Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలకు ఘన విజయం లభించింది. గందర్బాల్లో ఓ ప్రైవేట్ కంపెనీ హౌసింగ్ క్యాంపులో ఆరుగురు కార్మికులను, వైద్యుడిని చంపేసిన ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు కాల్చి చంపాయి. ఉగ్రవాదిని పాకిస్తాన్కి చెందిన లష్కరేతోయిబాకి చెందిన జునైద్ అహ్మద్ భట్గా గుర్తించారు. ఈ ఉగ్రవాది గగాంగీర్, ఇతర ప్రదేశాల్లో జరిగిన ఉగ్రదాడుల్లో కూడా పాల్గొన్నాడు.