తాగొచ్చి రోజు కొడుతూ, వేదిస్తున్నాడని భర్తను భార్య అతి కిరాతకంగా నరికి చంపింది.. ఈ ఘటన పదిహేను రోజుల క్రితం జరిగింది.. శంషాబాద్ పరిధి జూకల్ గ్రామంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు.. తాగొచ్చి వేధిస్తున్నడని భర్తను భార్యే చంపినట్లు తేల్చి ఆమెను అరెస్ట్ చేశారు..
వివరాలిలా.. కర్ణాటకకు చెందిన గడ్డిరాజు వెంకట నాగరాజు(60), నాగమణి(55) దంపతులు బతుకుదెరువు కోసం సిటీకి వచ్చి శంషాబాద్ మండలంలోని జుకల్ గ్రామంలో ఉంటున్నారు. ఆ గ్రామంలోని చందర్ రావు అనే వ్యక్తికి చెందిన ఎకరం స్థలంలో మామిడి తోట ఉండగా.. నాగరాజు అక్కడ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు..
ఈ నెల 14న రాత్రి తోటలో నాగరాజు హత్యకు గురయ్యాడు. ఇద్దరు వ్యక్తులు తోటలోకి ప్రవేశించి నాగరాజుపై దాడి చేయగా అతడు చనిపోయాడని తన భార్య పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.. అంతేకాదు తన మొహంపై స్ప్రే కొట్టి.. తన మెడలోని పుస్తెల తాడును లాక్కుని ఆ వ్యక్తులు పారిపోయారని నాగలక్ష్మి పోలీసులకు చెప్పింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా కేసును ఓ కొలిక్కి తీసుకొచ్చారు. ఈ నెల 30 నాగమణిపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. రోజూ తాగొచ్చి వేధిస్తున్నడని తానే గొడ్డలితో భర్తను చంపినట్లు నాగమణి పోలీసుల ఎదుట నేరాన్ని ఒప్పుకుంది. ఆమె పుస్తెల తాడును మామిడి తోటలో దాచిపెట్టగా.. పోలీసులు రికవరీ చేశారు.. ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు..