Drugs: హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాచకొండలో మరొకసారి భారీగా డ్రగ్స్ ను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 80 గ్రాములు హైరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ కు చెందిన ఇద్దరు యువకులతో పాటు ఓ స్టూడెంట్ ను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి విద్యార్థులకు యువకులు అమ్ముతున్నారు.. అను ఇంజనీరింగ్ కాలేజీలకి డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బీ-ఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతున్న అశోక్ కుమార్ తో పాటు మరో మైనర్ అరెస్టు చేశారు. స్టూడెంటైన అశోక్ కుమార్, డ్రగ్స్ కు బానిసగా మారాడు.. ఆ తరువాత డ్రగ్స్ సేవిస్తూనే సరఫరాదారుడిగా మారాడు అని పోలీసులు పేర్కొన్నారు. అశోక్ కుమార్ తో పాటు అరెస్టైన మైనర్ కూడా డ్రగ్స్ పెడ్లర్ గా గుర్తించారు. వీరిద్దరూ రాజస్థాన్ ప్రాంతానికి చెందిన వారు అని రాచకొండ సీపీ సుధీర్ బాబు చెప్పారు.
Read Also: Flipkart Sale 2024: ఫ్లిప్కార్ట్లో ‘రిపబ్లిక్ డే’ సేల్.. ఈ మొబైల్స్పై భారీ తగ్గింపు!
Also Read
- 12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
- Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
అయితే, అశోక్ కుమార్ కుటుంబం హైదరాబాద్ కు వలస వచ్చింది అని సీపీ సుధీర్ బాబు చెప్పారు. లంగర్హౌజ్లో నివాసం ఉంటున్నారు.. రాజస్థాన్ లో హెరాయిన్ డ్రగ్ ను గ్రాముకు ఐదు వేల రూపాయలకు కొనుగోలు చేసి నగరానికి తీసుకువస్తున్న ఇద్దరు.. నగరంలో గ్రాము పది వేల నుంచి పన్నెండు వేలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.. పక్కా సమాచారంతో హయత్నగర్ లో అశోక్ తో పాటు మైనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 50 లక్షల రూపాయల విలువైన 80 గ్రాముల హెరాయిన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Mukesh Ambani: 2047 కల్లా 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్
ఇక, అశోక్ తో పాటు మరో మైనర్ మొదటిసారి పట్టుబడ్డారు అని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. లారీ డ్రైవర్లకు, స్టూడెంట్స్ కి విక్రయిస్తున్నారు.. గతంలో రెండు సార్లు రాజస్థాన్ నుండి తీసుకు వచ్చారు.. నిందితులకు కఠినంగా శిక్ష పడేందుకు అవసరమైన సాక్ష్యాధారాలను పకడ్భందిగా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామన్నారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే సమాచారం అందించండి.. ఈ కేసులో పదేళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉంది.. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళే, సరఫరాదారులుగా మారుతున్నారు.. ఇలా డ్రగ్స్ వినియోగాన్ని విస్తరిస్తున్నారు అని సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.
తాజావార్తలు
-
Murder Case: భార్యను కసితీరా చంపాడు.. 620కి.మీ ప్రయాణించి నాగపామును పట్టుకొచ్చి.. చివరికి..!
-
Chiru – Bobby : చిరంజీవి – బాబీ సినిమా మాస్ సాంగ్’కి పూనకాలే!
-
Pakistani Cinema: నెట్ఫ్లిక్స్తో భాగస్వామ్యానికి పాకిస్తాన్ ప్రయత్నాలు.. గ్లోబల్ స్ట్రీమింగ్పై ఫోకస్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Prabhas : ‘స్పిరిట్’కు బ్రేక్ ఇచ్చి ‘ఫౌజీ’ సెట్స్ లోకి ప్రభాస్
ట్రెండింగ్
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!