Medical Students Ganja Case: మెడిసిటీ మెడికోల గంజాయి కేసులో కొత్త కోణం..
- వందమందికిపైగా మెడికోల్లో గంజాయి వినియోగం
- ఈగల్ టీం షాకింగ్ నివేదిక
- సీనియర్లే జూనియర్లకు డ్రగ్స్ అలవాటు చేసి కాలేజీ సర్కిల్లో నెట్వర్క్
- డ్రగ్ పెడ్లర్ అరాఫత్.. బీదర్కు చెందిన మహిళా సరఫరాదారు జరీనా కస్టడీ లోకి
- ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులే టార్గెట్.. రూ.1.5 కోట్ల మాదక ద్రవ్య దందా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medical Students Ganja Case: నగరంలోని ప్రసిద్ధ మెడిసిటీ మెడికల్ కాలేజీ గంజాయి కేసు చుట్టూ సంచలన విషయాలు ఒక్కొటిగా బయటపడుతున్నాయి. మూడు సంవత్సరాలుగా మెడికోల్లో గంజాయి వినియోగం నానాటికీ పెరిగిపోతుండగా, తాజాగా ఈగల్ టీం జరిపిన దర్యాప్తులో ఈ వ్యవహారం మరింత లోతుగా ఉన్నట్లు స్పష్టమైంది. ఈగల్ టీం అందించిన సమాచారం ప్రకారం, ఈ కాలేజీలో దాదాపు వందమందికిపైగా మెడికోలు గంజాయి వాడుతున్నట్లు గుర్తించబడింది. అందులో 32 మంది మెడికోలు గత ఏడాది నుంచి రెగ్యులర్గా గంజాయి తీసుకుంటున్నట్టు ఆధారాలు లభించాయి.
Visakhapatnam Port Authority: విశాఖపట్నం పోర్ట్ మరో ఘనత.. భారత్లోనే ప్రథమ స్థానం..
Also Read
- Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
మరికొన్ని షాకింగ్ వివరాల్లో, సీనియర్ విద్యార్థులే జూనియర్లకు గంజాయి అలవాటు చేసి, వారినే వాడుకుని డ్రగ్స్ తెప్పించుకుంటున్నట్లు తేలింది. గంజాయి కోసం ఈ విద్యార్థులు తరచుగా క్యాంపస్ వదిలి సికింద్రాబాద్ వెళ్లి డ్రగ్స్ తెచ్చుకున్నట్లు ఈగల్ టీం తెలిపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డ్రగ్ పెడ్లర్ అరాఫత్ను పోలీసులు అరెస్టు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యక్తి మెడిసిటీ సహా పలు కాలేజీలకు గంజాయి సరఫరా చేస్తున్నాడని తెలుస్తోంది. అరాఫత్, కర్ణాటకలోని బీదర్కు చెందిన జరీనా అనే మహిళ నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నాడని ఈగల్ టీం గుర్తించింది.
జరీనాను కూడా అరెస్టు చేసిన పోలీసులు ఆమె వద్ద నుంచి ఆశ్చర్యకర విషయాలను వెలికితీశారు. ఆమె గత సంవత్సరం నుంచి సుమారు ₹1.5 కోట్ల విలువైన గంజాయి అమ్మి సంపాదించిందని, హైదరాబాద్ నగరంలో 51 మంది సభ్యులతో కూడిన పెద్ద డ్రగ్ నెట్వర్క్ను నడుపుతోందని సమాచారం. జరీనా తన ముఠాలోని డ్రగ్ పెడ్లర్లను ఇంజనీరింగ్ మరియు మెడికల్ కాలేజీల విద్యార్థులను టార్గెట్ చేసి, వారిలో డ్రగ్స్ అలవాటు చేయడానికి ఉపయోగించిందని తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఈ నెట్వర్క్ మొత్తం మీద దృష్టి సారించగా, ఇంకా కొందరు విద్యార్థులు, పెడ్లర్లను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
Jagga Reddy : లక్ష కోట్లలో 30% తినేసి.. హరీష్ రావు ప్రాజెక్టు దగ్గర పడుకున్నాడు
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!