Drugs : డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అరెస్ట్
- బెంగుళూరు నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి నగరంలో విక్రయిస్తున్న నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు
- వీరి వద్ద నుంచి 6.65 గ్రాముల ఎండీ ఎమ్ఏ డ్రగ్స్, 2.27 గ్రాముల గంజాయి, 8.57 గ్రాముల హ్యష్ ఆయిల్ స్వాధీనం
- నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drugs : అమీర్పేట్ ఎక్సైజ్ పోలీసులు బెంగుళూరు నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి నగరంలో విక్రయిస్తున్న నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరి వద్ద నుంచి 6.65 గ్రాముల ఎండీ ఎమ్ఏ డ్రగ్స్, 2.27 గ్రాముల గంజాయి, 8.57 గ్రాముల హ్యష్ ఆయిల్ మరియు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వివరాల ప్రకారం, కేరళకు చెందిన సంజయ్, శ్రీజిత్, ఆదర్శ్ అనే యువకులు ఎస్ఆర్ నగర్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నారు. వీరు ఆఫీస్ సమీపంలోని ఓ బాయ్స్ హాస్టల్లో నివసిస్తూ డ్రగ్స్ వ్యాపారంలో పాల్గొన్నారు.
CM Chandrababu: పీడీఎస్ అక్రమ రవాణాపై ప్రభుత్వం సీరియస్.. సీఎం కీలక ఆదేశాలు
Also Read
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్గా మారిన స్వీట్!
- Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
- iPhone 17 Pro Discount: ఐఫోన్ 17 ప్రోపై ఊహించని డిస్కౌంట్.. రూ.69,990కే సొంతం చేసుకునే ఛాన్స్!
- BYD Denza India Launch: భారత్లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
వీరి డ్రగ్స్ వ్యాపారం అనుసంధానంగా, హైదరాబాద్లోని న్యూబోయిన్పల్లికి చెందిన అజయ్ అనే వ్యక్తితో వీరి పరిచయం ఏర్పడింది. డ్రగ్స్ వినియోగానికి బానిసలుగా మారిన వీరు, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ను నగరానికి రహస్యంగా తీసుకొచ్చి విక్రయానికి సిద్ధమయ్యారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసులు ప్రత్యేక దాడులు చేపట్టి, ఈ నలుగురిని డిసెంబర్ 11న అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఆపరేషన్లో సబ్ ఇన్స్పెక్టర్లు రాధ, బాలరాజు, బిక్షారెడ్డి ముఖ్య పాత్ర పోషించారు.
అదేవిధంగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చడంపై దృష్టి సారించారు. ఆయన, డ్రగ్స్ వినియోగం మరియు విక్రయం నివారించేందుకు, ఉక్కుపాదంతో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు సినిమా తారలను సైతం కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి మరియు అల్లు అర్జున్ వంటి ప్రముఖులు డ్రగ్స్ వల్ల కలిగే వీడియోలు రూపొందించి విడుదల చేశారు. ఈ చర్యలు డ్రగ్స్ సమస్యను అరికట్టడంలో కీలకమవుతాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది.
తాజావార్తలు
-
Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
-
Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్లో నాని కొత్త సినిమా!
-
Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్గా మారిన స్వీట్!
-
Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
ట్రెండింగ్
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!