Medical Students Ganja Case: మెడిసిటీ మెడికోల గంజాయి కేసులో కొత్త కోణం..
- వందమందికిపైగా మెడికోల్లో గంజాయి వినియోగం
- ఈగల్ టీం షాకింగ్ నివేదిక
- సీనియర్లే జూనియర్లకు డ్రగ్స్ అలవాటు చేసి కాలేజీ సర్కిల్లో నెట్వర్క్
- డ్రగ్ పెడ్లర్ అరాఫత్.. బీదర్కు చెందిన మహిళా సరఫరాదారు జరీనా కస్టడీ లోకి
- ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులే టార్గెట్.. రూ.1.5 కోట్ల మాదక ద్రవ్య దందా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medical Students Ganja Case: నగరంలోని ప్రసిద్ధ మెడిసిటీ మెడికల్ కాలేజీ గంజాయి కేసు చుట్టూ సంచలన విషయాలు ఒక్కొటిగా బయటపడుతున్నాయి. మూడు సంవత్సరాలుగా మెడికోల్లో గంజాయి వినియోగం నానాటికీ పెరిగిపోతుండగా, తాజాగా ఈగల్ టీం జరిపిన దర్యాప్తులో ఈ వ్యవహారం మరింత లోతుగా ఉన్నట్లు స్పష్టమైంది. ఈగల్ టీం అందించిన సమాచారం ప్రకారం, ఈ కాలేజీలో దాదాపు వందమందికిపైగా మెడికోలు గంజాయి వాడుతున్నట్లు గుర్తించబడింది. అందులో 32 మంది మెడికోలు గత ఏడాది నుంచి రెగ్యులర్గా గంజాయి తీసుకుంటున్నట్టు ఆధారాలు లభించాయి.
Visakhapatnam Port Authority: విశాఖపట్నం పోర్ట్ మరో ఘనత.. భారత్లోనే ప్రథమ స్థానం..
Also Read
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- School Van Hit by Train: ఘోర ప్రమాదం... స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
మరికొన్ని షాకింగ్ వివరాల్లో, సీనియర్ విద్యార్థులే జూనియర్లకు గంజాయి అలవాటు చేసి, వారినే వాడుకుని డ్రగ్స్ తెప్పించుకుంటున్నట్లు తేలింది. గంజాయి కోసం ఈ విద్యార్థులు తరచుగా క్యాంపస్ వదిలి సికింద్రాబాద్ వెళ్లి డ్రగ్స్ తెచ్చుకున్నట్లు ఈగల్ టీం తెలిపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డ్రగ్ పెడ్లర్ అరాఫత్ను పోలీసులు అరెస్టు చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యక్తి మెడిసిటీ సహా పలు కాలేజీలకు గంజాయి సరఫరా చేస్తున్నాడని తెలుస్తోంది. అరాఫత్, కర్ణాటకలోని బీదర్కు చెందిన జరీనా అనే మహిళ నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నాడని ఈగల్ టీం గుర్తించింది.
జరీనాను కూడా అరెస్టు చేసిన పోలీసులు ఆమె వద్ద నుంచి ఆశ్చర్యకర విషయాలను వెలికితీశారు. ఆమె గత సంవత్సరం నుంచి సుమారు ₹1.5 కోట్ల విలువైన గంజాయి అమ్మి సంపాదించిందని, హైదరాబాద్ నగరంలో 51 మంది సభ్యులతో కూడిన పెద్ద డ్రగ్ నెట్వర్క్ను నడుపుతోందని సమాచారం. జరీనా తన ముఠాలోని డ్రగ్ పెడ్లర్లను ఇంజనీరింగ్ మరియు మెడికల్ కాలేజీల విద్యార్థులను టార్గెట్ చేసి, వారిలో డ్రగ్స్ అలవాటు చేయడానికి ఉపయోగించిందని తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఈ నెట్వర్క్ మొత్తం మీద దృష్టి సారించగా, ఇంకా కొందరు విద్యార్థులు, పెడ్లర్లను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
Jagga Reddy : లక్ష కోట్లలో 30% తినేసి.. హరీష్ రావు ప్రాజెక్టు దగ్గర పడుకున్నాడు
తాజావార్తలు
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
-
Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
-
Jani Master: ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. జానీ మాస్టర్కు ఊహించని షాక్!
-
Hombale Films: ‘కేజీఎఫ్’ నుంచి ‘మహా అవతార్’ వరకు.. హోంబలే ఫిల్మ్స్ భారీ ప్లాన్తో ఇండియన్ సినిమాకు కొత్త దిశ
-
RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!