కర్నూలు, కడప, అనంతపురం-హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలపై ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అందులో భాగంగా ఈ రోజు కర్నూలు, కడప, అనంతపురం-హిందూపురం యూడీఏలపై సమీక్ష నిర్వహించారు మంత్రి నారాయణ.. ఆయా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల (యూడీఏ) పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై సంబంధిత అధికారులకు దిశానిర్ధేశం చేశారు మంత్రి నారాయణ..
బాలయ్య మంత్రాంగం ఫలించడంతో.. హిందూపురం మున్సిపాలిటీని టీడీపీ కూటమి కైవసం చేసుకోనుంది.. మున్సిపాల్టీలో మొత్తం కౌన్సిలర్ల సంఖ్య 38గా ఉండగా.. ఇప్పుడు టీడీపీ కూటమి బలం 20కి చేరింది.. దీంతో.. మున్సిపల్చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు ఇంద్రజ.. రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ కు అందజేశారు..
పేదలకు అన్న క్యాంటీన్ కడుపు నింపుతుంది.. అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభం అవ్వడం ఒక పండగ లాంటిది అన్నారు నటసింహా, హిందపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. శ్రీ సత్యసాయి జిల్లాలోని తన సొంత నియోజకవర్గం హిందూపురంలో ప్రభుత్వాసుపత్రి ఆవరణంలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు ఎమ్మెల్యే బాలకృష్ణ.
First Anna Canteen Re Opened at Hindupur Balakrishna Birthday: నరసింహ నందమూరి బాలకృష్ణ ఈరోజు తన 64వ పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఈ మధ్య హిందూపురం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒకపక్క సినిమాలతో మరొకపక్క రాజకీయాలతో ఫుల్ జోష్ లో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణకు ఆయన అభిమానులు మాత్రమే కాదు సినీ రంగానికి చెందిన వారు రాజకీయ రంగానికి చెందిన వారు పెద్ద ఎత్తున పుట్టినరోజు…
ఈ రోజు ఉదయం 10 గంటలకు హిందూపురంలోని అంబేడ్కర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగించనున్న జగన్.. మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు లోక్సభ స్థానం పరిధిలోని పలమనేరులో పర్యటిస్తారు.. స్థానిక బస్టాండ్ సెంటర్లో జరిగే సభకు హాజరై సభనుద్దేశించి ప్రసంగించనున్నారు.. ఇక, ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలోని నెల్లూరు సిటీలో జగన్ పర్యటన కొనసాగనుంది.. గాంధీ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు…
నామినేషన్ పత్రాల్లో నందమూరి బాలకృష్ణ పేర్కొన్నప్రకారం ఆయనకు రూ.9 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి.. ఎన్నికల అఫిడవిట్లో బాలయ్య చూపిన ఆస్తుల వివరాల విషయానికి వస్తే.. బాలకృష్ణ ఆస్తుల విలువ రూ.81 కోట్ల 63 లక్షలు... ఆయన భార్య వసుంధర ఆస్తుల విలువ రూ.140 కోట్ల 38 లక్షల 83 వేలు.. ఇక, ఆయన కుమారుడు మోక్షజ్ఞ ఆస్తుల విలువ రూ.58 కోట్ల 63 లక్షల 66 వేలుగా ఉంది..
హిందూపురం పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులను కూడా ప్రకటించారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెనుకబడిన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి.. కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపిక హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని.. హిందూపురం పార్లమెంటు నుంచి బోయ-వాల్మికి సామాజిక వర్గానికి చెందిన శాంత బరిలో ఉంటారని వెల్లడించారు.