Maharashtra: మహారాష్ట్రలో మళ్లీ రాజకీయ సంక్షోభం.. 11 మంది ఎమ్మెల్యేలతో మంత్రి జంప్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొననుండడం సంచలనంగా మారింది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంపై అసంతృప్తితో మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్నాథ్ షిండే.. మరో 11 మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని గుజరాత్లో సూరత్కు వెళ్లినట్లు సమాచారం. తన వెంట 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఏక్నాథ్ షిండే తెలిపినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. వీరంతా గుజరాత్ భాజపా అధ్యక్షుడు సీఆర్ పాటిల్తో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. సూరత్లోని గ్రాండ్ భగవతీ హోటల్లో ఆ ఎమ్మెల్యేలు బస చేస్తున్నట్లు అక్కడి విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో శివసేనలో చీలిక మొదలైనట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో మహా వికాస్ అఘాడీ అప్రమత్తమైంది. అత్యవసర సమావేశానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరగనుంది.
మహారాష్ట్ర రాజ్యసభ ఎన్నికల తర్వాత జరిగిన శాసనమండలి ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 10 స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన ఐదుగురు గెలుపొందారు. బీజేపీకి మొత్తం 134 ఓట్లు వచ్చినట్లు బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తెలిపారు. బీజేపీకి అసెంబ్లీలో నలుగురిని గెలుచుకోగల సంఖ్యాబలం 106 కాగా.. 134 ఓట్లు వచ్చాయి. ఐదుగురిని బరిలోకి దించి పూర్తిస్థాయిలో విజయం సాధించింది. అంటే స్వతంత్రులతో పాటు అధికార పక్షం వారివీ ఉంటాయని భావిస్తున్నారు. కూటమిలోని మూడు పక్షాలు రెండేసి చొప్పున ఆరు స్థానాల్లో పోటీ చేసి ఐదుగురిని మాత్రమే గెలుపించుకోగలిగాయి.
ఏక్నాథ్ షిండే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సమయంలో కూడా లేరని శివసేన నేత ఒకరు తెలిపారు. దీనిని బట్టి చూస్తే అధికార పార్టీ నేత షిండే తిరుగుబాటు బావుటా ఎగరవేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే కూడా అప్రమత్తమయ్యారు. మధ్యాహ్నం 12 గంటలకు శివసేన ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి షిండే వస్తారో రారో వేచి చూడాల్సిందే.
Also Read
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
- Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
మరోవైపు మహారాష్ట్రలో 288 స్థానాలకు గానూ సంకీర్ణ ప్రభుత్వానికి 169 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 113 సీట్లతో భాజపా రెండో స్థానంలో ఉంది. ఒకవేళ ఈ 12 మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీలో చేరినా ప్రభుత్వం అధికారాన్ని కోల్పోదు. మహా వికాస్ అఘాడీకి మెజార్టీ కంటే ఎక్కవ స్థానాలే ఉన్నాయి. కానీ రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో భాజపాకు లాభం చేకూరే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!