ఎన్ని జాగ్రత్తలు చెప్పినా ప్రజల్లో నిర్లక్ష్యం తగ్గడం లేదు. తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. కొత్తగా మళ్లీ 4వేలకు పైగానే కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు పెద్ద సంఖ్యలోనే కొత్త కేసులు బయటపడ్డాయి.సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలకు వెళ్ళివచ్చినవారు పరీక్షలు చేయించుకోగా కేసులు పెరిగాయని తెలంగాణ వైద్యారోగ్యశాఖ తెలిపింది. 24గంటలలో 1 లక్షా 13 వేల 670 టెస్టులు చేయగా.. 4,559మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. 1961మంది కోలుకోగా.. ఇద్దరు…
అక్రమ నిర్మాణాలపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) తగ్గేదేలే అంటోంది. నార్సింగి మునిసిపల్ గౌలిదొడ్డిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన యజమానుల గుండెల్లో హెచ్ ఎండీఏ అధికారులు రైళ్లు పరిగెత్తిస్తున్నారు. 111 జీవోకు తూట్లు పెట్టి యజమానులు బహుళ అంతస్తు భవనాలు నిర్మించారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారు. 111 జీవోలో జీ+1 మాత్రమే అనుమతులు ఉండగా, జీ+6 బహుళ అంతస్తుల భవనాలను బిల్డర్స్ చేపట్టారు. పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా నార్సింగి కమీషనర్,…
హైదరాబాద్ నగరంలో స్టీల్ బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి రానుంది. పంజాగుట్ట నుంచి బంజారాహిల్స్ వెళ్లే రోడ్డులో ఈ బ్రిడ్జిని నిర్మించారు. పంజాగుట్ట శ్మశాన వాటిక పాత ద్వారాన్ని తొలగించి నూతన బ్రిడ్జిని నిర్మించడంతో… శ్మశాన వాటికకు వెళ్లేందుకు ప్రజలకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి. పాత గేటు నుంచి హైటెన్షన్ విద్యుత్ పోల్ వరకు రోడ్డు విస్తరణ చేయడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పనున్నాయి. Read Also: జూనియర్ ఆర్టిస్ట్ అనుమానాస్పద మృతి… ధర్నాకు దిగిన కుటుంబీకులు ఈ బ్రిడ్జి నిర్మాణం…
తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే వుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కరోనా కేసుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం అవుతోంది. కూకట్ పల్లి, బాలానగర్ లలో రోజు రోజుకు పెరుగుతున్నాయి కోవిడ్ కేసులు. యూపీహెచ్సీ,పీహెచ్సీలలో 286 పాజిటివ్ కేసుల నిర్దారణ అయ్యాయి. కూకట్ పల్లి- 50,హస్మత్ పేట్ – 20, బాలానగర్ – 51, మూసాపేట – 34, జగద్గిరి గుట్ట – 55, ఎలమ్మబండ – 46, పర్వత్ నగర్ లో 30 కేసులు వెలుగు చూశాయి.…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి దారుణమైన పరిస్థితులలో ఉంది. ప్రతి రోజు రోజు వేల సంఖ్యలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి.ఈ రోజు తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,707 కేసులు నమోదు అయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తాజా గా విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటలలో 2,707 కేసులు వెలుగు చూశాయి. కాగ నిన్న రాష్ట్రంలో 2,319 కేసులు…
సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ ఆఫీసులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ కార్యాలయంలోని 3వ అంతస్థులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే కార్యాలయం కిందకు పరుగులు పెట్టారు. అంతేకాకుండా 5వ అంతస్థులోని సిబ్బంది భయంతో ఆఫీస్ టెర్రస్పైకి ఎక్కారు. వీరితో పాటు ఓ ఇద్దరు ఉద్యోగులు ప్రమాదం జరిగిన సమయంలో ఆఫీస్ లిఫ్ట్లో చిక్కుకున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందడంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది…
రాష్ట్రంలోని కార్పోరేషన్లు, మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించేందుకు పురపాలక శాఖ సిద్ధమైంది. గ్రామపంచాయతీల అనుమతితో అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించేందుకు టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ మొదలు అన్ని మున్సిపాలిటీల్లో ఆకస్మిక తనిఖీలు చేసి కూల్చివేతలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు అధికారులు. ఈ విషయంలో పక్కాగా ముందుకెళ్ళాలని అధికారులు భావిస్తున్నారు. గ్రామ పంచాయతీ అనుమతుల పేరిట హైదరాబాద్ శివార్లలో నిర్మించిన అక్రమ కట్టడాలపై మున్సిపల్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. గ్రామ పంచాయతీ అనుమతి పేరుతో…
తెలుగు రాష్ట్రాలలో పుల్లారెడ్డి స్వీట్స్కు ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుల్లారెడ్డి స్వీట్స్ అంటే ఎవరికైనా నోరూరుతుంది. అయితే పుల్లారెడ్డి స్వీట్ షాపుకు హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ అధికారులు షాకిచ్చారు. రూ.25వేలు జరిమానా విధించారు. వివరాల్లోకి వెళ్తే… ఇటీవల శంషాబాద్లోని పుల్లారెడ్డి స్వీట్ హౌస్లో కొంతమంది కస్టమర్లు స్వీట్లు కొనుగోలు చేశారు. Read Also: మనిషిని నాశనం చేసే ఐదు విషపూరిత అలవాట్లు అయితే వారు కొనుగోలు చేసిన మిఠాయిలు పాచిపోయి ఉండటంతో కస్టమర్లు…
హైదరాబాద్ ఖాజాగూడలోని కరాచీ బేకరీపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝళిపించారు. కరాచీ బేకరీలో కొన్న స్వీట్లలో బూజు ఉందంటూ ఓ వ్యక్తి తెలంగాణ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే స్పందించిన ఆయన… వెంటనే కరాచీ బేకరీపై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించాడు. ఈ క్రమంలో ఖాజాగూడలోని కరాచీ బేకరీలో అధికారులు సోదాలు నిర్వహించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బేకరీ పరిసరాలు, వంట గదిని పరిశీలించారు. బేకరీలోని…
ఎప్పడూ రద్దీగా ఉండే హైదరాబాద్ నగరంలో మరింత ఆక్సిజన్ లెవెన్స్ను పెంచడానికి జీహెచ్ఎంసీ మరోసారి ముందుకు వచ్చింది. ఇప్పటికే హైదరాబాద్లో పచ్చదనాన్ని పెంచేందుకు జీహెచ్ఎంసీ పరిధిలో లక్షలకు పైగా మొక్కలు ఏర్పాటు చేస్తూ గ్రీన్ కవర్ను పెంచుతోంది. కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ‘తెలంగాణకు హరితహారం’ను ప్రపంచంలోనే అడవుల పెంపకంలో మూడవ అతిపెద్ద ప్రయత్నంగా ఐక్యరాజ్యసమితి గుర్తించింది. అయితే ‘తెలంగాణకు హరితహారం-2022’లో భాగంగా, మరిన్ని మొక్కలు నాటడం ద్వారా నగరాన్ని పచ్చదనంతో నింపాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది.…