హిట్ అండ్ రన్ యాక్ట్ పుణ్యామా అని రెండో రోజు పెట్రోల్ బంకుల దగ్గర వెహికిల్స్ రద్దీ కొనసాగుతుంది. నిన్న ఒక్కసారిగా వాహనదారులు బంకుల దగ్గరకు చేరుకోవడంతో బంకులో పెట్రోల్ నిల్వలు అయిపోయాయి. రాత్రి పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లు చేరుకోవడంతో బంకుల దగ్గర సరఫరా కొనసాగుతుంది.
చర్లపల్లి లో భారీ పేలుడు సంభవించింది. వెంకట్ రెడ్డి నగర్ & మధుసూదన్ రెడ్డి నగర్ లోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో నిన్న రాత్రి భారీ శబ్దంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లో పేలుడు చోటు చేసుకుంది.
జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ప్రఖ్యాత ఏవియేషన్ ఎనలిటికల్ సంస్థ అయిన సీరియమ్ ద్వారా ఆన్- టైమ్ పని తీరు కోసం ప్రపంచ వ్యాప్తంగా రెండవ అత్యుత్తమ విమానాశ్రయంగా ర్యాంక్ సాధించింది.
హైదరాబాద్ లోని చంచల్ గూడలో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ ఏకంగా గుర్రం మీద స్వారీ చేస్తూ.. ఫుడ్ ఆర్డర్ ను డెలివరీ చేయడానికి వెళ్తున్నప్పుడు నెటిజన్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఉప్పల్ లోని సీఎంఆర్ షాపింగ్ మాల్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షాపింగ్ మాల్ క్లోస్ చేసే సమయంలో ఈ ఘటన జరిగింది. షాపింగ్ మాల్ ముందు భాగంలో అంటుకున్న మంటలు క్షణాల్లో మాల్ మొత్తం వ్యాపించాయి.
నేడు గాంధీభవన్లో మద్యాహ్నం 2 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ భేటీ జరగనుంది. ఈ మీటింగ్ లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొంటారు.
సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఇవాళ్టి నుంచి సన్నాహక సమావేశాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రెండు విడతలుగా రోజుకో లోక్సభ నియో జకవర్గం చొప్పున భేటీలు కొనసాగనుంది.
Revanth Reddy: ఎయిర్పోర్ట్ మెట్రో, ఫార్మా సిటీలను రద్దు చేయలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా స్ట్రీమ్లైన్ పనులు జరుగుతున్నాయన్నారు.
హైదరాబాద్ నగరంలోని 83వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 2, 400 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 15 వరకు 45 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ జరగనుంది.
కొత్త సంవత్సరం రోజు సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ.. మెట్రో కానీ, ఫార్మాసిటీ కానీ రద్దు చెయ్యడం లేదు అని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాను.