Priyanka Gandhi: ఆయన సర్టిఫికెట్ మాకు అవసరం లేదు.. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ కౌంటర్
- మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ కౌంటర్
- సర్టిఫికెట్ మాకు అవసరం లేదని వ్యాఖ్య
- పోలీసుల చర్యలపై అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జెన్-జీ యువతకు మద్దతుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ స్పందించారు. జెన్-జీ యువతకు మోహన్ భగవత్ నుంచి ఎలాంటి ధ్రువీకరణ అవసరం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన ప్రియాంక గాంధీ.. ‘‘వారికి మోహన్ భగవత్ నుంచి ఎలాంటి సర్టిఫికెట్ అవసరం లేదు.’’ అని వ్యాఖ్యానించారు.
జూలై 20న పేపర్ లీకేజీ అంశంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అమిత్ షా భయపడుతున్నారని, అందుకే ఆయన ఉభయ సభలకు రావడం లేదని ఆరోపించారు. ‘‘ఆయన వచ్చి ప్రకటన చేయాలి. అందులో సమస్య ఏముంది? ఏదైనా తప్పు జరిగితే బాధ్యత తీసుకోవాలి.’’ అని డిమాండ్ చేశారు.
Also Read
- Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
- Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
మోహన్ భగవత్ గురువారం జెన్-జీ యువతకు మద్దతుగా కీలక వ్యాఖ్యలు చేశారు. యువత చేస్తున్న ఆందోళనలను దేశ వ్యతిరేక చర్యలుగా చూడకూడదన్నారు. వారి సమస్యలు నిజమైనవేనని, యువత నిజాయితీపై తనకు నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఐఐఎంయూఎన్ 15వ వార్షికోత్సవ కార్యక్రమంలో సుమారు 2,000 మంది జెన్-జీ, జెన్-ఆల్ఫా యువతను ఉద్దేశించి భగవత్ మాట్లాడారు. ‘‘నిరసన కూడా సంభాషణకు ఒక మార్గం. ప్రజాస్వామ్యంలో నిరసన అనేది ఏకాభిప్రాయం సాధించే విధానం. భిన్నమైన అభిప్రాయాలు చర్చల ద్వారా కలిసినప్పుడు ఏకాభిప్రాయం ఏర్పడుతుంది.’’ అని అన్నారు. జెన్-జీ యువత ఆందోళన చేస్తే వారు దేశ వ్యతిరేకులు కాదని.. వారు మనవాళ్లు.. మన తర్వాతి తరం. వారితో చర్చలు జరపాలి, సత్సంబంధాలు కొనసాగించాలని స్పష్టం చేశారు.
NEET పేపర్ లీకేజీ ఆరోపణలపై కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థుల ఆందోళనలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో భగవత్ జెన్-జీ, జెన్-ఆల్ఫా యువతతో నిర్వహించిన ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. జెన్-జీ అంటే సాధారణంగా 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని, జెన్-ఆల్ఫా అంటే 2013 నుంచి 2025 మధ్య జన్మించిన వారిని సూచిస్తారు.
ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్ల అంశంపైనా మోహన్ భగవత్ స్పందించారు. సామాజిక వివక్షకు గురైన వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించేందుకే రిజర్వేషన్ వ్యవస్థను తీసుకొచ్చారని తెలిపారు. సమాజంలో అసమానతలు కొనసాగుతున్నంత కాలం రిజర్వేషన్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సూచనలను నిజాయితీగా పాటిస్తే ఎలాంటి సమస్య ఉండదని.. సామాజిక వివక్షను ఎదుర్కొనేందుకే రిజర్వేషన్ తీసుకొచ్చారని.. సామాజిక వివక్ష ఉన్నంత కాలం రిజర్వేషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. అయితే రిజర్వేషన్ ద్వారా ఇప్పటికే అభివృద్ధి సాధించిన వారు మరింత ప్రయోజనాలను వదులుకుని, అదే అవకాశాలను ఇతర వెనుకబడిన వర్గాలకు అందించే విషయాన్ని కూడా ఆలోచించాలని మోహన్ భగవత్ సూచించారు.
తాజావార్తలు
-
Priyanka Gandhi: ఆయన సర్టిఫికెట్ మాకు అవసరం లేదు.. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ కౌంటర్
-
Mohammed Siraj: కొలంబోలో ‘డీఎస్పీ సాబ్’ రచ్చ.. సరికొత్త లుక్తో మైదానంలో మెరిసిన సిరాజ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్తో కొత్త స్మార్ట్ టీవీ
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!