Distribution of Bathukamma sarees from today: బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ప్రభుత్వం ఇచ్చే చీరల పంపిణీ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. కోటి మందికిపైగా లబ్దిదారులకు చేరేలా ప్రణాళిక సిద్ధం చేశారు. 24 రకాల డిజైన్లు, 10 ఆకర్షణీయమైన రంగులలో మొత్తం 240 రకాల త్రెడ్ బోర్డర్తో చీరలను ప్రభుత్వం తయారుచేయించింది. ఇందుకోసం రూ.339 కోట్లు ఖర్చుచేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం సాగుతుంది. రాష్ట్రంలోని ఈ…
Tension at Tank Bund: ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత…రూ,800 కోట్ల పెండింగ్ బిల్లులను చెల్లించాలని GHMC ప్రధాన కార్యాలయం ముట్టడికి కాంట్రాక్టర్లు బయలుదేరారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.ఇరువురి మధ్య తీవ్ర వ్యాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాంట్రాక్టర్లకు మద్దతుగా BJP కార్పొరేటర్ల నిరసన వ్యక్తం చేసారు. దీంతో అవాంఛ నీయ సంఘటనలు జరకుండా భారీగా పోలీసుల మోహరించారు. నిరసన తెలుపుతున్న పలుకాంట్రాక్టర్ల పోలీసులు అదుపులో తీసుకున్నారు. GHMC కౌన్సిల్…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కొత్త ఆదాయ మార్గంపై దృష్టి సారించింది.. ఇప్పుడు పరిస్థితి కొంత మారినా.. సాధారణంగా జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర.. గందరగోళమైన పరిస్థితి ఉంటుంది.. ఎక్కడికక్కడ ఓపెన్ స్థలాల్లో ట్రాన్స్ఫార్మర్లు దర్శనమిస్తాయి.. ఇవి ప్రమాదాలకు పొంచి ఉంటాయి.. చివరకు చెత్త కొందరు ప్రజలు అక్కడే పడవేసి వెళ్లిపోతుంటారు.. అయితే, వాటిని ఆదాయ వనరులుగా వినియోగించేకునే ప్లాన్ చేస్తుంది జీహెచ్ఎంసీ.. అంటే.. ప్రజల భద్రతతో పాటు పారిశుధ్యాన్ని పెంపొందిస్తూ.. సిటీ వ్యాప్తంగా…
మాధాపూర్ నిఫ్ట్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ మూగజీవులపై క్రూరత్వం ప్రదర్శించాడు. తన సెక్యూరిటీ సిబ్బంది చేత కుక్కల్ని దారుణంగా హింసించాడు. డైరెక్టర్ ఆదేశాల మేరకు..
కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలో జనజీవనం అతలాకుతలం అయ్యింది. అయితే జీహెచ్ ఎంసీ ఉద్యోగులు, కార్మికులను సైతం తీవ్ర ప్రభావం చూపుతోంది. నగరంలో ఇప్పటికే ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరో మూడు రోజుల పాటు కురిసే అవకాశముంది. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందికి వర్షాలు తగ్గే వరకు సర్కారు సెలవులను రద్దు చేసింది. వానలు తగ్గేవరకు నగరవాసులకు అందుబాటులో వుండాలని పేర్కొంది. రౌండ్ ది క్లాక్…
తెలంగాణ వ్యాప్తంగా గత ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వానలకు జనజీవనం అతలాకుతలం అయింది. వానలకు నదులు, వంకలు, చెరువలు, ప్రాజెక్టులు వరద నీటితో పారుతున్నాయి. ఇక నగరంలో ఇవాళ బలమైన ఈదురుగాలులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ఎక్కువ తీవ్రతతో బలమైన గాలులు వీస్తాయని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేసారు. ప్రయాణికులు, పాదచారులు చెట్ల కింద ఉండొద్దని నగర వాసులకు సూచించారు. ప్రయాణికులు, వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నగరంలో అత్యవసరమైతేనే…