Prashant kishor: కాంగ్రెస్ పై పీకే సంచలన వ్యాఖ్యలు… అక్కడ కూడా గెలవదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల రాజస్తాన్ ఉదయ్ పూర్ లో నిర్వహించిన చింతన్ శిబిర్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని.. దీని వల్ల కాంగ్రెస్ అధిష్టానం వారి నాయకత్వానికి కొంత సమయం ఇవ్వడం తప్పా సాధించిందేం లేదని.. రానున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఓడిపోతుందని ట్వీట్ చేశారు.
ఇటీవల వరస పరాజయాలతో ఢీలా పడ్డ కాంగ్రెస్ పార్టీ మళ్లీ పూర్వవైభవం తీసుకువచ్చేలా ప్రశాంత్ కిషోర్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నేతలకు పలు సూచనలు చేశారు. పార్టీ మళ్లీ గాడిలో పడేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీకి సూచించారు పీకే. పార్టీ నిర్మాణంతో పాటు వ్యూహాల్లో కూడా కీలక మార్పులను సూచించారు. ఆదే సమయంలో ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరి కీలక బాధ్యతలను చేపడుతారని ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే ఆ తరువాత నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని పీకే తెలిపారు. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీనే అని గతంలో పలు మార్లు పీకే వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లేకుండా ఎలాంటి ఫ్రంట్ కూడా సాధ్యం కాదని వెల్లడించారు.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
అయితే పీకే సూచించిన సూచనలను ‘చింతన్ శిబిర్ ’లో అమలు చేస్తారని పార్టీ నిర్మాణంలో కీలక మార్పులతో పాటు అధ్యక్ష ఎన్నికలు కూడా ఉండవచ్చనే వార్తలు వినిపించాయి. అయితే కాంగ్రెస్ మాత్రం కొన్ని కీలక నిర్ణయాలను మాత్రమే తీసుకుంది. ‘ ఒక కుటుంబం- ఒక టికెట్’, పార్టీలో కనీసం 5 ఏళ్లు పని చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుందని… రాజ్యసభ స్థానం ఒకరికి రెండు సార్లు మాత్రమే కేటాయిస్తామనే కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. కానీ పార్టీలో సంస్థాగత నిర్మాణంపై పెద్దగా చింతన్ శిబిర్ లో చర్చించలేదు. ఈనేపథ్యంలో పీకే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసినట్లు తెలుస్తోంది.
I’ve been repeatedly asked to comment on the outcome of #UdaipurChintanShivir
In my view, it failed to achieve anything meaningful other than prolonging the status-quo and giving some time to the #Congress leadership, at least till the impending electoral rout in Gujarat and HP!
— Prashant Kishor (@PrashantKishor) May 20, 2022
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!