Drugs : డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అరెస్ట్
- బెంగుళూరు నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి నగరంలో విక్రయిస్తున్న నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు
- వీరి వద్ద నుంచి 6.65 గ్రాముల ఎండీ ఎమ్ఏ డ్రగ్స్, 2.27 గ్రాముల గంజాయి, 8.57 గ్రాముల హ్యష్ ఆయిల్ స్వాధీనం
- నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drugs : అమీర్పేట్ ఎక్సైజ్ పోలీసులు బెంగుళూరు నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి నగరంలో విక్రయిస్తున్న నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరి వద్ద నుంచి 6.65 గ్రాముల ఎండీ ఎమ్ఏ డ్రగ్స్, 2.27 గ్రాముల గంజాయి, 8.57 గ్రాముల హ్యష్ ఆయిల్ మరియు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వివరాల ప్రకారం, కేరళకు చెందిన సంజయ్, శ్రీజిత్, ఆదర్శ్ అనే యువకులు ఎస్ఆర్ నగర్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నారు. వీరు ఆఫీస్ సమీపంలోని ఓ బాయ్స్ హాస్టల్లో నివసిస్తూ డ్రగ్స్ వ్యాపారంలో పాల్గొన్నారు.
CM Chandrababu: పీడీఎస్ అక్రమ రవాణాపై ప్రభుత్వం సీరియస్.. సీఎం కీలక ఆదేశాలు
Also Read
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
వీరి డ్రగ్స్ వ్యాపారం అనుసంధానంగా, హైదరాబాద్లోని న్యూబోయిన్పల్లికి చెందిన అజయ్ అనే వ్యక్తితో వీరి పరిచయం ఏర్పడింది. డ్రగ్స్ వినియోగానికి బానిసలుగా మారిన వీరు, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ను నగరానికి రహస్యంగా తీసుకొచ్చి విక్రయానికి సిద్ధమయ్యారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసులు ప్రత్యేక దాడులు చేపట్టి, ఈ నలుగురిని డిసెంబర్ 11న అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఆపరేషన్లో సబ్ ఇన్స్పెక్టర్లు రాధ, బాలరాజు, బిక్షారెడ్డి ముఖ్య పాత్ర పోషించారు.
అదేవిధంగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చడంపై దృష్టి సారించారు. ఆయన, డ్రగ్స్ వినియోగం మరియు విక్రయం నివారించేందుకు, ఉక్కుపాదంతో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు సినిమా తారలను సైతం కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి మరియు అల్లు అర్జున్ వంటి ప్రముఖులు డ్రగ్స్ వల్ల కలిగే వీడియోలు రూపొందించి విడుదల చేశారు. ఈ చర్యలు డ్రగ్స్ సమస్యను అరికట్టడంలో కీలకమవుతాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది.
తాజావార్తలు
-
Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..