ఐపీఎల్ లో తొలి దశ మ్యాచ్ లు నిన్నటితో ( ఏప్రిల్ 25 ) పూర్తయ్యాయి. లీగ్ లో పాల్గొంటున్న మొత్తం 10 జట్లు ఇప్పటి వరకు ఏడేసి మ్యాచ్ లు ఆడాయి. 7 మ్యాచ్ ల్లో 5 విజయాలు సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ( 0.662 ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. గుజరాత్ సైతం 7 మ్యాచ్ ల్లో 5 విజయాలు సాధించినప్పటికీ.. చెన్నైతో పోలిస్తే కాస్త రన్ రేట్ ( 0.580…
జట్టుకు భారంగా మారాడని హార్థిక్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. అతను చివరిసారిగా ఎప్పుడు జట్టుకు ఉపయోగపడే ఇన్సింగ్స్ ఆడాడో కనీసం అతనికైనా గుర్తుందా అని ప్రశ్నిస్తున్నారు. కెప్టెన్ అన్న అహంకారంతో విర్రవీగుతున్నాడు. రెండు, మూడు మ్యాచ్ లు పక్కన కూర్చోబెడితే కానీ లైన్ లోకి వచ్చేలా కనిపించడం లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఐపీఎల్-16వ సీజన్లో భాగంగా నేడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబయి ఇండియన్స్ మ్యాచ్ జరగనుంది. వరుసగా మూడు మ్యాచ్లు గెలిచి పంజాబ్పై పోరాడి ఓడిన రోహిత్ సేన గుజరాత్పై తప్పనిసరిగా గెలవాలనే కసితో ఉంది.
మోహిత్ శర్మ స్వింగ్ తో గుజరాత్ టైటాన్స్ కింగ్ అయింది. అనూహ్యంగా ఓటమి నుంచి గెలుపు మజిలీకి చేరింది. అలవోకగా గెలవాల్సిన మ్యాచ్ ను లక్నో సూపర్ జెయింట్స్ వరుస నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు చేజార్చుకుని ఓటమిని చవిచూసింది.