Delhi: న్యూఢిల్లీలోని పాలం ప్రాంతంలో నేడు ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. పాలం మెట్రో స్టేషన్ సమీపంలోని ఒక అపార్ట్మెంట్లో ఉదయం సుమారు 7 గంటల సమయంలో మంటలు చెలరేగినట్లు ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
RGV Reviews: ధురంధర్-2’పై రామ్గోపాల్ వర్మ క్రేజీ రివ్యూ.. హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్లకు కీలక సలహా!
మంటలు తీవ్రంగా వ్యాపించడంతో రక్షణ చర్యలు క్లిష్టంగా మారాయి. దాదాపు మూడు గంటల పాటు అగ్ని అదుపులోకి రాకపోవడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఘటన సమయంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది భవనంలో చిక్కుకున్నట్లు సమాచారం. మంటల భయంతో ఇద్దరు వ్యక్తులు భవనంపై అంతస్తు నుంచి దూకగా, వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.
Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!
సంఘటన స్థలానికి సుమారు 30 ఫైర్ ఇంజిన్లు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి భవనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. అధికారుల ప్రకారం ప్రస్తుతం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. లోపల ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉన్నారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.