Hyderabad Petrol Bunks: పెట్రోల్ పై మళ్లీ పుకార్లు.. బంకుల్లో జనం క్యూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Petrol Bunks: పెట్రోల్ బంకులు మూతపడతాయన్న వదంతులు మళ్లీ వ్యాపించడంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ కోసం ప్రజలు బారులు తీరారు. నగరంలోని పాతబస్తీలో ఒక్కసారిగా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర నోస్టాక్ బోర్డులు కూడా దర్శనమిచ్చాయి. దీంతో వాహనాలుకు సమాచారం తెలియడంతో బంక్ ల వద్దకు హుటి హుటిన పరుగులు పెట్టారు. ఇటీవల హిట్ అండ్ రన్ కేసుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన నిబంధనలను వ్యతిరేకిస్తూ ఆయిల్ ట్రక్ డ్రైవర్లు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా పెట్రోలు బంకులకు జనం పోటెత్తారు. అయితే పెట్రోల్ లో బంక్ లు బంద్ కాలేదని, వాహనదారులు భయపడాల్సిన పనిలేదని బంక్ యాజమాన్యం క్లారిటీ ఇచ్చారు. ఇవి ఒట్టి పుకార్లే నని స్పష్టం చేశారు.
Read also: Chandrababu and Pawan Kalyan: కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు చంద్రబాబు, పవన్ కల్యాణ్..
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ఇక ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్ల సమ్మె కారణంగా రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. జనవరి 1 నుంచి ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సమ్మెకు దిగడంతో బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. దీంతో మంగళవారం హైదరాబాద్ నగరంలోని చాలావరకు పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. బంక్ ల ముందు నో స్టాక్ బోర్డులు పెట్టారు. అయితే, హైదరాబాద్లోని కొన్ని ఓపెన్ పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు పెట్రోల్ కోసం క్యూ కట్టారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా పెట్రోల్ బంకులను మూసివేయడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని కొన్ని ఓపెన్ పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యాన్లతో బారులు తీరడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది.
Read also: Chandrababu and Pawan Kalyan: కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు చంద్రబాబు, పవన్ కల్యాణ్..
కొన్ని చోట్ల పెట్రోల్ బంకుల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ఇంపోర్టెడ్ మోటార్ వెహికల్స్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ట్యాంకర్ డ్రైవర్లు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. వాహనాల యజమానులు, డ్రైవర్లు రోడ్లపై ప్రమాదానికి గురై పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతే.. వారికి పది లక్షల జరిమానా, ఏడేళ్ల జైలు శిక్ష విధించేలా ఇటీవల కేంద్ర ప్రభుత్వం చట్టంలో మార్పులు తీసుకొచ్చింది. అయితే ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదాల విషయంలోనూ ఇది వర్తింపజేయడంతో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆగ్రహించిన ట్యాంకర్ల యజమానులు కేంద్రం ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ పెట్రోల్ బంక్ లో నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో వాహనదారులు బంక్ లకు క్యూ కట్టారు. దీంతో పెట్రోట్ బంక్ లో భారీగా వాహనాలు దర్శనమిచ్చాయి.
UNESCO: మొదటి సారి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీకి భారత్ నాయకత్వం..
తాజావార్తలు
-
Allu Aravind: ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
-
Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?