రాష్ట్రవ్యాప్తంగా సాధారణ ఎన్నికల కోసం హడావుడి కొనసాగుతుంటే, రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం పాలకవర్గం మార్పుపై చర్చ సాగుతోంది. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా, పదవులతో పాటు ఆర్థిక లావాదేవీలే లక్ష్యంగా నేతలు సాగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీలో రెండు వర్గాలుగా చీలిక ఏర్పడింది. మేయర్ వర్గానికి వ్యతిరేకంగా డిప్యూటీ వర్గం పావులు కదుపుతోంది. మేయర్ కు ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్ కు ఎంపీ మద్దతు ఉన్నట్లు కార్పొరేషన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.…
తెలంగాణపై బీజేపీ గట్టి గురిపెట్టిందనడానికి వరుస పరిణామాలే నిదర్శనం. అగ్రనేతలంతా హైదరాబాద్ లో ల్యాండ్ అవుతుండటమే అందుకు ఉదాహరణ. గతనెల 26న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ కు వచ్చారు. బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో బిజెపి శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నామని చెప్పారు. ఆయన పర్యటనలో స్వాగతం, వీడ్కోలు పలికే దగ్గర చోటామోటా బిజెపి నేతలకు అవకాశం వచ్చింది. గ్రేటర్ కార్పొరేటర్ లను కూడా కలిసే కార్యక్రమం ప్రోగ్రామ్ లో వున్నా, వర్షం…
వర్షాకాలంలో ప్రాణాపాయ ఘటనలు తలెత్తకుండా ఉండేందుకు మంత్రి కేటీఆర్ తో సహా ఉన్నతాధికారులు కొంత కాలంగా హెచ్చరికలు జారీ చేస్తుండటంతో వర్షాకాలంలో ప్రాణాపాయం వంటి ఘటనలు తలెత్తకుండా ఉండేందుకు మంత్రి కేటీఆర్తో పాటు ఉన్నతాధికారులు కొత్త కాలంగా హెచ్చరికలు జారీ చేస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడ నిర్లక్ష్యం కనిపించినా వేటు తప్పదని ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో గడువు దగ్గరపడుతుండటంతో..అధికారులు పనులను ముగించే పనులలో నిమగ్నమయ్యారు. ఈ నెల 5లోగా రక్షణ చర్యలన్నీ తీసుకోవాలని.. నాలాలు, మ్యాన్హోళ్ల వంటి…
వర్షం వచ్చందంటే చాలు హైదరాబాద్లో మురికి కాలువలు పొంగిపొర్లుతుంటాయి. దీంతో మురికి నీరు ఇండ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికే ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు జీహెచ్ఎంసీపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ కు హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. వరద నీటి రిటైనింగ్ వాల్ నిర్మాణంలో అధికారులు, కాంట్రాక్టర్లు జాప్యం, నిర్లక్ష్యంగా వ్యవహరించారని యాకుత్ పురా స్థానికులు హెచ్ఆర్సీలో ఫిర్యాదు…
రాజధానిలోని పేదలందరికీ ఉచితంగా అన్నిరకాల రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. జీహెచ్ఎంసీలో మరో 10 మినీ హబ్స్ (రేడియాలజీ)ను బుధవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. అనంతరం హరీశ్ రావ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు హైదరాబాద్ వాసుల కోసం టీ-డయాగ్నోస్టిక్స్ కింద మొత్తం 20 మినీ హబ్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కొనియాడారు. నిరుడు జనవరిలో 8 హబ్స్ను ప్రారంభించిన సర్కారు.. బుధవారం మరో పదింటిని ప్రారంభించడంపై ఆనందం వ్యక్తం చేశారు.…
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ అధికారులు ఖుషీగా వున్నారు. భాగ్యనగరంలో పేరుకుపోయిన ట్యాక్స్ ల వసూలుకు GHMC ఎర్లీ బర్డ్ ఆఫర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ బంపర్ ఆఫర్ ముగిసింది. దీంతో GHMCకి కాసుల వర్షం కురిసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రాపర్టీ టాక్స్ ఏప్రిల్ నెలలో కట్టిన వారికి 5 శాతం రిబేట్ సౌకర్యం కల్పించింది బల్దియా. దీంతో ఎగబడి మరి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేశారు నగరవాసులు. ఈ ఆఫర్ కారణంగా జీహెచ్ఎంసీకి భారీగా…
టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్లో టీఆర్ఎస్ నేతలు పలుచోట్ల భారీ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ప్రధాన రహదారులపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని గతంలో జీహెచ్ఎంసీ అధికారులు నిబంధనలు విధించారు. దీంతో ఏ పార్టీ నేతలు ఫ్లెక్సీలు పెట్టినా ఊరుకోవడం లేదు. తాజాగా అధికార పార్టీ నేతలే భారీగా ఫ్లెక్సీలు పెట్టడంతో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి టీఆర్ఎస్ నేతలకు జరిమానాలు విధించారు. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శికి రూ.65వేలు, మంత్రి…
తెలంగాణ కాంగ్రెస్లో పార్టీ నిర్మాణంపై చర్చ జరుగుతుంది. రాహుల్ గాంధీ పర్యటన తర్వత డీసీసీ అధ్యక్షుల నియామకం చేపడతారు. ఇప్పటికే పీసీసీ కొంత కసరత్తు చేసిందని ప్రచారం నడుస్తోంది. రాహుల్ టూర్ ఉండటంతో ఆ కసరత్తుకు బ్రేక్ పడింది. కాకపోతే కమిటీపై మెలిక పంచాయితీ మాత్రం గ్రేటర్ మీద పడింది. గ్రేటర్ పరిధిలో పార్టీ బలంగానే ఉన్నా.. పాతికకు పైగా సెగ్మెంట్లు ఉన్నా నాయకత్వం అంతంత మాత్రమే. ప్రస్తుతం మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్ పార్టీకి నాయకత్వం…
గ్రేటర్ హైదరాబాద్ నేతలతో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సన్నాహక సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలు పార్టీలో చర్చగా మారాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉప్పల్ నియోజకవర్గ పంచాయితీ బట్టబయలైంది. నియోజకవర్గ పరిధిలో ఎవరి పర్యవేక్షణలో కార్యక్రమాలు జరగాలన్నదానిపై చర్చ హీటెక్కించిందట. దాని చుట్టూనే ప్రస్తుతం పార్టీ వర్గాల చెవులు కొరుకుడు ఎక్కువైంది. ఎమ్మెల్యే పర్యవేక్షణలోనే కార్యక్రమాలు జరగాలని ఎమ్మెల్యే భేతి సుభాష్రెడ్డి ప్రతిపాదించారట. ఆ మాటలు వినగానే కేటీఆర్ తీవ్ర అసంతృప్తి…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ 48 డివిజన్లు గెల్చుకుంది. GHMC ఎన్నికల ద్వారా సిటీలో కాషాయం పార్టీకి సానుకూల వాతావరణం వచ్చిందన్నది కమలనాథుల అభిప్రాయం. అయితే ఎన్నికలు అయ్యి దాదాపు 15 నెలలు కావస్తోంది. రోజులు గడిచిపోతున్నాయి కానీ.. GHMCలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎవరో పార్టీ తేల్చలేదు. పార్టీ పరంగా కార్పొరేటర్లకు ఇచ్చే పదవులపైనా ఉలుకు.. పలుకు లేదు. ఈ పదవుల కోసమే కొందరు కాచుకుని ఉన్నారు. GHMCలో బీజేపీలో ఫ్లోర్ లీడర్…