Rail Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- బలమైన ఈదురు గాలులు, ఉరుములకు అవకాశం
- రాళ్ల వర్షం ముప్పు.. జాగ్రత్త అవసరమన్న వాతావరణ కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rail Alert : తెలంగాణ రాష్ట్రంలో రాగల కొద్ది గంటల్లో వాతావరణం పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ నగరంతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (ప్రస్తుత హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలు), మెదక్, మహబూబ్నగర్, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా, ఈ ప్రాంతాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈదురు గాలుల కారణంగా చెట్లు విరిగిపడే ప్రమాదం, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Riyan Parag: వరుసగా ఆరు సిక్స్లు బాదిన రియాన్ పరాగ్.. వీడియో వైరల్!
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
మరికొన్ని జిల్లాలైన మెదక్, సిద్ధిపేట, సిరిసిల్ల, కామారెడ్డిలో వాతావరణం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అంతేకాకుండా, ఈ ప్రాంతాల్లో రాళ్ల వర్షం కురిసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపింది. రాళ్ల వర్షం పంటలకు , ఆస్తికి నష్టం కలిగించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగటిపూట ఎండలు తీవ్రంగా ఉంటుండగా, సాయంత్రం నుండి అనేక జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వానలు కురుస్తున్నాయి. పిడుగులు పడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా బలమైన గాలులు , ఉరుములతో కూడిన వర్షం సమయంలో సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని సూచిస్తున్నారు. చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదని హెచ్చరిస్తున్నారు. రాళ్ల వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.
Mangoes: ఇలాంటి మామిడి పండ్లు తింటున్నారా? మీకు క్యాన్సర్ ముప్పు తప్పదు?
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!