డ్రగ్స్ కేసులో ఇవాళ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు నార్కోటిక్ అధికారులు మోహిత్ ను ప్రశ్నించనున్నారు. ఎడ్విన్తో సంబంధాలపై కూపీ లాగనున్నారు. మోహిత్ కు 50 మంది ప్రముఖులతో కాంటాక్టులు ఉన్నాయని భావిస్తున్న అధికారులు వీటిపై ఆరా తీయనున్నారు.
దేశంలో నిరుద్యోగం, కరోనా కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, ధరల పెరుగుదల ఎలా వున్నా.. యువతను మత్తులో దించేందుకు ముఠాలు నిరంతరం పనిచేస్తున్నాయి. దేశాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ దందా నానాటికీ పెరిగిపోతోంది. ఎక్కడ అవకాశం వుంటే అక్కడ డ్రగ్స్ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. ఇప్పటికే భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు పట్టుబడిన గుజరాత్లో తాజాగా మరోమారు భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. గుజరాత్లో గురువారం నాడు 256 కిలోల హెరాయిన్ను నార్కోటిక్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో కీలక అంశాలు బయటకు రానున్నాయి. డ్రగ్స్ కేస్ లో ఇద్దరు నిందితులైన అభిషేక్, అనిల్ మొదటి రోజు కస్టడీ విచారణ పూర్తిచేశారు బంజారాహిల్స్ పోలీసులు. పబ్ మేనేజర్ అనిల్, పార్టనర్ అభిషేక్ లను విచారణ చేశారు పోలీసులు. ఆరు గంటలు విడివిడిగా ఇద్దరిని విచారణ చేశారు పోలీసులు. అనిల్, అభిషేక్ ల వ్యక్తి గత సమాచారం సేకరించిన పోలీసులు. వాటి గురించి ఆరా తీశారు.…