Home
Gandhi Hospital%E2%80%8C
Gandhi Hospital%E2%80%8C News
-
Hyderabad: ఘట్కేసర్లో విషాదం.. రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య!
Hyderabad: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. దంపతులు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడటంతో అటు వారి సొంత గ్రామంలోనూ, ఇటు వారు నివసిస్తున్న ప్రాంతంలోనూ తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపాయిపేట గ్రామానికి చెందిన రవికుమార్, శిరీష దంపతులు ఘట్కేసర్–బీబీనగర్ రైల్వే మార్గంలోని ఎన్ఎఫ్సీ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
Ebola Virus : హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో ఎబోలా వైరస్ అనుమానంతో చేరిన సుడాన్ దేశస్థుడి వైద్య పరీక్షల నివేదిక (రిపోర్ట్) నెగిటివ్గా నిర్ధారణ అయింది. దీనితో గాంధీ ఆసుపత్రి వైద్య వర్గాలు, రాష్ట్ర ఆరోగ్య శాఖ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయి. సుడాన్ దేశం నుండి వచ్చిన 35 ఏళ్ల వ్యక్తికి ఎబోలా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో నిన్న ఆయనను గాంధీ ఆసుపత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. నిన్న ఉదయాన్నే ఆసుపత్రి వైద్యులు సదరు వ్యక్తి నుంచి… -
Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
Hyderabad: హైదరాబాద్లో ఎబోలా అనుమానిత కేసులు కలకలం రేపాయి. ఎబోలా లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన ఇద్దరు వ్యక్తులను రాత్రి సమయంలో అపోలో ఆస్పత్రి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో ఎమర్జెన్సీ విభాగంలో వారికి చికిత్స అందిస్తున్నారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్న వైద్య బృందం అవసరమైన పరీక్షలు నిర్వహిస్తోంది. రోగుల ప్రయాణ వివరాలు, వైద్య చరిత్ర, సంప్రదించిన వ్యక్తుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. పరిస్థితిని ఆరోగ్య శాఖ అధికారులు పర్యవేక్షిస్తూ అవసరమైన జాగ్రత్తలు… -
Hyderabad : 50 ఏళ్ల మహిళ నాలుక కోసేసిన ప్రియుడు
హైదరాబాద్లోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత క్రూరమైన ఘటన వెలుగుచూసింది. గత ఆరు నెలలుగా తనతో కలిసి లివిన్స రిలేషన్ సాగిస్తున్న ఒక 50 ఏళ్ల మహిళపై ఆమె ప్రియుడు నరరూప రాక్షసుడిలా ప్రవర్తించాడు. ఇద్దరి మధ్య జరిగిన వివాదంలో తీవ్ర ఆవేశానికి లోనై, చాకుతో ఆమె నాలుకను కోసి పారిపోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుషాయిగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ ప్రాంతానికి చెందిన సదరు మహిళ భర్త పదేళ్ల… -
HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
HYD LOVE MURDER: సికింద్రాబాద్ చిలకలగూడలో ఓ యువకుడి ప్రేమ.. అతని ప్రాణాలు తీసింది. యువతి సోదరులు, బంధువులు కక్షకట్టి దాడి చేయడంతో బీటెక్ చదువుతున్న యువకుడు ప్రాణాలు వదిలాడు. రాత్రిపూట జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా సిటీని ఉలిక్కపడేలా చేసింది. పైన ఫోటోలో ఉన్న యువకుడి పేరు యువన్ అలియాస్ అఖిల్. ప్రస్తుతం అల్వాల్లో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న ఓ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. గతంలో సీతాఫల్మండీలో ఉన్న… -
Damodara Raja Narasimha : దానిపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది.. త్వరలో అన్ని పరిష్కారం అవుతాయి..
ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గాంధీ ఆస్పత్రిని సందర్శించి పేషెంట్లు, అటెండెంట్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆస్పత్రిలో డ్రైనేజ్ సమస్య, ఎలక్ట్రిసిటీ, ఫైర్ సర్వీసులు, నర్సింగ్ విభాగంలో కొరతలు ఉన్నాయని గుర్తించామని తెలిపారు. -
Dr Namrata: ముగిసిన డాక్టర్ నమ్రత 5 రోజుల కస్టడీ.. వెలుగులోకి ఆకృత్యాలు..!
సృష్టి సరోగసి అక్రమాల కేసులో ఏ1గా ఉన్న ఉన్న డాక్టర్ నమ్రత 5 రోజుల కస్టడీ విచారణ ముగిసింది. గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ నమ్రతకు వైద్య పరీక్షల కోసం నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్ నుంచి తరలించారు. వైద్య పరీక్షలు అనంతరం సికింద్రాబాద్ కోర్టులో డాక్టర్ నమ్రతను హాజరు పర్చనున్నారు. కస్టడీలో భాగంగా పలు అంశాలపై డాక్టర్ నమ్రతాను పోలీసులు విచారించారు. -
Hyderabad: నిజం ఒప్పుకున్న సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు..
Hyderabad Surrogacy Racket: సృష్టిలో అక్రమాలు నిజమే అంటూ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత ఒప్పుకున్నారు.. చాలావరకు తెలిసే తప్పులు చేశామని పోలీసులకు స్పష్టం చేశారు. సరోగసి చేయకపోయినా చేసినట్లు దంపతులను నమ్మించి మోసం చేశామన్నారు. రాజస్థాన్ దంపతులను కూడా సరోగసి చేయకపోయినా చేసినట్లు నమ్మించామని.. డీఎన్ఏ పరీక్షల నివేదికలు కావాలని అడగడంతో విషయం బయటపడుతుందని తప్పించుకున్నామన్నారు. -
Medchal: మేడ్చల్లో దారుణం.. బ్యాగులో మహిళ మృతదేహం..
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లి పియస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీ నిర్మానుష్య ప్రాంతంలో బ్యాగులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది.. బ్యాగ్ నుంచి దుర్వాసన వస్తుందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతురాలు వయసు 25 నుంచి 35 సంవత్సరాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. -
Damodara Raja Narasimha : ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్.. రంగంలోకి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
Damodara Raja Narasimha : తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జూన్ 2న జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ స్పందించారు. మొత్తం 92 మంది రోగులు అస్వస్థతకు గురవగా, వారిలో 18 మందిని తీవ్రంగా ఉండటంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారిని గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా సహా ఇతర ఆసుపత్రుల్లో ఏర్పాటు…
తాజావార్తలు
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
-
OTR: ‘నో పాలిటిక్స్… ఓన్లీ రూల్స్’.. నిబంధనలకే ప్రాధాన్యం అంటున్న అటవీశాఖ ఉన్నతాధికారి..
-
Story Board : రాజధానిని రగిలించారు.. చట్టసభల్ని స్తంభింపజేశారు
-
Prabhas Sreenu: “ఆ వార్తలు చదివి చాలా బాధపడ్డా”.. సినియర్ యాక్టర్తో రూమర్స్పై ప్రభాస్ శ్రీను రియాక్షన్
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!