ఏడు జిల్లాల పరిధిలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దూరదృష్టితో కొత్త ప్రణాళికలు రూపొందించి, తదనుగుణంగా పనులు చేపట్టాలని శుక్రవారం తొలిసారిగా అమీర్పేటలోని హెచ్ఎండీఏ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి అన్నారు. ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ హెచ్ఎండీఏ కార్యాచరణ ప్రణాళికలను మంత్రికి వివరించారు. దేశంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి దిశగా ప్రయాణిస్తోందని ఆయన అన్నారు. తెలంగాణాకు హైదరాబాద్ మణిహారంగా…
హెచ్ఎండీఏ పరిధిలో చేపట్టిన అక్రమ నిర్మాణాల పునాదులు కదులుతున్నాయి. హెచ్ఎండీఏ అధికారులు తగ్గేదే లే అన్నట్లుగా అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్నారు. అయితే తాజాగా బోడుప్పల్ లో రెండు, దమ్మాయిగూడలో ఒక అక్రమ నిర్మాణాన్ని అధికారులు కూల్చివేశారు. ఇప్పటివరకు 158 అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ, టాస్క్ ఫోర్స్ చర్యలు చేపట్టింది. గత కొన్ని వారాలుగా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, హెచ్ఎండీఏ యంత్రాంగం సంయుక్తంగా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాద మోపుతున్నారు. అందులో భాగంగా బుధవారం రెండు మున్సిపాలిటీల పరిధిలో…
నిర్దిష్టమైన అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలు, గోదాములు వంటి అక్రమ నిర్మాణాలపై కూల్చివేత చర్యలు కొనసాగుతున్నాయి. మున్సిపల్ చట్టం పరిధికి లోబడి అక్రమ నిర్మాణాలపై జిల్లా టాస్క్ ఫోర్స్ బృందాలు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఎ) ప్లానింగ్ అధికారులు, హెచ్ఎండీఏ ఎన్ ఫోర్స్ మెంట్ యంత్రాంగం సంయుక్తంగా నిర్వహిస్తున్న కూల్చివేత చర్యల్లో భాగంగా గురువారం నాల్గవ రోజు ఐదు మున్సిపాలిటీల పరిధిలో 12 పెద్ద అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారు. మొత్తంగా గత నాలుగు…
అక్రమ నిర్మాణాలపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) తగ్గేదేలే అంటోంది. నార్సింగి మునిసిపల్ గౌలిదొడ్డిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన యజమానుల గుండెల్లో హెచ్ ఎండీఏ అధికారులు రైళ్లు పరిగెత్తిస్తున్నారు. 111 జీవోకు తూట్లు పెట్టి యజమానులు బహుళ అంతస్తు భవనాలు నిర్మించారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారు. 111 జీవోలో జీ+1 మాత్రమే అనుమతులు ఉండగా, జీ+6 బహుళ అంతస్తుల భవనాలను బిల్డర్స్ చేపట్టారు. పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా నార్సింగి కమీషనర్,…
హైదరాబాద్ లోని కోకాపేట్ భూముల అమ్మకానికి కేసీఆర్ సర్కార్ అనుమతినిచ్చింది. కోకాపేట్ నియో పోలీస్ లోని భూముల వేలానికి హెచ్ ఎండీఏ కు అప్పగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. 239, 240 సర్వే నంబర్ల లోని భూమి పై హక్కులు పూర్తి గా ప్రభుత్వానివేనని నిర్ధారణ అయింది. తెలంగాణ రాష్ట్రప్రభుత్వ ఏజెంట్ గా హెచ్ ఎండీఏ ఈ భూముల వేలం నిర్వహించనున్నది. వేలంలో.. భూములు కొన్న బిల్డర్లకు రిజిస్ట్రేషన్లు చేయాలని రంగారెడ్డి.. కలెక్టరెట్కు…
