కరోనా మహమ్మారి విషయంలో కేంద్రం కొత్త గైడ్లైన్స్ను రిలీజ్ చేసింది. ఇప్పటి వరకు ఉన్న ఎట్ రిస్క్ కంట్రీస్ అనే ఆప్షన్ను పక్కన పెట్టింది. అంతేకాదు, విదేశాల నుంచి వచ్చేవారు తప్పని సరిగా ఏడు రోజులపాటు క్వారంటైన్ లో ఉండాలి. కానీ, ఇకపై ఆ అవసరం లేదు. ఏడు రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్ ఉండాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, ఆన్లైన్ డిక్లరేషన్ ఫామ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లో రెండు వారాల ట్రావెల్ హిస్టరీ…
ఒమిక్రాన్ ఎంట్రీతో భారత్లో కరోనా థర్డ్ వేవ్ మొదలైంది.. భారీగా కేసులు వెలుగు చూశాయి.. అయితే, క్రమంగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.. కోవిడ్ విజృంభణ సమయంలో కఠిన ఆంక్షలు విధించిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. మళ్లీ సడలింపులు ఇస్తున్నాయి.. కొన్ని రాష్ట్రాలు స్కూళ్లను మూసివేసి.. ఆన్లైన్ విద్యకే పరిమితం అయ్యాయి.. ఇప్పుడు మళ్లీ విద్యాసంస్థలను తెరవడంపై ఫోకస్ పెడుతున్నాయి.. ఈ సమయంలో.. స్కూళ్ల పునః ప్రారంభంపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.. Read Also:…
రైళ్లలో ప్రయాణం చేసేవారి భద్రత విషయంలో రైల్వేశాఖకు అనేక ఫిర్యాదులు అందుతుండటంతో కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది. రైళ్లలో ప్రయాణం చేసే తోటి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించినా వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించాలని నిర్ణయం తీసుకుంది. ఈ బాధ్యతలను ఆర్పీఎఫ్కు అప్పగిస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. రైళ్లలో ప్రయాణం చేసే సమయంలో బోగీల్లో ల్యాప్ట్యాప్, మొబైల్ఫోన్లలో పెద్దగా శబ్దం వచ్చేలా పాటలు వంటివి పెట్టకూడదు. ఫోన్లో బిగ్గరగా మాట్లాడరాదు. సాధారణ తరగతుల్లోప్రయాణం చేసే…
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. బుధవారం రోజున తెలంగాణలో 3557 కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఐసీఎంఆర్ కరోనా చికిత్సా విధానంపై కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. జలుబు, జ్వరం, గొంతునొప్పి, దగ్గు వంటి స్వల్ప లక్షణాలు ఉంటే ఇంట్లోనే ఉండి చికిత్స పొందాలి. రోజుకు ఐదు సార్లుకు మించి దగ్గు, జ్వరం వంటివి వస్తే వైద్యుల సలహా మేరకు మందులు వినియోగించాలి. ఇంట్లోనే ఉన్నప్పటికీ భౌతిక దూరం పాటించాలి, ఇంట్లో ఉన్నా మాస్క్…
దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో 293 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలను దృష్టిలో పెట్టుకొని కోవిడ్, ఒమిక్రాన్ కట్టడికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం మరోసారి సూచించింది. ఒమిక్రాన్ కట్టడిపై కేంద్రం అలర్ట్ అయింది. కేసుల పెరుగుదలపై రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, ఒమిక్రాన్ పట్ల అన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించింది. ఎక్కువ కేసులున్న కోవిడ్ క్లస్టర్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని,…
రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి నిరోధానికి మరోమారు మార్గదర్శకాలు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. కేంద్ర హోమ్ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించని వారికి రూ. 100 జరిమాన విధింపునకు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మాస్కు లేని వారిని దుకాణాలు, వాణిజ్య ప్రదేశాలు, వ్యాపార సంస్థల ప్రాంగణాల్లోకి అనుమతిస్తే సదరు యాజమాన్యానికి రూ. 10 వేల నుంచి రూ. 25…
ఆంధ్రప్రదేశ్లో ఎయిడెడ్ సంస్థల విలీనం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. సూచనలతో అంతర్గత మెమో జారీ చేసింది ఏపీ ఉన్నతవిద్యా శాఖ. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఎయిడెడ్ సంస్థల విలీనం విషయంలో జరుగుతోన్న ఆందోళనలతో తాజా మెమో జారీ చేసింది సర్కార్. 2249 ఎయిడెడ్ విద్యా సంస్థల్లో 68.78 శాతం విద్యా సంస్థలు విలీనానికి అంగీకరించాయని ప్రభుత్వం తెలిపింది. 702 ఎయిడెడ్ విద్యా సంస్థలు విలీనానికి అంగీకరించలేదని స్పష్టీకరించింది. విలీనానికి అంగీకరించని ఎయిడెడ్ సంస్థలపై ఎలాంటి ఒత్తిడి పెట్టలేదని…
కరోనా మహమ్మారి బారినపడి మృతిచెందినవారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.. కోవిడ్ సోకి మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 వేలు ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపింది.. రాష్ట్ర విపత్తుల నిర్వహణ నిధుల నుంచి ఈ పరిహారం అందజేయనుండగా.. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది తెలంగాణ సర్కార్.. ఇక, కోవిడ్ డెత్ సర్టిఫికెట్ జారీ చేసేందుకు అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది ప్రభుత్వం.. మృతుల కుటుంబ సభ్యుల ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది..…
కరోనా మహమ్మారి విజృంభణతో మూతపడిన విద్యాసంస్థలు సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా తెరుచుకున్నాయి.. అయితే, పాఠశాల స్థాయిలో ప్రత్యక్ష బోధనకు స్కూళ్లను, విద్యార్థులను బలవంతం చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.. ఇక, ప్రత్యక్ష తరగతుల నిర్వహణపై సమగ్రమైన మార్గదర్శకాలు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది.. దీంతో.. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతుల నిర్వహణపై సమగ్రమైన మార్గదర్శకాలు జారీ చేసింది తెలంగాణ పాఠశాల విద్యాశాఖ.. ఈ విద్యా సంవత్సరంలో ఫీజులు పెంచరాదని పేర్కొంది.. కేవలం ట్యూషన్…
కరోనా కారణంగా ఆగిపోయిన పలు చిత్రాల షూటింగ్స్ ఇప్పుడు మొదలు కాబోతున్నాయి. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ , నిర్మాతల మండలి, దర్శకుల సంఘం, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సంయుక్తంగా బుధవారం ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశం అయ్యాయి. ఇందులో జెమినీ కిరణ్, కె.ఎల్. దామోదర ప్రసాద్, ముత్యాల రాందాసు, విజయేందర్ రెడ్డి, నరేశ్, జీవిత, పల్లి కేశవరావు, సురేందర్ రెడ్డి, ప్రసన్న కుమార్, భరత్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ…