మంత్రి హరీశ్రావు వరంగల్ పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ , రేపు ఉమ్మడి జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాలను సమీక్షించడానికి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్రావు పర్యటిస్తారు. మంత్రి హరీష్ రావ్ షెడ్యూల్ : * ఇవాళ ఉదయం 10:30 గంటలకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రి ప్రారంభంతోపాటు, మరో 50 పడకల ఆయూష్ ఆసుపత్రి నిర్మాణం, డయాగ్నోస్టిక్ హబ్, 20 పడకల న్యూబర్న్ కేర్ యూనిట్కు శంకుస్థాపన చేస్తారు.…
తెలంగాణలో ఒకప్పుడు నీటికొరత తీవ్రంగా వుండేది. తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తాగునీరు, సాగునీరు పుష్కలంగా లభిస్తోంది. సిద్దిపేట రూరల్ మండలం సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడక గ్రామంలో నూతనంగా నిర్మించిన పట్టాభి రామ దేవస్థానంలో ఘనంగా జరుగుతున్న ప్రతిష్టా మహోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అర్చకులు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు…
సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళిత బంధు అనేది ఒక్క ఆర్ధిక సహాయం కాదు, దళితుల అభ్యున్నతి కోసం ప్రారంభించిన ఒక్కఉద్యమం అన్నారు మంత్రి హరీష్ రావు. వారి జీవితాలు వెలుగులు నింపాలనేది సీఎం కేసీఆర్ ఆశయం. దళితబంధు ద్వారా ఆర్ధిక సహాయం అందించడమతో పాటుగా వ్యాపారాభివృద్ధికి ప్రభుత్వ అధికారులు సహకరిస్తారు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా 21 శాతం రిజర్వేషన్ దళితులకు కల్పించడం జరిగిందన్నారు. వైన్ షాప్ లో కూడా దళితులకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది.…
పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై విరుచుకుపడ్డారు పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే , బీజేపీ నేత టి.నందీశ్వర్ గౌడ్. బచ్చుగూడలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. స్ధానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పై ప్రధాన మంత్రికి దొడ్డిదారిన వెళ్లి వినతి పత్రాన్ని సమర్పించటం సాధ్యమేనా..? తాను ఎంపీపీగా, ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి…
ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి ప్రారంభోత్సవం రాజకీయ రచ్చకు తెర లేపింది. .వైద్యుల పోస్టులు భర్తీ చేయకుండా ప్రారంభోత్సవం చేయడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. చివరకు కాంగ్రెస్ – టీఆర్ఎస్ శ్రేణులు కొట్టుకునే వరకు పరిస్థితి వెళ్లడం ఇప్పడు హాట్ టాపిక్ అయింది. ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని 150 కోట్లతో ఏర్పాటు చేశారు. ఆసుపత్రి 250 పడకల ఆస్పత్రిలో 8 డిపార్ట్మెంట్లలో 366 మంది వైద్య సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు పూర్తి…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి విశేష ప్రాధాన్యత ఇస్తోంది. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ హెల్త్ ప్రొఫైల్’ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలోని 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య సమగ్ర సమాచార నివేదిక (హెల్త్ ప్రొఫైల్) సిద్ధం చేయాలని నిర్ణయించింది. దీనికోసం పైలట్ ప్రాజెక్టులుగా ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో భాగంగా సర్వేను మంత్రి హరీశ్ రావు ములుగు జిల్లా…
నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో మంత్రి హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు మంత్రులు.బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకోనున్నారు మంత్రులు. ఉదయం 9 గంటలకు బాసరలో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ఉదయం 9.20 గంటలకు ముధోల్ లో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేస్తారు మంత్రులు. 12.15 గంటలకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్ లో రేడియాలజీ ల్యాబ్ నిర్మాణానికి శంఖుస్థాపన చేస్తారు. తరువాత జిల్లా కేంద్రంలో…
పేదలకు మరింత మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయం అన్నారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం, భారతీ నగర్ డివిజన్ల పరిధిలో బస్తీదవాఖానాలను ప్రారంభించారు మంత్రి హరీశ్ రావు. బస్తీల్లో పేదల సుస్తీ పోగొట్టేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలు ప్రారంభించారన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 256 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ దవాఖానాల్లో నిపుణుడైన MBBS డాక్టర్, స్టాఫ్ నర్స్, ఇతర సిబ్బంది మీకు వైద్య సేనలు అందిస్తారు.ఉచితంగా వైద్య సేవలు, అన్ని…
కేంద్రంపై మండిపడ్డారు మంత్రి తన్నీరు హరీష్ రావు. మిషన్ భగీరథను హర్ ఘర్ హల్ గా కాపీ కొట్టారని, రైతు బంధు లాంటి పథకంను పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో తెచ్చారని విమర్శించారు. దళిత బంధు పథకంను దేశ వ్యాప్తంగా ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. దళితులపై కపట ప్రేమను ఒలకబోస్తుంది బీజేపీ. ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో ప్రవేశ పెట్టే బడ్జెట్ లో దళిత బంధు పథకం ను ప్రవేశ పెట్టి…
317 జీవోను అమలు చేసి ప్రతీ ఉద్యోగాన్ని నింపాలని సీఎంగాఆలోచిస్తుంటే, అడ్డుపడుతున్నారని మండిపడ్డారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. కోర్టుల్లో స్టే తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ జీవో అమలు కావద్దు. ఉద్యోగాలు నింపవద్దు అంటున్నారు. తెలంగాణ, ఆంధ్ర విడిపోయే సమయంలో కేసీఆర్ అప్పటి హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. రాజ్ నాథ్ సింగ్ వద్దకు వెళ్లి ఆంధ్ర, తెలంగాణ విడిపోతుంది. తెలంగాణ వాళ్లకు,తెలంగాణలో స్థానికంగా ఇవ్వాలన్నారు. ఆనాడు రాజ్ నాథ్ సింగ్…