అక్రమ విల్లాలపై హైదరాబాద్ మున్సిపల్ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. దుడింగల్ మల్లంపేటలో అక్రమ విల్లాలపై ప్రభుత్వం సీరియస్ అవడంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెలాఖరులోగా అక్రమ విల్లాలపై పూర్తిస్థాయి రిపోర్ట్ ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్కు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మల్లంపేటలోని లక్ష్మీశ్రీనివాస్ పేరుతో 65 విల్లాలకే హెచ్ఎండీఏ అనుమతి ఇచ్చింది. అయితే 260 విల్లాలకు అనుమతి ఉందంటూ లక్ష్మీశ్రీనివాస్ సంస్థ నకిలీ పత్రాలు సృష్టించింది. అంతేకాకుండా 325 విల్లాలు…
మహానగరంలో మాయగాళ్లకు కొదవేలేదు అంటుంటారు. ఎందుకంటే.. రోజురోజుకు భాగ్యనగరంలో కొత్తకొత్త రూపాల్లో మోసాలు వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి. అందులో అక్రమ నిర్మాణాలు కూడా ఒకటి. అయితే హైదరాబాద్లో నకిలీ ధృవప్రతాలు సృష్టించి అక్రమ నిర్మాణాలు చేస్తున్న వారిపై హెచ్ఎండీఏ ప్రత్యేక దృష్టి సారించింది. హెచ్ఎండీఏ పరిధిలో అక్రమ కట్టడాల పై కొరడా ఝుళిపించేందుకు అధికార యంత్రాగాన్ని సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 30 లోపు అక్రమ కట్టడాలను గుర్తించి కూల్చివేయాలని హెచ్ఎండీఏ పరిధిలోని మునిసిపల్ కమిషనర్…
ఉప్పల్ భగాయత్ మూడో దశ వేలంలోనూ హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు ఊహించని రీతిలో కాసుల వర్షం కురిపిస్తోంది. తొలిరోజు వేలంలో అధికారుల అంచనాలు దాటేస్తూ మూసీ తీరాన ప్లాట్లు గతంలో కంటే భారీ స్థాయిలో ధరలు పలికాయి. జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాలతో పోటీ పడుతూ ఉప్పల్లోనూ రెండు ప్లాట్లు చదరపు గజానికి రూ.1.01లక్షల చొప్పున ధర పలకడం గమనార్హం. మూడో దశలో మొత్తం 44 ప్లాట్లలో తొలిరోజు 23 ప్లాట్లకు వేలం జరిగింది. కేంద్ర ప్రభుత్వ…
హైదరాబాద్ నగరంలో మీరు పార్కులకు వెళ్తున్నారా? అయితే మీ కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) శుభవార్త తెలిపింది. సంజీవయ్య, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్స్కు వెళ్లే పర్యాటకుల వద్ద కెమెరాల కోసం ఇకపై ఫీజులు వసూలు చేయబోమని HMDA వెల్లడించింది. గతంలో ఈ మూడు పార్కుల్లోకి కెమెరాతో వెళ్తే అదనంగా రూ.1000 వసూలు చేసేవారు. ఇప్పుడు కెమెరాలకు, వీడియో కెమెరాలకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని HMDA ప్రకటించింది. ప్రజల విజ్ఞప్తుల మేరకు…
కోకాపేట భూముల వేలానికి అనూహ్య స్పందన వచ్చింది… హెచ్ఎండీఏ భూములు వేలం వేయగా… అధికారులు అంచనా వేసినకంటే ఎక్కువ ధరకు అమ్ముడు పోయాయి.. కోకాపేటలోని 49.92 ఎకరాలను ఎంఎస్టీసీ వెబ్సైట్ ద్వారా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) వేలం నిర్వహించింది.. ఒక్కో ఎకరం కనీస ధర రూ.25 కోట్లుగా నిర్ధారించగా.. వేలంలో రూ.60 కోట్లు పలకింది.. అత్యధికంగా ఎకరాకు రూ. 60.2 కోట్లు ధర పలకగా.. అత్యల్పంగా ఎకరానికి రూ. 31.2 కోట్లు వెచ్చించారు.. అవరెజిగా ఎకరానికి…