.. తన మెడలోని పుస్తెల తాడును లాక్కుని ఆ వ్యక్తులు పారిపోయారని నాగలక్ష్మి పోలీసులకు చెప్పింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా కేసును ఓ కొలిక్కి తీసుకొచ్చారు. ఈ నెల 30 నాగమణిపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. రోజూ తాగొచ్చి వేధిస్తున్నడని తానే గొడ్డలితో భర్తను చంపినట్లు నాగమణి పోలీసుల ఎదుట నేరాన్ని ఒప్పుకుంది. ఆమె పుస్తెల తాడును మామిడి తోటలో దాచిపెట్టగా.. పోలీసులు రికవరీ చేశారు.. ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు..
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?