Drugs : డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అరెస్ట్
- బెంగుళూరు నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి నగరంలో విక్రయిస్తున్న నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు
- వీరి వద్ద నుంచి 6.65 గ్రాముల ఎండీ ఎమ్ఏ డ్రగ్స్, 2.27 గ్రాముల గంజాయి, 8.57 గ్రాముల హ్యష్ ఆయిల్ స్వాధీనం
- నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అరెస్ట్
Drugs : అమీర్పేట్ ఎక్సైజ్ పోలీసులు బెంగుళూరు నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి నగరంలో విక్రయిస్తున్న నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరి వద్ద నుంచి 6.65 గ్రాముల ఎండీ ఎమ్ఏ డ్రగ్స్, 2.27 గ్రాముల గంజాయి, 8.57 గ్రాముల హ్యష్ ఆయిల్ మరియు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వివరాల ప్రకారం, కేరళకు చెందిన సంజయ్, శ్రీజిత్, ఆదర్శ్ అనే యువకులు ఎస్ఆర్ నగర్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నారు. వీరు ఆఫీస్ సమీపంలోని ఓ బాయ్స్ హాస్టల్లో నివసిస్తూ డ్రగ్స్ వ్యాపారంలో పాల్గొన్నారు.
CM Chandrababu: పీడీఎస్ అక్రమ రవాణాపై ప్రభుత్వం సీరియస్.. సీఎం కీలక ఆదేశాలు
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
వీరి డ్రగ్స్ వ్యాపారం అనుసంధానంగా, హైదరాబాద్లోని న్యూబోయిన్పల్లికి చెందిన అజయ్ అనే వ్యక్తితో వీరి పరిచయం ఏర్పడింది. డ్రగ్స్ వినియోగానికి బానిసలుగా మారిన వీరు, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ను నగరానికి రహస్యంగా తీసుకొచ్చి విక్రయానికి సిద్ధమయ్యారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసులు ప్రత్యేక దాడులు చేపట్టి, ఈ నలుగురిని డిసెంబర్ 11న అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఆపరేషన్లో సబ్ ఇన్స్పెక్టర్లు రాధ, బాలరాజు, బిక్షారెడ్డి ముఖ్య పాత్ర పోషించారు.
అదేవిధంగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చడంపై దృష్టి సారించారు. ఆయన, డ్రగ్స్ వినియోగం మరియు విక్రయం నివారించేందుకు, ఉక్కుపాదంతో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు సినిమా తారలను సైతం కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి మరియు అల్లు అర్జున్ వంటి ప్రముఖులు డ్రగ్స్ వల్ల కలిగే వీడియోలు రూపొందించి విడుదల చేశారు. ఈ చర్యలు డ్రగ్స్ సమస్యను అరికట్టడంలో కీలకమవుతాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!