Madhyapradesh: మధ్యప్రదేశ్ సెహెర్ జిల్లాలోని ముంగోలి గ్రామంలో 2 ఏళ్ల చిన్నారి బోరుబావిలో పడిపోయింది. ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి 300 అడుగుల లోతున్న బోరుబావిలో మంగళవారం పడిపోయింది. సమాచారం తెలుసుకున్న అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. గత 24 గంటల నుంచి బాలికను బయటకు తీసేందుకు అధికారులు కష్టపడుతున్నారు. 50 అడుగుల పీట్ల లోతులో చిన్నారి చిక్కుకుపోయింది. అంతకుముందు 20 ఫీట్లలో ఉన్న చిన్నారి, ఆ తరువాత మరింత లోతుకు జారిపోయింది.