Vishnuvardhan Reddy: 30 ఏళ్లుగా పార్టీ కోసం పని చేశా.. అధిష్టానం ఆదేశిస్తే హిందూపురం నుంచి పోటీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishnuvardhan Reddy: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే హిందూపురం లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తాను అని ప్రకటించారు.. ఒక సామాన్య కార్యకర్తగా బీజేపీలో ఉంటూ.. గత 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నానన్న ఆయన.. స్థానికుడైన తనకు హిందూపురం ఎంపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తాను అన్నారు.. టిక్కెట్ కోసంఅడిగే హక్కు ఎవరికైనా ఉంటుందన్నారు విష్ణువర్ధన్రెడ్డి.. హిందూపురం పోటీ చేయాలన్న ఆ ఆలోచనను.. నా అభిమానులు, పార్టీ కార్యకర్తలు, రాష్ట్ర నాయకత్వంతో పాటు కేంద్ర నాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లానని తెలిపారు. అయితే, నేను పోటీ చేసే విషయంపై పార్టీ అధిష్టానం ఫైనల్గా నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అయితే, పొత్తులు కుదరకపోయినా.. మీరు బీజేపీ అభ్యర్థిగా.. ఒంటరిగా హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా? అంటూ మీడియా ప్రశ్నించగా.. ఆయన స్పందిస్తూ.. మా అభిప్రాయాన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్లాం.. పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటానని వెల్లడించారు విష్ణువర్ధన్రెడ్డి.
Read Also: Maratha Reservation Protest: మహారాష్ట్రలో రిజర్వేషన్ మంటలు.. బస్సును తగలబెట్టిన నిరసనకారులు
Also Read
కాగా, ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే ఎన్నికలు జరగనుండగా.. టీడీపీ-జనసేన పార్టీలకు చెందిన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్.. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఉమ్మడిగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన విషయం విదితమే.. బీజేపీతో పొత్తు కోసం ఇరు పార్టీలు ప్రయత్నాలు చేస్తుండగా.. బీజేపీ అధిష్టానం నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.. ఈ నేపథ్యంలో.. ఓ ముందడుగు వేసిన టీడీపీ-జనసేన.. తొలి జాబితాను విడుదల చేయడంతో బీజేపీపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తుందనే చర్చ సాగుతోంది.
తాజావార్తలు
-
Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
-
Income Tax Notice: ఇదెక్కడి పాపం.. రోజుకు రూ.400 సంపాదించే కూలీకి ఐటీ శాఖ షాక్! అసలు ట్విస్ట్ ఇదే
-
SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
-
IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇక వేగంగా తత్కాల్!
-
Mudragada Padmanabham: ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!