న్యూమరాలజీ ప్రకారం ఐపీఎల్ 2023లో ప్లే ఆఫ్స్ చేరే జట్లు ఏవో తెలుసా.. ప్రముఖ న్యూమరాలజిస్ట్ అంచనా ప్రకారం ఈ సారి ప్లే ఆఫ్స్.. ఫైనల్స్ కి చేరబోయే జట్లు ఇవేనంటా.. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్.. అని చెప్పారు.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్పై 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆఖరి ఓవర్లో 5 వరుస సిక్సర్లు బాదిన రింకూ సింగ్ కోల్కతా నైట్ రైడర్స్ను ఫినిషింగ్ లైన్పైకి తీసుకెళ్లిన తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ గత సీజన్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆనందం వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ 16వ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ సంచలన విజయం సాధించింది. రింకూ సింగ్(48) ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించాడు. రింకూ సింగ్ సిక్సర్ల మోత మోగించడంతో కోల్కతా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఐపీఎల్ సీజన్ 16 లో భాగంగా గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 204 పరుగులు చేసింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్తా జట్టు 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది.