ముంబైలోని వాంఖడే స్టేడియంలో వేదికగా హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో అద్భుత విజయాన్ని అందుకుంది గుజరాత్ టైటాన్స్… తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసి.. గుజరాత్ ముందు 196 పరుగుల టార్గెట్ పెట్టింది.. ఇక, ఈ మ్యాచ్ చివరి ఓవర్లో టర్న్ తిరిగింది.. ఒక ఓవర్లో ఏకంగా 22 పరుగులు రాబట్టారు గుజరాత్ బ్యాట్మెన్స్… చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో 199 పరుగులు…
దేశంలో నిరుద్యోగం, కరోనా కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, ధరల పెరుగుదల ఎలా వున్నా.. యువతను మత్తులో దించేందుకు ముఠాలు నిరంతరం పనిచేస్తున్నాయి. దేశాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ దందా నానాటికీ పెరిగిపోతోంది. ఎక్కడ అవకాశం వుంటే అక్కడ డ్రగ్స్ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. ఇప్పటికే భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు పట్టుబడిన గుజరాత్లో తాజాగా మరోమారు భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. గుజరాత్లో గురువారం నాడు 256 కిలోల హెరాయిన్ను నార్కోటిక్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ…
దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ రేపు గుజరాత్ లో పర్యటించనున్నారు. మోర్బీలో నెలకొల్పిన 108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని మోడీ ఆవిష్కరిస్తారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ‘హనుమాన్జీ4ధామ్’ప్రాజెక్ట్ లో భాగంగా దేశ నలు దిక్కుల్లో నాలుగు హనుమాన్ విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా దేశానికి పడమర దిక్కున ఉన్న మోర్బీలోని…
ఐపీఎల్ రసవత్తరంగా సాగుతోంది. గురువారం రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ పోరులో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. టోర్నీలో ఇప్పటివరకు రెండు జట్లు చెరో 4 మ్యాచ్ లు ఆడి, 3 విజయాలు సాధించి ఊపుమీదున్నాయి. మెరుగైన రన్ రేట్ తో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇవాళ్టి మ్యాచ్ లో గుజరాత్ గెలిస్తే అత్యధిక విజయాలతో పాయింట్ల పట్టికలో ప్రథమస్థానానికి ఎగబాకుతుంది. అందుకే రెండు జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు…
ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో విజయం సాధించింది. గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్… నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, అభినవ్ మనోహర్ మినహా మిగతా బ్యాట్స్మెన్ ఫెయిల్ అయ్యారు. హార్ధిక్ పాండ్యా 50 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. మనోహర్ 35, మాథ్యూ వేడ్ 19 పరుగులు చేశారు. సన్ రైజర్స్…
కరోనా కల్లోలం నుంచి బయటపడి.. సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.. ఒమిక్రాన్ రూపంలో థర్డ్ వేవ్ ఎటాక్ చేసినా.. మళ్లీ కేసులు తగ్గిపోయాయి.. ఈ మధ్య కేసులు పెరుగుతోన్న ఐదు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్రం.. వారం రోజుల వ్యవధిలో నమోదైన కేసులను ప్రస్తావిస్తూ.. అలెర్ట్గా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.. హర్యానా, ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర, మిజోరాంలలో గత వారం రోజులుగా కేసులు పెరుగుతున్నాయని తెలిపిన కేంద్రం.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని పేర్కొంటూ కేంద్ర…
ప్రతీరోజు ఎక్కడో ఒక దగ్గర చిన్నారులు, అమ్మాయిలు, మహిళలు, వృద్ధులు అనే తేడాలేకుండా అత్యాచార ఘటనలు ఆందోళనకు గురిచేస్తూనే ఉన్నాయి.. ఇంటి నుంచి బయటకు వెళ్లినవారు సురక్షితంగా ఇంటికి చేరతారా? అనే ఆందోళన ఓవైపు.. ఇంట్లో ఉన్నా సేఫ్గా ఉంటారా? అనే కలవరం మరోవైపు వెంటాడుతోంది.. అయితే, అత్యాచారాలకు మొబైల్ ఫోన్లు, సమాజంలోని వికృత మనస్తత్వమే కారణమని పేర్కొన్నారు గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి.. మొబైల్ ఫోన్లలో అడల్ట్ వీడియోలను సులభంగా యాక్సెస్ చేయడం మరియు…
గుజరాత్పై కాంగ్రెస్ పార్టీ గురి పెట్టిందా? అక్కడ జరిగే ఎన్నికల్లో గెలుపొందేందుకే ప్రశాంత్ కిశోర్ వ్యూహాలతో కాంగ్రెస్ ముందుకు వెళ్లనుందా? అందుకే రాహుల్తో రాజకీయ వ్యూహకర్త పీకే భేటీ అయ్యారా? ఇప్పుడంతా ఇదే టాపిక్ అవుతోంది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్… కాంగ్రెస్ పార్టీ కోసం రంగంలోకి దిగుతున్నారా? మోదీ ఇలాఖా గుజరాత్లో బీజేపీని గద్దె దించి… గాంధీల పార్టీని గెలిపిస్తారా? దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు పునరుజ్జీవం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారా? పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారా?…
కాంగ్రెస్ పార్టీ కోసం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగుతున్నారా..? రాహుల్ గాంధీతో భేటీ అయ్యారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ హాట్గా సాగుతోంది.. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో… కాంగ్రెస్ పార్టీకి దారుణమైన ఫలితాలు ఇచ్చాయి. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో కేవలం రెండు సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లోనూ ఆశించిన స్థాయిలో సీట్లను సాధించలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సీడబ్ల్యూసీ సమావేశంలోనూ సుదీర్ఘంగా చర్చించారు. ఆ…
కరోనా మహమ్మారి తగ్గడంతో శుభకార్యాలు, పెళ్ళి తంతులు పెరిగిపోయాయి. ఓ పెళ్ళి తంతుకి వెళ్లి భోజనం చేసిన 1200 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుజరాత్ లోని మెహసనా జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పెళ్ళి విందులో ఆహారం తీసుకున్న తర్వాత వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడ్డారు జనం. విషయం తెలుసుకున్న అధికారులు ఆహార నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. కాంగ్రెస్ నేత కుమారుడి పెళ్లిలో విందు భోజనం చేసిన 1200 మందికిపైగా అతిథులు ఆసుపత్రి పాలయ్యారు.…