దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో వాన పడుతోంది. ప్రస్తుతం ఢిల్లీ-ఎన్సీఆర్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి వర్షం పడడంతో ఉద్యోగులు డ్యూటీలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఇక రోడ్లపై నీళ్లు చేరడంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఉత్తరాఖండ్లో ప్రకృతి విలయతాండవం వేసింది. ఓ వైపు భారీ వర్షాలు.. ఇంకోవైపు భారీ హిమపాతం.. దీంతో ఉత్తరాఖండ్ అల్లాడిపోయింది. ఎటుచూసినా భారీగా మంచు పేరుకుపోయింది. అయితే చమోలి జిల్లాలో హిమపాతంలో చిక్కుకుని 57 మంది కార్మికులు సమాధి అయ్యారు.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షంతో పాటు హిమపాతం కురిసే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్రాల జాబితాను విడుదల చేసింది.
Saudi Arabia: ఎడారితో నిండి ఉండే సౌదీ అరేబియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పవిత్ర నగరాలైన మక్కా, మదీనా, జెడ్డా నగరాలు జలాశయాలను తలపిస్తున్నాయి. రోడ్లన్ని నీటిలో నిండిపోయాయి. మక్కా నగరంలోని పలు అపార్ట్మెంట్లలోకి నీరు చేరింది. వర్షాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. లగ్జరీ కార్లు వరద నీటిలో మునిపోయాయి.
హైదరాబాద్లో భారీ వర్షం పడుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నగరంలో వాన దంచికొడుతుంది. అబిడ్స్, కోఠి, నాంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం పైపు దూసుకొస్తోంది. ఇది బుధవారం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. రానున్న 24 గంటల్లో తమిళనాడు,ఏపీ తీరం పైపు వెళ్లే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
Weather Updates : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో మరో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం, ఆగ్నేయ బంగాళాఖాతం , దానిని ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రంలో ఉపరితల ఆవర్తనం నేడు అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఈ వ్యవస్థ పశ్చిమ-వాయువ్య దిశలో కదులుతుందని అంచనా వేయబడింది , డిసెంబర్ 12 నాటికి శ్రీలంక , తమిళనాడు తీరాలకు చేరుకోవచ్చు. ఈ పరిణామం తమిళనాడు , ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో రాబోయే కొద్ది…
అనంతపురం జిల్లా కుందుర్పి మండలం రుద్రంపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని రుద్రంపల్లి గ్రామంలో పాత మిద్దె కూలి ముగ్గురు మృతి చెందారు. వర్షానికి నాని పాత మిద్దె కూలినట్లు స్థానికులు చెబుతున్నారు.
Cyclone Fengal: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు (బుధవారం) తుఫానుగా మారుతుంది. దీంతో తమిళనాడు, పుదుచ్చరిలకు భారత వాతవావరణ శాఖ రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది.
దక్షిణాదిలోని పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఇప్పటికే తమిళనాడు, కేరళ సహా పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా శనివారం, ఆదివారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది.