Drugs : డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అరెస్ట్
- బెంగుళూరు నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి నగరంలో విక్రయిస్తున్న నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు
- వీరి వద్ద నుంచి 6.65 గ్రాముల ఎండీ ఎమ్ఏ డ్రగ్స్, 2.27 గ్రాముల గంజాయి, 8.57 గ్రాముల హ్యష్ ఆయిల్ స్వాధీనం
- నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drugs : అమీర్పేట్ ఎక్సైజ్ పోలీసులు బెంగుళూరు నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి నగరంలో విక్రయిస్తున్న నలుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరి వద్ద నుంచి 6.65 గ్రాముల ఎండీ ఎమ్ఏ డ్రగ్స్, 2.27 గ్రాముల గంజాయి, 8.57 గ్రాముల హ్యష్ ఆయిల్ మరియు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వివరాల ప్రకారం, కేరళకు చెందిన సంజయ్, శ్రీజిత్, ఆదర్శ్ అనే యువకులు ఎస్ఆర్ నగర్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నారు. వీరు ఆఫీస్ సమీపంలోని ఓ బాయ్స్ హాస్టల్లో నివసిస్తూ డ్రగ్స్ వ్యాపారంలో పాల్గొన్నారు.
CM Chandrababu: పీడీఎస్ అక్రమ రవాణాపై ప్రభుత్వం సీరియస్.. సీఎం కీలక ఆదేశాలు
Also Read
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
- 185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
- 9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
వీరి డ్రగ్స్ వ్యాపారం అనుసంధానంగా, హైదరాబాద్లోని న్యూబోయిన్పల్లికి చెందిన అజయ్ అనే వ్యక్తితో వీరి పరిచయం ఏర్పడింది. డ్రగ్స్ వినియోగానికి బానిసలుగా మారిన వీరు, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ను నగరానికి రహస్యంగా తీసుకొచ్చి విక్రయానికి సిద్ధమయ్యారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసులు ప్రత్యేక దాడులు చేపట్టి, ఈ నలుగురిని డిసెంబర్ 11న అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఆపరేషన్లో సబ్ ఇన్స్పెక్టర్లు రాధ, బాలరాజు, బిక్షారెడ్డి ముఖ్య పాత్ర పోషించారు.
అదేవిధంగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చడంపై దృష్టి సారించారు. ఆయన, డ్రగ్స్ వినియోగం మరియు విక్రయం నివారించేందుకు, ఉక్కుపాదంతో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు సినిమా తారలను సైతం కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి మరియు అల్లు అర్జున్ వంటి ప్రముఖులు డ్రగ్స్ వల్ల కలిగే వీడియోలు రూపొందించి విడుదల చేశారు. ఈ చర్యలు డ్రగ్స్ సమస్యను అరికట్టడంలో కీలకమవుతాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది.
తాజావార్తలు
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
-
Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
-
Jani Master: ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. జానీ మాస్టర్కు ఊహించని షాక్!
-
Hombale Films: ‘కేజీఎఫ్’ నుంచి ‘మహా అవతార్’ వరకు.. హోంబలే ఫిల్మ్స్ భారీ ప్లాన్తో ఇండియన్ సినిమాకు కొత్త దిశ
-
RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!